అన్వేషించండి

JC Prabhakar Reddy: తాడిపత్రి రాజకీయం హాట్ హాట్...రాత్రంతా మున్సిపల్ ఆఫీసులో జేసీ ప్రభాకర్ రెడ్డి...అధికారులకు ఒంగి ఒంగి దండాలు

అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. తన సమావేశానికి అధికారులు గైర్హాజరు అయ్యారని రాత్రంతా కార్యాలయంలోని ఉండి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ నిరసన తెలిపారు.

 

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేసినా సెన్సేషన్. తాజా ఆయనకు తెచ్చిన ఆగ్రహం ఘటన ఆయన సమావేశం పెడితే అధికారులు గైర్హాజరు కావడం. మున్సిపల్‌ ఛైర్మన్‌ హోదాలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే అందరూ కట్టగట్టుకుని గైర్హాజరు అయ్యారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం సిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు కమిషనర్‌తో సహా అధికారులందరికీ జేసీ శనివారమే తెలపారు. ఈ సమయానికే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్‌ సిబ్బందితో కరోనా వైరస్‌పై అవగాహన ర్యాలీ,  సమీక్ష నిర్వహించారు. దీంతో అధికారులకు అయోమయ పరిస్థితి ఏర్పడింది.

ఈ ర్యాలీ పూర్తయ్యాక మున్సిపల్ కార్యాలయానికి అధికారులు వస్తారనే ఉద్దేశంతో 12.30 గంటలకు ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్లతో కలిసి కమిషనర్‌ ఛాంబర్‌లో ఎదురుచూశారు. మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమీక్ష అనంతరం అటు నుంచే ఇళ్లకు వెళ్లిపోయారు. కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి మధ్యాహ్నం నుంచి సెలవుపై వెళ్తూ ఇతరులకు బాధ్యతలు అప్పగించారని తెలియడంతో ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కార్యాలయానికి వచ్చే వరకు అక్కడి నుంచి తాను కదిలేది లేదని మున్సిపల్ కార్యాలయంలోనే ఆయన నిరసనకు దిగారు. సాయంత్రం 4.30 గంటలకు కొంత మంది అధికారులు కార్యాలయానికి రాగా, వారి నిబద్ధతను మెచ్చుకుంటున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి చూపిన హావాభావాలకు అధికారులు ఏం సమాధానం చెప్పలేని స్థితిలో పడ్డారు. 

మున్సిపల్ సిబ్బంది కనిపించడంలేదంటూ ఫిర్యాదు

తాడిపత్రి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది 26 మంది కనిపించడం లేదంటూ మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం రాత్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో చెప్పిన వివరాల ఇలా ఉన్నాయి. సోమవారం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డితో పాటు ఉద్యోగి చాంద్‌బాషాకు శనివారమే సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు. మున్సిపల్ వాట్సాప్‌ గ్రూప్‌లో కూడా మేసేజ్ చేసినట్లు తెలిపారు.  ఇటీవల అధికారులు టెంకాయలు విక్రయించే వారికి హెచ్చరికలు జారీచేశారు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులకు, ఉద్యోగులకు ఎవరైనా హాని తలపెట్టి ఉంటారేమోనని ఆందోళన చెందుతున్నామని, వారి ఆచూకీ కనుక్కొని చెప్పాలని జేసీ ప్రభాకరరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాత్రంతా ఆఫీసులో...అక్కడే స్నానం

వాస్తవానికి మున్సిపల్ ఛైర్మన్ హోదాలో తాడిపత్రిలోని పరిస్థితులపై జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులతో సమీక్ష పెట్టుకున్నారు. కానీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో మరో మీటింగ్‌ పెట్టి వారిని తీసుకెళ్లారని జేసీ అన్నారు. ఈ విషయంపై ఆగ్రహంతో అధికారులు వచ్చి మీటింగ్‌లో పాల్గొనే వరకూ తాను ఆఫీస్‌ నుంచి కదలని రాత్రంతా అక్కడే భీష్మించుకుని కూర్చొన్నారు. సోమవారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లిన ఆయన రాత్రి వరకూ అక్కడే ఉన్నారు. అయినా అధికారులు రాకపోయే సరికి రాత్రంతా అక్కడే ఉండి, అక్కడే భోజనం చేసి, పడుకున్నారు. ఇక ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, అధికారుల కోసం వేచిఉన్నారు.

కమిషనర్ ఆహ్వానం...కానీ

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని మున్సిపల్‌ కమిషనర్‌ నర్సింహప్రసాద్‌ మంగళవారం కలిశారు. సోమవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో జేసీని కలిసిన కమిషనర్‌ మంగళవారం అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ హోదాలో  సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి అధికారులు గైర్హాజరై ఈ రోజు రావాలని ఆహ్వానించడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: Tadipatri JC : తాడిపత్రిలో మళ్లీ టెన్షన్..! మున్సిపల్ ఆఫీసులో జేసీ ప్రభాకర్ ఆందోళన..!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget