By: ABP Desam | Updated at : 28 Jun 2022 04:22 PM (IST)
నిన్న సూరిపై సీరియస్ కామెంట్స్ చేసిన కేతిరెడ్డి
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రతిపక్షాలపై ముఖ్యంగా బీజేపీ లీడర్లపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన కామెంట్స్ జిల్లా వ్యాప్తంగా సంచలనమయ్యాయి. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్న టైంలో వారిపై గుర్తు తెలియన వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపింది.
తన వెంట్రుక కూడా పీకలేరంటూ వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన కామెంట్స్కు కౌంటర్ ఇద్దామని బీజేపీ లీడర్లు ప్రెస్క్లబ్ వద్దకు వచ్చారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరించారు.
జనసేన, బీజేపీ నాయకులపై కేతిరెడ్డి చేసిన కామెంట్స్పై స్పందించేందుకు యత్నించిన బీజేపీ లీడర్లపై దాడి జరిగింది. ప్రెస్క్లబ్లో బీజేపీ నాయకులు ఆరుగురిని గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో చితకబాదారు. తీవ్రంగా గాయపరిచారు. ఆరుగురు తీవ్ర రక్తస్రావం జరగడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం నియోజకవర్గం ప్లీనరీ సమావేశాన్ని ధర్మవరంలో నిర్వహించారు. ప్లీనరీకి ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి భారీ బైక్ ర్యాలీతో వచ్చారు. అనంతరం ఆయన విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రారా తేల్చుకుందాం అంటూ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు వరదాపురం సూరీని ఉద్దేశించి సవాల్ విసిరారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తే వైసిపి కార్యకర్తలను కాళ్లు చేతులు విరుస్తాను అని ప్రగల్బాలు పలికిన ఇతను ఎన్నికల అనంతరం ఓటమి అవమానంతో అసోం పారిపోయారని ఎద్దేవా చేశారు. ఆది సినిమా తరహాలో అంతా అసోం రైలు ఎక్కేసారని విమర్శించారు. కేవలం ఓటమి చెందినంత మాత్రాన ఓట్లేసిన ప్రజలను వదిలిపెట్టి అసోం పారిపోవడం నాయకత్వం లక్షణం కాదన్నారు. ప్రజల మధ్య ఉండి ప్రజాసమస్యలు తీర్చడం చేతకాదు అని తీవ్రంగా విమర్శించారు.
తమ కేడర్ను అదుపులో పెట్టినందునే.. ధర్మవరంలో బీజేపీకి లీడర్ లేకపోయినా శ్రేణులు ప్రశాంతంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. లేకపోతే పొలిమేరలు దాటేవారంటూ సంచలన కామెంట్స్ చేశారు. అధికారం పక్కన పెడతా రండ్రా తేల్చుకుందాం అంటూ సవాలు విసిరారు. ఏది కబ్జానో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో సూరీడు అనుచరులు ఉన్నారని ఎద్దేవా చేశారు. తన వెంట్రుక కూడా పీకలేరు అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
IAS Transfers: ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ - కొత్త పోస్ట్ క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - నిన్న ఒక్కరోజులో శ్రీవారి హుండీకి ఆదాయం ఎంతంటే !
Rains in AP Telangana: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ
Petrol-Diesel Price, 13 August: ఈ నగరంలో బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా
YS Vijayamma : వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!
Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో
TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?