అన్వేషించండి

రైల్వే విద్యుదీకరణపై స్పెషల్ ఫోకస్, గద్వాల్ - కర్నూలు మధ్య పనులను పూర్తి

విద్యుదీకరణ పనులపై రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. దీంతో ఏడాది చివర్లో గద్వాల్ - కర్నూలు సిటీ మధ్య విద్యుదీకరణ పనులను రైల్వే శాఖ పూర్తి చేసింది.

రైల్వే విద్యుదీకరణ పనులపై రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. దీంతో ఏడాది చివర్లో గద్వాల్ - కర్నూలు సిటీ మధ్య విద్యుదీకరణ పనులను రైల్వే శాఖ పూర్తి చేసింది.
ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ ...
దక్షిణ మధ్య రైల్వే  2022-2023 ఆర్థిక సంవత్సరం చివరి అంకంలో విద్యుదీకరణకు అధిక ప్రాధాన్యమిస్తూ పనులను వేగవంతం చేసింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని విభాగాలను విద్యుదీకరించిన మార్గాల జాబితాలో చేర్చింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గద్వాల్ - కర్నూలు సిటీ మధ్య 54 రూట్ కిమీ దూరం వరకు విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. జోన్ పరిధిలో సికింద్రాబాద్ - ధర్మవరం  మధ్య  పూర్తిస్థాయిలో విద్యుదీకరించిన రైలు మార్గంలో ఇప్పుడు విద్యుత్ ట్రాక్షన్‌  ద్వారా రైళ్లను నడిపే వీలు కలిగిందని రైల్వే శాఖ ప్రకటించింది.
విద్యుదీకరణ ప్రాజెక్ట్ లో స్టేషన్లు...
గద్వాల్ - కర్నూలు సిటీ స్టేషన్ల మధ్య  విద్యుదీకరణ, డోన్  - కర్నూలు సిటీ - మహబూబ్‌నగర్‌..  సికింద్రాబాద్ - ముద్ఖేడ్ - మన్మాడ్ విద్యుదీకరణ ప్రాజెక్ట్ లో భాగంగా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ 2018 -19 సంవత్సరంలో రూ. 916.07 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో  పనులు చేపట్టడం జరిగిందని రైల్వే అదికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ మధ్య విభాగాన్ని వేరే ప్రాజెక్టులో భాగంగా మంజూరు చేయటం ద్వారా ఇప్పటికే విద్యుదీకరించామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కింద మహబూబ్‌నగర్ - గద్వాల్ & కర్నూలు సిటీ -డోన్ ల  విభాగాల మధ్య పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధి లోని డోన్  - గుత్తి - ధర్మవరం మరియు నైరుతి రైల్వే  పరిధిలోని ధర్మవరం - బెంగళూరు సిటీ  విభాగాల మధ్య  విద్యుదీకరణ కూడా పూర్తయింది. అందువల్ల, ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు రెండూ, ఇప్పుడు హైదరాబాద్ - ధర్మవరం తో పాటుగా, బెంగుళూరు వరకు సజావుగా ప్రయాణించేందుకు వీలుంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. రైలు ప్రారంభమయిన స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు రైళ్లను ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌త  నడిపేందుకు వీలుపడుతుందని అంటున్నారు.
కార్బన్ వినియోగానికి చెక్....
ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో రైళ్ల  రాకపోకల నిర్వహణ వల్ల కార్బన్ వినియోగం తగ్గుతుందని, దీని వలన పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని రైల్వే అదికారులు అంటున్నారు. ఇంజిన్ మార్పిడిని  నివారించడం ద్వారా రైళ్ల నిర్వహణలో రైలు ప్రయాణీకులకు ఎలాంటి అంతరాయం లేని రాకపోకలు సాగించేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు. ప్రయాణికులు, సరకు రవాణా చేసే రైళ్ల మార్గ మధ్య నిలుపుదలను తగ్గిస్తుందని, రైళ్ల సగటు వేగాన్ని కూడా మెరుగుపరచేందుకు వీలుంటుందని తెలిపారు. విభాగాల మధ్య సామర్థ్యం పెంపుదల కారణంగా ఈ విభాగంలో  మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు. విద్యుదీకరణ వల్ల రైల్వేలకు ఇంధన ఖర్చులు పెద్ద ఎత్తున ఆదా అవుతుందని, దీంతో పాటుగా కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయని తెలిపారు.
సిబ్బందికి జీఎం అభినందనలు..
దక్షిణ మధ్య  రైల్వే  జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. విద్యుద్దీకరణ పనులను పూర్తి  చేయడంలో అద్భుతమైన పని తీరును కనబరిచటంతో పాటుగా, అంకితభావంతో  పనిచేసినందుకు ఎలక్ట్రికల్ విభాగం, అధికారులు, సిబ్బందిని  అభినందించారు. గద్వాల్- కర్నూల్ స్టేషన్ల మధ్య ఈ మార్గంలో విద్యుదీకరణ పూర్తవడంతో,  సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య మొత్తం సెక్షన్‌లో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు జనరల్ మేనేజర్ తెలిపారు. జోన్ పరిధిలో ఇప్పటికే ఉన్న బ్రాడ్ గేజ్ మార్గాలను 100% విద్యుదీకరణ దిశగా  వడివడిగా  అడుగులు వేస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget