అన్వేషించండి

Nara Lokesh: 'వైపీసీ పాలనలో విచ్చలవిడిగా గంజాయి' - డ్రగ్స్ రహిత ఏపీ కోసం యుద్ధం చేద్దామని నారా లోకేశ్ పిలుపు

Andhra News: రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. వైసీపీ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని మండిపడ్డారు.

Nara Lokesh Slam Ysrcp Government on Ganza Issue: వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. సర్కారు పాపాలు.. పాఠశాల విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయని అన్నారు. పాఠశాలల్లో గంజాయి, మద్యం, అసాంఘిక కార్యకలాపాలు పెరిగాయని ఆరోపించారు. విద్యార్థి దశలోనే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజలారా కలిసి రండి.. మహమ్మారిపై యుద్ధం చేద్దాం’ అని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. 

ఆయన ఏమన్నారంటే.?

‘వైసీపీ (Ysrcp) పాలనలో బడి, గుడిలోకి గంజాయి వచ్చేసింది. విద్యార్థులు మద్యం మత్తులో బడికొస్తున్నారు. సీఎం జగన్ (CM Jagan) ఇంటి ఎదురుగా గంజాయికి బానిసైన పిల్లాడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తే పోలీసులు బలవంతంగా నోరు మూయించారు. సీఎం ఇంటి సమీపంలో డ్రగ్స్ మత్తులో గ్యాంగ్ రేప్ జరిగితే నేటికీ నిందితున్ని పట్టుకోలేదు. సీఎం ఇంటికి ద‌గ్గ‌ర‌లో మ‌ద్యం మ‌త్తులో ఉన్మాది.. అంధురాలిని హ‌త్య‌చేస్తే చ‌ర్య‌ల్లేవు. చంద్రగిరిలో 9వ తరగతి అమ్మాయి గంజాయికి బానిసైంది. చోడవరంలో ఏడో తరగతి విద్యార్థులు స్కూలులో మద్యం తాగారు. వీడియో తీసిన వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. విచ్చ‌ల‌విడి గంజాయి, డ్ర‌గ్స్, మ‌ద్యం విషాదాలు చూసి ఆవేద‌న‌తో క‌ట్ట‌డి చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరాను, లేఖ‌లు రాశాను. కనీస చర్యలు తీసుకుపోగా.. టీడీపీ కార్యాలయంపైనే దాడులు చేశారు. పిల్ల‌లు, యువ‌త బంగారు భ‌విష్య‌త్తు నాశ‌నం కావ‌డం చూసి ఆందోళ‌న‌తో ప్ర‌ధానికి లేఖ రాశాను. కేంద్రానికి విన‌తులు పంపాను. గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసి వివ‌రించాను. గంజాయి, మద్యం, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాల నుంచి పిల్లల్ని కాపాడే వరకూ పోరాడుతూనే ఉంటా. దండుపాళ్యం వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఈ మహమ్మారిపై ప్రతిపక్షంగా ఉంటూనే రాజీ లేని పోరాటం చేస్తున్నాం. టీడీపీ - జనసేన ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ రహిత ఏపీ కోసం మనమంతా కలిసి యుద్ధం చేద్దాం’ అని పిలుపునిచ్చారు.

అనంతపురం ఘటనపై

అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తిని పోలీసులు నగ్నంగా ఊరేగించిన ఘటనపై లోకేశ్ స్పందించారు. వైసీపీ ఆదేశాలతో కొందరు పోలీసులు వ్యవహరిస్తోన్న తీరుతో ప్రజాస్వామ్యం సిగ్గు పడుతోందన్నారు. 'రాక్ష‌స రాజులు కూడా సైకో జ‌గ‌న్‌లాంటి దుర్మార్గ‌ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేదు. అనంత జిల్లా విడ‌ప‌న‌క‌ల్లు మండ‌లం చీక‌ుల‌గురిలో వైసీపీ జెండాను కాల్చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై టీడీపీ కార్యకర్త బీసీ బోయ సామాజిక‌వ‌ర్గానికి చెందిన చంద్రమోహన్ ని అరెస్టు చేసిన పోలీసులు, న‌గ్నంగా కొడుతూ ఊరేగించిన ఘోరం చూశాక నా గుండె చెదిరిపోయింది. స‌భ్య‌ స‌మాజం త‌ల‌దించుకునేలా వ్య‌వ‌హ‌రించిన మీరు ప్ర‌జాధ‌నం జీతంగా తీసుకునే పోలీసులా ? లేక జగన్ కిరాయి సైన్య‌మా?. పార్టీ జెండా అంత ప‌విత్ర‌మైన‌దా! జాతీయ జెండా పెడ‌తామ‌న‌డం నేర‌మా? మా టీడీపీ సైనికుడిని న‌గ్నంగా ఊరేగించారు, ప‌క్క‌టెముక‌లు విర‌గ్గొట్టారు. మీరు చేసిన చ‌ర్య‌ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన శిక్ష అనుభ‌వించేందుకు సిద్ధంగా ఉండండి.' అంటూ ట్వీట్ చేశారు. 

Also Read: Hindupuram YSRCP : హిందూపురం టార్గెట్‌గా మంత్రి పెద్దిరెడ్డి రాజకీయాలు - వారం రోజులు అక్కడే మకాం !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget