అన్వేషించండి

Nara Lokesh: గురువారం ఉదయం 9 గంటలకు సంచలన విషయం బయటపెడతా - లోకేష్ ట్వీట్ వైరల్

Nara Lokesh reveal: గురువారం ఉదయం 9 గంటలకు సంచలన విషయం బయటపెడతానని నారా లోకేష్ ప్రకటించారు. 2019లో వెళ్లిపోయిన ఓ సంస్థ పెట్టుబడుల గురించి నారా లోకేష్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

Nara Lokesh announced Big reveal on 9 am : ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ తన X ఖాతాలో పోస్ట్ చేసిన ట్వీట్ పెట్టుబడులు, పరిశ్రమల వర్గాల్లో ఆసక్తి కలిగించింది. "2019లో కొత్త ప్రాజెక్టులు ఆపిన ఒక కంపెనీ, నవంబర్ 13, 2025  ఏపీలో ' తుఫాన్‌'లా తిరిగి వస్తోంది. ఇది ఎవరు?? 9 AMకు గ్రాండ్ అనవీల్! ట్యూన్‌లో ఉండండి!!  అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్  వైరల్ గామారింది. 

2019లో YSRCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికల ప్రకటనలు, భూమి సమస్యలు, పాలసీ మార్పుల వల్ల అనేక పెద్ద కంపెనీలు కొత్త ప్రాజెక్టులు ఆపేశాయి. ఇప్పుడు TDP-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం   వేగవంతమైన సౌకర్యాలు, ఇన్సెంటివ్స్   ఇస్తూ పెట్టుబడులు తిరిగి తీసుకురువడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఏ సంస్థ అన్నదానిపై లోకేష్ క్లూ ఇవ్వలేదు. 

విశాఖలో 13, 14 తేదీల్లో  జరగనున్న ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహాల్లో భాగంగా నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు.అక్కడ మీడియాతో మాట్లాడారు.  పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాల కల్పన కీలకం.. టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయన్నారు.  ఐటీ, తయారీ, సేవలు, పర్యాటక రంగాలు చాలా కీలకం.. లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారనన్నారు. పరిశ్రమలు ఏపీని ఎంచుకోవడానికి 3 కీలక కారణాలున్నాయని.  మంచి సంబంధాలు నెలకొల్లుతున్నందునే పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.  పలు రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు నడుస్తోంది.. ఏపీలో మాత్రం డబుల్‌ ఇంజిన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ నడుస్తోందని గుర్తు చేశారు.  నమో అంటే  నరేంద్ర మోదీ మాత్రమే కాదు.. నాయుడు మరియు మోదీ కలయిక అన్నారు. 

వికసిత్‌ భారత్‌ విజన్‌ 2047 మేరకు ముందుకు సాగుతున్నాం.. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా సాగుతున్నాం.  స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రగతి దిశగా పయనిస్తున్నాం.. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోందని తెలిపారు.  సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశమిచ్చిన సీఐఐకి ధన్యవాదాలు.. సీఐఐ, చంద్రబాబు మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలున్నాయన్నారు.  ఉమ్మడి ఏపీ, తెలంగాణలో దాదాపు 50 శాతం సీఐఐ సదస్సులు జరిగాయన్నారు.                        

 విశాఖపట్నంలో నవంబర్ 14-15న జరిగే CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో 410 MoUs ఆమోదం కోసం సిద్ధంగా ఉన్నాయని లోకేష్ ప్రకటించారు. ఇవి $100 బిలియన్ల (రూ. 9.8 లక్షల కోట్లు) పెట్టుబడులు తీసుకువచ్చి, 7 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాయని అంచనా. 45 దేశాల నుంచి 300 మంది విదేశీ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటారు.                                      

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget