అన్వేషించండి

Chittoor MP Candidates: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సిట్టింగ్ ఎంపీలకే వైసీపీ ఛాన్స్, కూటమి నుంచి అభ్యర్థులు ఎవరంటే!

AP Elections 2024: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ అనుకోకుండా సిట్టింగ్ ఎంపీలకే మరోసారి టికెట్ ఇచ్చింది. కూటమి నుంచి బరిలోకి దిగేవారు సిట్టింగ్ లను ఢీకొట్టి విజయం సాధించడం సాధ్యమేనా?

Loksabha Elections 2024 Chittoor and Tirupati MP Candidates: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈసారి ఎన్నికల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈ జిల్లాలో ఇప్పటి వరకు జరగని విధంగా ఈసారి ఎంపీ అభ్యర్థుల పోటీ ఉండబోతోంది. ఈ అంశాలను మీరు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే...

సిట్టింగ్ లకే వైసీపీ సీటు...
ఏపీ వ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలను వైసీపీ పార్టీ కొన్ని చోట్ల అవకాశం కల్పించింది. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మాత్రం పాత వారికే ఎంపీ అభ్యర్థులుగా మరోసారి బరిలో నిలిపింది. తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ ఎం గురుమూర్తి పోటీ చేస్తున్నారు. 2021లో జరిగిన  ఉప ఎన్నికల్లో ఆయన తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆయనను సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి గా తొలుత ప్రకటించిన.. సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన పార్టీ పై వ్యతిరేక స్వరం వినిపించి పార్టీ మారిపోవడంతో గురుమూర్తి ను తిరిగి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా రెడ్డప్ప మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా జీడీ నెల్లూరు కు ఆయనను ఎమ్మెల్యే గా ప్రకటించి.. అక్కడి ఎమ్మెల్యే నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన పోటీ చేయలేనని చెప్పడంతో తిరిగి చిత్తూరు ఎంపీ గా రెడ్డప్ప ను నియమించారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు కలిసే రాజంపేట పార్లమెంట్ అభ్యర్ది గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేయనున్నారు.

టీడీపీ కూటమి కొత్త వారికే అవకాశం 
టీడీపీ పార్టీతో బీజేపీ, జనసేన పార్టీ కూటమిలో భాగంగా పలు విధాలుగా మార్పులు జరిగాయి. ఇందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మూడు ఎంపీలకు గాను బీజేపీ రెండు సీట్లు, టీడీపీ ఒక సీటు కైవసం చేసుకుంది. తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా వైసీపీ నుంచి 2014లో ఎంపీగా, 2019లో గూడూరు ఎమ్మెల్యే గా గెలుపొందిన వరప్రసాద్ ఈసారి బీజేపీ పార్టీ నుంచి తొలిసారి తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్నారు. రాజంపేట ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి బీజేపీ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు ఎంపీగా దగ్గుమల్ల ప్రసాద రావు తొలిసారి పోటీ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పార్టీలోని సిట్టింగ్ ఎంపీ లను గెలిపిస్తారో... కూటమి నుంచి పోటీ లో ఉన్న అభ్యర్థులను ఎంపీగా ఆశీర్వదిస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడక తప్పదు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget