అన్వేషించండి

AP Investments: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి, రూ.3 వేల కోట్లకు మూడు ఎంవోయూలు : మంత్రి గౌతమ్ రెడ్డి

పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా మంత్రి మేకపాటి దుబాయ్ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే మూడు కంపెనీలతో రూ. 3 వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు. తాజాగా జెబెలి అలీ పోర్టు యాజమాన్యంతో భేటీ అయింది.

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబాయ్(Dubai) లో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం దుబాయ్‌ ఎక్స్‌పో వేదికను వినియోగించుకుంటుంది. దుబాయ్‌లో ఈ నెల 11వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగే పెట్టుబుడుల సదస్సులో ఏపీ పెవిలియన్‌ ఏర్పాటు చేసింది. పెట్టుబడులు ఆకర్షణే లక్షంగా సాగుతున్న ఈ పర్యటనలో పలు కంపెనీలతో పరిశ్రమల శాఖ ఎంవోయూ(MoU)లు చేసుకుంటుంది. ఇప్పటి వరకూ రూ.3 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. మంగళవారం అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో పరిశ్రమల శాఖ కీలక ఒప్పందం చేసుకుంది. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, గోడౌన్ల నిర్మాణం(గిడ్డంగులు), వాతావరణ ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ(Technology) అభివృద్ధికి రెండు ప్రభుత్వాలు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ సమక్షంలో ఏపీఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, తబ్రీద్ ఏసియా సీడీవో(చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్) ఫ్రాన్ కో-యిస్ జావియర్ బాల్ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. 

జెబెలి అలీ పోర్టు(Jebel Ali Port), పోర్టు ఆధారిత డీపీ వరల్డ్ పరిశ్రమను మంత్రి గౌతమ్ రెడ్డి బృందం సందర్శించింది. ఎగుమతులకు సంబంధించిన జెబెలి అలీ పోర్టు ప్రత్యేకతలను మంత్రి మేకపాటి అడిగి తెలుసుకున్నారు. 10 లక్షల కార్లను స్టోరేజ్ చేసే సామర్థ్యం ఉన్న పోర్టు, ఎలక్ట్రిక్, లాజిస్టిక్(Logistic), మానుఫాక్చరింగ్(Manufacturing), షుగర్ ఫ్యాక్టరీ యూనిట్లు, ఎగుమతుల చేసే విధానాలను ఆసక్తిగా పరిశీలించారు. ఏపీలో కూడా పోర్టు ఆధారిత అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు డీపీ వరల్డ్ ఆసక్తి చూపించింది. జెబెలి అలీ పోర్టులో కార్యకలాపాలను పరిశీలించేందుకు 40 వేల సీసీ కెమెరాలు(CC Cameras) ఏర్పాటు చేసినట్లు మంత్రి గౌతమ్ రెడ్డికి డీపీ వరల్డ్ మేనేజర్ అహ్మద్ తెలిపారు. 

మల్టీ పార్కింగ్ స్టోరేజ్(Multi Parking Storage) తో సహా అలీ పోర్టులో ఉన్న ప్రత్యేకతలు ఏపీలో పోర్టుల నిర్వహణ(Ports Management) ఎలా చేయాలనే ఉద్దేశంతో పోర్టు పర్యటన సాగింది. డీపీ వరల్డ్(DP World) పరిశ్రమకు సంబంధించిన యాజమాన్యంతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Mekapati Goutam Reddy) సమావేశం అయ్యారు. ఏపీలో మౌలిక వసతుల గురించి డీపీ వరల్డ్ ప్రతినిధులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తో  సమావేశమైన ఆ సంస్థ సీఈవో యువరాజ్ నారాయణ్(YuvaRaj Narayan) తో చర్చించిన అంశాలకు ప్రస్తుత సమావేశంలోనూ చర్చించారు. అనంతరం అబుదాబీలోని ఉక్కు రంగానికి చెందిన కొనరస్ కంపెనీని మంత్రి బృందం సందర్శించింది. సీఎం జగన్(CM Jagan) నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం కడప జిల్లాలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్(Steel Plant) గురించి మంత్రి కొనరస్ ప్రతినిధులకు తెలిపారు. గ్యాస్ సహా ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget