అన్వేషించండి

Kesineni Nani : ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలు - సోమవారం ప్రధానికి ఫిర్యాదు చేస్తామన్న కేశినేని నాని !

ఏపీలో శాంతిభద్రతలపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతూండటంతో వైసీపీ నేతల్లో అసహనం పెరుగుతోందన్నారు.


Kesineni Nani :  ఏపీలో శాంతిభద్రతలు క్షీణించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫిర్యాదు చేస్తామని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.  శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రం బాగుపడదని అన్నారు.  రైతులకు సబ్సిడీపై మూడో విడత ట్రాక్టర్లను పంపిణీ చేసిన కార్యక్రమంలో కేశినాని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన  జగన్ మోహన్ రెడ్డి  సర్కార్‌పై  మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. టీడీపీ ఎంపీలతో కలిసి సోమవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రికి  ఫిర్యాదు చేస్తామన్నారు. పాలకులు ఎవరైనా మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటే ఇటువంటి దురాగతాలకు పాల్పడకూడదని తెలిపారు.               

వైసీపీ ప్రభుత్వంపై  ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్న కేశినేని నాని                                          

వైఎస్ఆర్‌సీపీ  ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో పూర్తి వ్యతిరేకత పెరిగిపోయిందని పేర్కొన్నారు. అందుకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సామంతుల పరిపాలనలో లేమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని గుర్తుచేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలు చేసిన చంద్రబాబుపైనే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.  ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే నాటికి హైదరాబాద్‌లో ఇటువంటి పరిస్థితులే ఉండేవని.. హైదరాబాద్‌లో బస్సు దిగాలంటే భయపడే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వగానే వాటిని కంట్రోల్ చేయడంతో పాటు ఆ తర్వాత వచ్చిన నాయకులు కూడా అదే పందాలో వెళ్లడంతో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.               

టెర్రరిస్టులను ప్రోత్సహించిన పాకిస్థాన్ చివరికి  బిచ్చమెత్తుకునే  స్థితికి వచ్చింది !       

టెర్రరిస్టులను ప్రోత్సహించిన పాకిస్థాన్ దేశం కూడా చివరకు శాంతి భద్రతలు లేకపోవడంతో దేశం బిచ్చమెత్తుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. ఐపీఎస్ అధికారులు సైతం ట్రాన్స్‌ఫర్ల భయంతో వైసీపీ నాయకులు చెప్పినట్టు వింటున్నారని కేశినేని నాని విమర్శించారు. ఐపీఎస్ అధికారులు ప్రజల కోసం పని చేయాలన్నారు. ప్రభుత్వం కోసం.. రాజకీయ పార్టీల కోసం పని చేస్తే  విలువ ఉండదన్నారు. 

గతంలో  దాడులు జరిగినా పట్టించుకోని కేశినాని నాని - ఇప్పుుడు వైసీపీపై విరుచుకుపడటంతో  టీడీపీలో ఆశ్చర్యం                                       

కేశినేని నాని గతంలో టీడీపీ ఆఫీసుపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు స్పందించలేదు. అయితే ఇప్పుడు మాత్రం అనూహ్యంగా పుంగనూరు ఘటనపై స్పందించడం నేరుగా చొరవ తీసుకుని ప్రధానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించడం...టీడీపీలో చర్చనీయాంసంగామారింది.  నిన్నామొన్నటి దాకా  చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పేవారు.  వైసీపీ ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్స కార్యక్రమాల్లో పాల్గొని హల్‌చల్ చేశారు. తాజాగా టీడీపీకి, చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడడంపై కృష్ణా జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమయింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget