అన్వేషించండి

Outsourcing Jobs: జగన్ ప్రభుత్వం ఆ 5 వాగ్దానాలను తుంగలో తొక్కింది: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఫైర్

జాబ్ క్యాలెండర్ అమలు మాట దేవుడెరుగు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పీకేసేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక మరోమాట చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించి మోసగించిందని తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటినాక బోడి మల్లన్న అన్నట్టు వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ అమలు మాట దేవుడెరుగు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పీకేసేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

2019 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి వైఎస్ చేసిన చేసిన ఐదు ప్రధానమైన వాగ్దానాలను తులసిరెడ్డి గుర్తుచేశారు. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, సకాలంలో పిఆర్సి అమలు చేయడం, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పించడం.. లాంటి 5 ముఖ్యమైన వాగ్దానాలను గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక ఈ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే వైఎస్ జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చేసిందేమిటని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఇతర ఉద్యోగుల తరహాలోనే  పనికి సమాన వేతనం కల్పించకపోవడమే కాకుండా ఈ మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో దాదాపు 50వేల మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగించడం దారుణం అన్నారు. ఇంకా రెండు లక్షల 50వేల మందిని తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. 

అసలు వివాదం ఏంటంటే.. 
రాష్ట్ర విభజన అనంతరం  2014-19 మధ్యలో 90 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా రిక్రూట్‌ అయ్యారని, వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిక్రూట్‌ మెంట్‌ కోసం ఏకంగా 'ఆప్కాస్‌' అనే వ్యవస్థ తీసుకొచ్చింది. దీని ద్వారా రాష్ట్ర కేంద్రంతోపాటు జిల్లాలో కూడా నియామకాలు చేసిందని, వీరందరు తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ అవుతాయని ఆశిస్తూ ఉండగా వేల మందిని వైఎస్ జగన్ సర్కార్ వారిని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వులు వీరికి శరాఘాతంగా మారాయని, రూ.16 వేల నుంచి రూ.23 వేలలోపు స్వల్ప జీతాలు ఇస్తున్నారని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను గుదిబండగా భావిస్తోందని ప్రభుత్వంపై బీజేపీ నేత మాధవ్ విమర్శలు చేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం, సమానపనికి సమాన వేతనం, ఇచ్చి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం' అని ప్రతిపక్ష నాయకునిగా జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి, నేడు అందుకు భిన్నంగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు మాధవ్‌. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తుండటం తగదన్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో జోక్యం చేసుకుని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రిని  బిజెపి శాసనమండలి పక్షనేత పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Swiggy One BLCK: స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్‌ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్‌ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
Embed widget