అన్వేషించండి

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్‌ వాల్‌కు భారీ నష్టం, పెద్ద గుంతలు - మంత్రి అంబటి

ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్‌కు భారీ నష్టం వాటిల్లిందని, అది చాలా వరకూ దెబ్బతిన్నదని అంబటి రాంబాబు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దాదాపు 485 మీటర్ల మేర దెబ్బతిన్నదని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గత ప్రభుత్వంపై మరోసారి కీలక ఆరోపణలు చేశారు. ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్‌కు భారీ నష్టం వాటిల్లిందని, అది చాలా వరకూ దెబ్బతిన్నదని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దాదాపు 485 మీటర్ల మేర దెబ్బతిన్నదని అన్నారు. పెద్ద పెద్ద గుంతలు కూడా ఏర్పడ్డాయని అన్నారు. వీటిని సరి చేయకపోతే పనులు ముందుకు సాగవని చెప్పారు. దీన్ని సరి చేసేందుకు దాదాపు 2 వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అన్నారు. కాఫర్ డ్యాం పనులు పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.

నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ద్వారా స్టడీ చేశారని, దీనిపై మూడు రోజుల క్రిందటే నివేదిక వచ్చిందని అంబటి రాంబాబు తెలిపారు. ఈ భారీ తప్పిదానికి ఎవరిపై చర్యలు తీసుకోవాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని అంబటి చెప్పారు. ఆదివారం (మార్చి 5) పోలవరం ప్రాజెక్టు పనుల్ని మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు.

పోలవరంపై తాను రాజకీయ ఆరోపణలు చేయడం లేదని, ఇది తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారి తెలియనితనం వల్ల జరిగిందని అన్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి, రిబ్బన్ కట్ చేయాలన్న తాపత్రయంతోనో కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తి చేయకుండా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించారని అన్నారు. దానివల్లే ఇప్పుడు ఇంత అనర్థం జరిగిందని స్పస్టం చేశారు. డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతినడానికి ముమ్మాటికీ మానవతప్పిదమేనని అన్నారు. ఏర్పడ్డ పెద్ద గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూసెక్కుల ఇసుక అవసరం అని చెప్పారు. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్‌ చేయడం కోసం రూ.2 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా అవుతుందని చెప్పారు.

డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో దెబ్బతిన్న భాగం మొత్తం బాగుచేసి ఎలా పనులు ముందుకు తీసుకెళ్లాలని అనే విషయంపై అధికారులు పరిశీలిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. పనులు పూర్తి చేయడానికి రాబోయే నాలుగైదు నెలలు కీలకమని చెప్పారు. ఇది వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కలలు కన్న ప్రాజెక్టు అని, సీఎం జగన్‌ చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. ఆయనే ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget