అన్వేషించండి

Dharamavaram Politics: వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి కౌంటర్ ఇవ్వబోయిన బీజేపీలీడర్లపై దాడి- ఆరుగురికి గాయాలు- ఇద్దరి పరిస్థితి విషమం

తాను కంట్రోల్ చేస్తున్నాను కాబట్టే బీజేపీ లీడర్లు బయట తిరుగుతున్నారన్న వైసీపీ ఎమ్మెల్యేకు కౌంటర్ ఇవ్వబోయిన నేతలపై దాడి. దీంతో ధర్మవరంలో పరిస్థితులు చాలా గంభీరంగా మారాయి.

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రతిపక్షాలపై ముఖ్యంగా బీజేపీ లీడర్లపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన కామెంట్స్ జిల్లా వ్యాప్తంగా సంచలనమయ్యాయి. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్న టైంలో వారిపై గుర్తు తెలియన వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపింది. 

తన వెంట్రుక కూడా పీకలేరంటూ వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇద్దామని బీజేపీ లీడర్లు ప్రెస్‌క్లబ్‌ వద్దకు వచ్చారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరించారు. 

జనసేన, బీజేపీ నాయకులపై కేతిరెడ్డి చేసిన కామెంట్స్‌పై స్పందించేందుకు యత్నించిన బీజేపీ లీడర్లపై దాడి జరిగింది. ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ నాయకులు ఆరుగురిని గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో చితకబాదారు. తీవ్రంగా గాయపరిచారు. ఆరుగురు తీవ్ర రక్తస్రావం జరగడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం నియోజకవర్గం ప్లీనరీ సమావేశాన్ని ధర్మవరంలో నిర్వహించారు. ప్లీనరీకి ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి భారీ బైక్ ర్యాలీతో వచ్చారు. అనంతరం ఆయన విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రారా తేల్చుకుందాం అంటూ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు వరదాపురం సూరీని ఉద్దేశించి సవాల్ విసిరారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తే వైసిపి కార్యకర్తలను కాళ్లు చేతులు విరుస్తాను అని ప్రగల్బాలు పలికిన ఇతను ఎన్నికల అనంతరం ఓటమి అవమానంతో అసోం పారిపోయారని ఎద్దేవా చేశారు. ఆది సినిమా తరహాలో అంతా అసోం రైలు ఎక్కేసారని విమర్శించారు. కేవలం ఓటమి చెందినంత మాత్రాన ఓట్లేసిన ప్రజలను వదిలిపెట్టి అసోం పారిపోవడం నాయకత్వం లక్షణం కాదన్నారు. ప్రజల మధ్య ఉండి ప్రజాసమస్యలు తీర్చడం చేతకాదు అని తీవ్రంగా విమర్శించారు. 

తమ కేడర్‌ను అదుపులో పెట్టినందునే.. ధర్మవరంలో బీజేపీకి లీడర్ లేకపోయినా శ్రేణులు ప్రశాంతంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. లేకపోతే పొలిమేరలు దాటేవారంటూ సంచలన కామెంట్స్ చేశారు. అధికారం పక్కన పెడతా రండ్రా తేల్చుకుందాం అంటూ సవాలు విసిరారు. ఏది కబ్జానో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో సూరీడు అనుచరులు ఉన్నారని ఎద్దేవా చేశారు. తన వెంట్రుక కూడా పీకలేరు అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
Mohan Babu Attack on Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
Mohan Babu Attack on Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
Rammohan Naidu: 2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
Tripti Dimri : ఇన్​స్టాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన త్రిప్తి దిమ్రి.. అది జస్ట్ క్యారెక్టర్​ మాత్రమే అంటోన్న యానిమల్ బ్యూటీ
ఇన్​స్టాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన త్రిప్తి దిమ్రి.. అది జస్ట్ క్యారెక్టర్​ మాత్రమే అంటోన్న యానిమల్ బ్యూటీ
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Embed widget