Kurnool Bus Accident: వాళ్లు మద్యం తాగలేదు- కర్నూలు బస్సు ప్రమాదంలో వీడిన మిస్టరీ - ఇవిగో ఫుల్ డీటైల్స్
Kurnool bus accident: కర్నూలు బస్సు ప్రమాదంలో పోలీసులు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన బైక్ నడిపిన వారు మద్యం సేవించలేదని తేలింది.

Kurnool bus accident full details: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం మిస్టరీని పోలీసులు చేధించారు. బస్సును బైక్ ను ఢీకొట్టలేదు. కానీ అంతకు ముందే ఆ బైక్ స్కిడ్ అయి కిందపడిపోయింది. బైక్ నడుపుతున్న యువకుడు శివశంకర్ చనిపోయాడు. బైక్ వెనుక కూర్చున్న ఎర్రిస్వామి అనే వ్యక్తి.. బైక్ ను.. మృతదేహాన్ని పక్కకు జరిపే ప్రయత్నంలో ఉన్నారు. ఈ లోపే బస్సు వేగంగా దూసుకు వచ్చి బైక్ మీద నుంచి వెళ్లిపోయింది. బైక్ ను ఈడ్చుకు వెళ్లడంతో స్పార్క్లు వచ్చి మంటలు అంటున్నాయి.
పోలీసుల దర్యాప్తు ప్రకారం, శివశంకర్ తన మిత్రుడు అయిన ఎర్రిస్వామిని ఆయన ఊరు తుగ్గలిలో దిగబెట్టేందుకు తెల్లవారుజామున బైక్ తీసుకుని బయలుదేరారు. సమీపంలోని దాభాలో వారు టిఫిన్ చేశారు. తర్వాత కియా షోరూం సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించుకున్నారు. ఆ తర్వాత హైవేపై వెళ్తున్న సమయంలో బైక్ స్కిడ్ అయి, డివైడర్పై ఢీకొట్టింది. శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు . ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. ఎర్రిస్వామి బైక్ ను.. శివశంకర్ ను రోడ్డుపక్కకు లాగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే.. బస్సు వేగంగా వచ్చింది. బస్సు మంటల్లో చిక్కుకోవడంతో భయపడిన ఎర్రిస్వామి అక్కడ్నుంచి తన ఊరికి వెళ్లిపోయాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ గమనించి ఎర్రిస్వామిని ప్రశ్నించి.. సాంకేతిక ఆధారాలను సరిపోల్చుకోవడంతో జరిగిందేమిటో స్పష్టత వచ్చింది.
కర్నూలు చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు
— Kurnool Police (@PoliceKurnool) October 25, 2025
జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు .#APPOLICE100#APPolice#appolice#AndhraPradeshPolice#PoliceKurnool#kurnoolpolice pic.twitter.com/Rv1D8MBgU4
పెట్రోల్ బంక్ వద్ద సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫుటేజీలో వారు మద్యం తాగినట్లుగా ఉన్నట్లుగా పలువురు భావించారు. కానీ వారు మద్యం తాగలేదని పోలీసులు నిర్దారించారు. నిర్లక్ష్య డ్రైవింగ్, వర్షం కారణంగా బైక్ స్కిడ్ అయిందని గుర్తించారు.
వేగంగా వస్తున్న బస్ ఎదురుగా ఉన్న బైక్ ను గుర్తించలేదు. బైక్ను ఢీ కొట్టిన దాదాపు 300 మీటర్లు బైక్ను ఈడ్చుకెళ్లింది బస్. ఇదే బస్లో అగ్ని ప్రమాదానికి కారణమైంది. బైక్లో పెట్రోల్, ఇటు బస్ ఉన్న పెట్రోల్ తో పాటు.. లగేజీ బాక్స్ లో ఉన్న సెల్ ఫోన్లు కూడా పేలాయని గుర్తించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ వెళ్లిపోయారని అంటున్నారు. కానీ తామే అద్దాలను పగులగొట్టి.. వీలైనంత మందిని రక్షించామని వారు పోలీసులకు చెబుతున్నారు. బస్ డ్రైవ్ చేసిన లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్ నడిపి ప్రమాదంలో చనిపోయిన శివశంకర్ వయసు నిండా ఇరవై ఏళ్లు కూడా లేవు. పేద కుటుంబం నుంచి వచ్చిన అతను దూకుడు కారణంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి తన ప్రాణాలను పోగొట్టుకోవడంతో పాటు మరో ఇరవై మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారు.
ట్రెండింగ్ వార్తలు





















