అన్వేషించండి

Kesineni Nani : ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలు - సోమవారం ప్రధానికి ఫిర్యాదు చేస్తామన్న కేశినేని నాని !

ఏపీలో శాంతిభద్రతలపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతూండటంతో వైసీపీ నేతల్లో అసహనం పెరుగుతోందన్నారు.


Kesineni Nani :  ఏపీలో శాంతిభద్రతలు క్షీణించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫిర్యాదు చేస్తామని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.  శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రం బాగుపడదని అన్నారు.  రైతులకు సబ్సిడీపై మూడో విడత ట్రాక్టర్లను పంపిణీ చేసిన కార్యక్రమంలో కేశినాని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన  జగన్ మోహన్ రెడ్డి  సర్కార్‌పై  మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. టీడీపీ ఎంపీలతో కలిసి సోమవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రికి  ఫిర్యాదు చేస్తామన్నారు. పాలకులు ఎవరైనా మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటే ఇటువంటి దురాగతాలకు పాల్పడకూడదని తెలిపారు.               

వైసీపీ ప్రభుత్వంపై  ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్న కేశినేని నాని                                          

వైఎస్ఆర్‌సీపీ  ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో పూర్తి వ్యతిరేకత పెరిగిపోయిందని పేర్కొన్నారు. అందుకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సామంతుల పరిపాలనలో లేమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని గుర్తుచేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలు చేసిన చంద్రబాబుపైనే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.  ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే నాటికి హైదరాబాద్‌లో ఇటువంటి పరిస్థితులే ఉండేవని.. హైదరాబాద్‌లో బస్సు దిగాలంటే భయపడే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వగానే వాటిని కంట్రోల్ చేయడంతో పాటు ఆ తర్వాత వచ్చిన నాయకులు కూడా అదే పందాలో వెళ్లడంతో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.               

టెర్రరిస్టులను ప్రోత్సహించిన పాకిస్థాన్ చివరికి  బిచ్చమెత్తుకునే  స్థితికి వచ్చింది !       

టెర్రరిస్టులను ప్రోత్సహించిన పాకిస్థాన్ దేశం కూడా చివరకు శాంతి భద్రతలు లేకపోవడంతో దేశం బిచ్చమెత్తుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. ఐపీఎస్ అధికారులు సైతం ట్రాన్స్‌ఫర్ల భయంతో వైసీపీ నాయకులు చెప్పినట్టు వింటున్నారని కేశినేని నాని విమర్శించారు. ఐపీఎస్ అధికారులు ప్రజల కోసం పని చేయాలన్నారు. ప్రభుత్వం కోసం.. రాజకీయ పార్టీల కోసం పని చేస్తే  విలువ ఉండదన్నారు. 

గతంలో  దాడులు జరిగినా పట్టించుకోని కేశినాని నాని - ఇప్పుుడు వైసీపీపై విరుచుకుపడటంతో  టీడీపీలో ఆశ్చర్యం                                       

కేశినేని నాని గతంలో టీడీపీ ఆఫీసుపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు స్పందించలేదు. అయితే ఇప్పుడు మాత్రం అనూహ్యంగా పుంగనూరు ఘటనపై స్పందించడం నేరుగా చొరవ తీసుకుని ప్రధానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించడం...టీడీపీలో చర్చనీయాంసంగామారింది.  నిన్నామొన్నటి దాకా  చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పేవారు.  వైసీపీ ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్స కార్యక్రమాల్లో పాల్గొని హల్‌చల్ చేశారు. తాజాగా టీడీపీకి, చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడడంపై కృష్ణా జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమయింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
Kannada Actress Ranya Rao: కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
Kannada Actress Ranya Rao: కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ICC Champions Trophy: ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ ఇండియ‌న్ కే ఇవ్వాల్సింది.. నేనేతై అలాగే చేసేవాడిని: అశ్విన్
ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ ఇండియ‌న్ కే ఇవ్వాల్సింది.. నేనేతై అలాగే చేసేవాడిని: అశ్విన్
Weight Loss Meal Plan : పోషకాలతో కూడిన హెల్తీ డైట్​ ప్లాన్.. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఇది
పోషకాలతో కూడిన హెల్తీ డైట్​ ప్లాన్.. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఇది
Rohit Sharma Lands In Mumbai: దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
Telugu TV Movies Today: చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Embed widget