అన్వేషించండి

Outsourcing Jobs: జగన్ ప్రభుత్వం ఆ 5 వాగ్దానాలను తుంగలో తొక్కింది: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఫైర్

జాబ్ క్యాలెండర్ అమలు మాట దేవుడెరుగు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పీకేసేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక మరోమాట చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించి మోసగించిందని తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటినాక బోడి మల్లన్న అన్నట్టు వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ అమలు మాట దేవుడెరుగు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పీకేసేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

2019 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి వైఎస్ చేసిన చేసిన ఐదు ప్రధానమైన వాగ్దానాలను తులసిరెడ్డి గుర్తుచేశారు. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, సకాలంలో పిఆర్సి అమలు చేయడం, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పించడం.. లాంటి 5 ముఖ్యమైన వాగ్దానాలను గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక ఈ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే వైఎస్ జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చేసిందేమిటని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఇతర ఉద్యోగుల తరహాలోనే  పనికి సమాన వేతనం కల్పించకపోవడమే కాకుండా ఈ మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో దాదాపు 50వేల మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగించడం దారుణం అన్నారు. ఇంకా రెండు లక్షల 50వేల మందిని తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. 

అసలు వివాదం ఏంటంటే.. 
రాష్ట్ర విభజన అనంతరం  2014-19 మధ్యలో 90 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా రిక్రూట్‌ అయ్యారని, వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిక్రూట్‌ మెంట్‌ కోసం ఏకంగా 'ఆప్కాస్‌' అనే వ్యవస్థ తీసుకొచ్చింది. దీని ద్వారా రాష్ట్ర కేంద్రంతోపాటు జిల్లాలో కూడా నియామకాలు చేసిందని, వీరందరు తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ అవుతాయని ఆశిస్తూ ఉండగా వేల మందిని వైఎస్ జగన్ సర్కార్ వారిని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వులు వీరికి శరాఘాతంగా మారాయని, రూ.16 వేల నుంచి రూ.23 వేలలోపు స్వల్ప జీతాలు ఇస్తున్నారని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను గుదిబండగా భావిస్తోందని ప్రభుత్వంపై బీజేపీ నేత మాధవ్ విమర్శలు చేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం, సమానపనికి సమాన వేతనం, ఇచ్చి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం' అని ప్రతిపక్ష నాయకునిగా జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి, నేడు అందుకు భిన్నంగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు మాధవ్‌. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తుండటం తగదన్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో జోక్యం చేసుకుని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రిని  బిజెపి శాసనమండలి పక్షనేత పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్- కోర్టు స్టేతో SEC నిర్ణయం 
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్- కోర్టు స్టేతో SEC నిర్ణయం 
AP DSC 2026: ఏపీలో వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ - మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్‌
ఏపీలో వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ - మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్‌
Telangana Latest News: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ ముందున్న 'బిగ్ త్రీ' ఆప్షన్స్‌ ఇవే!
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ ముందున్న 'బిగ్ త్రీ' ఆప్షన్స్‌ ఇవే!
What Next Revanth: పార్టీ పరమైన రిజర్వేషన్లా? న్యాయపోరాటం కొనసాగింపా? -స్థానిక ఎన్నికలపై రేవంత్ ప్లానేంటి ?
పార్టీ పరమైన రిజర్వేషన్లా? న్యాయపోరాటం కొనసాగింపా? -స్థానిక ఎన్నికలపై రేవంత్ ప్లానేంటి ?
Advertisement

వీడియోలు

Hyderabad Beach : బీచ్ ఏర్పాటుకు కొత్వాల్ గూడ ఎందుకు ఎంచుకున్నారు..!? ఇక్కడ ప్రత్యేకతలేంటి..? | ABP
Women's ODI World Cup 2025 | విమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పరమ చెత్త ప్రదర్శన
Women's ODI World Cup 2025 | ఓటమనేదే లేని విశాఖలో సౌతాఫ్రికాతో తలపడనున్న టీమిండియా
Tilak Varma | తిలక్ వర్మకి మళ్లీ కెప్టెన్సీ అప్పగించిన హెచ్‌సీఏ
Rohit Sharma diet Plan । 95 కేజీల నుంచి 75 కేజీలకు తగ్గిన రోహిత్ శర్మ డైట్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్- కోర్టు స్టేతో SEC నిర్ణయం 
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్- కోర్టు స్టేతో SEC నిర్ణయం 
AP DSC 2026: ఏపీలో వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ - మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్‌
ఏపీలో వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ - మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్‌
Telangana Latest News: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ ముందున్న 'బిగ్ త్రీ' ఆప్షన్స్‌ ఇవే!
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ ముందున్న 'బిగ్ త్రీ' ఆప్షన్స్‌ ఇవే!
What Next Revanth: పార్టీ పరమైన రిజర్వేషన్లా? న్యాయపోరాటం కొనసాగింపా? -స్థానిక ఎన్నికలపై రేవంత్ ప్లానేంటి ?
పార్టీ పరమైన రిజర్వేషన్లా? న్యాయపోరాటం కొనసాగింపా? -స్థానిక ఎన్నికలపై రేవంత్ ప్లానేంటి ?
Hyderabad Beach : బీచ్ ఏర్పాటుకు కొత్వాల్ గూడ ఎందుకు ఎంచుకున్నారు..!? ఇక్కడ ప్రత్యేకతలేంటి..? | ABP
Hyderabad Beach : బీచ్ ఏర్పాటుకు కొత్వాల్ గూడ ఎందుకు ఎంచుకున్నారు..!? ఇక్కడ ప్రత్యేకతలేంటి..? | ABP
Maserati McPura: మూడు సెకండ్లలో 100 కిలోమీటర్లు..   పక్షిలా రెక్కలు విచ్చుకునే Masareti McPura సూపర్ కారును చూశారా..?
మూడు సెకండ్లలో 100 కిలోమీటర్లు.. పక్షిలా రెక్కలు విచ్చుకునే Masareti McPura సూపర్ కారును చూశారా..?
Telangana High Court:తెలంగాణ హైకోర్టు కోర్టు స్టేతో భగ్గుమన్న బీసీలు, ప్రతిపక్షాలు- రేవంత్ సర్కారుకు వార్నింగ్‌
తెలంగాణ హైకోర్టు కోర్టు స్టేతో భగ్గుమన్న బీసీలు, ప్రతిపక్షాలు- రేవంత్ సర్కారుకు వార్నింగ్‌
Andhra Hospitals: ఏపీలో పేదలకు షాక్ - శుక్రవారం నుంచి	ఎన్‌టీఆర్ వైద్య సేవ బంద్
ఏపీలో పేదలకు షాక్ - శుక్రవారం నుంచి ఎన్‌టీఆర్ వైద్య సేవ బంద్
Embed widget