అన్వేషించండి

Chandrababu: కళ్యాణదుర్గం టీడీపీ నేతలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు, వినకుంటే వేటు తప్పదా?

కళ్యాణదుర్గం టిడిపి నేతలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఆపార్టీ అధినేత చంద్రబాబు.అసమ్మతి కార్యకాలపాలకు పాల్పడుతూ పార్టీని నట్టేట ముంచుతున్న నేతలతో పాటు ప్రస్తుత ఇంచార్జ్ పై కూడా సీరియస్ అయ్యారు.

కళ్యాణదుర్గం టీడీపీ నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలకు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. టీడీపీకి బలమైన నియోజకవర్గమైన కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ప్రస్తుత ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు వర్గాల మధ్య ఆదిపత్య పోరుతో పార్టీ తీవ్రంగా నష్టపోతుందంటూ మండిపడ్డారు చంద్రబాబు. 

కళ్యాణదుర్గం నేతలతో జూమ్ ఆన్ లైన్ మీటింగ్‌లో ఇంటరాక్ట్ అయిన చంద్రబాబు నేతలందరికీ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. గతంలోనే ఉన్నం హనుమంతరాయ చౌదరికి నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని చెప్పానని, ప్రస్తుత ఇంచార్జ్ ఉమా మహేశ్వరనాయుడు కూడా అందరిని కలపుకుపోకుండా ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఇకనుంచి పార్టీ కార్యక్రమాలు అదిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకోవాలని గట్టిగా చెప్పారు. ఇప్పటికే పార్టీ చాల నష్టపోయిందని, ఇక చూస్తూ ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీనిపై సోషల్ మీడియాలో ఆడియో హల్ చల్ అవుతోంది. ఈ స్థాయిలో మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ కావడాన్ని సామాన్య కార్యకర్తలు స్వాగతిస్తోంటే నేతలకు మాత్రం మింగుడు పడలేదు. ఇక పార్టీ  ఎవరిని ఎంపిక చేస్తే వారిని గెలిపించుకోవాల్సిందే అంటూ స్పష్టం చేశారు చంద్రబాబు. ఉన్నం కుమారుడు మారుతి వ్యవహారంపై కూడా చంద్రబాబు సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా నేతల తీరు మాత్రం మారడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం టీడీపీ వ్యవహారంలో నేతల తీరు  మారకపోతే ఏం చేయాలో పార్టీకి బాగా తెలుసంటూ ఘటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.  

పార్టీ అధినేత వ్యాఖ్యలతో అసమ్మతి కార్యకలాపాలు చేస్తున్న నేతల భవిష్యత్ ఏంటో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రస్తుత ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు కూడా అసమ్మతి నేతలను కలపుకొనేందుకు ప్రయత్నాలు మొదలపెట్టినట్లు తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లకు చంద్రబాబు ఈ విధంగా స్పందించడంతో పార్టీ కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ నేతలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం విషయంలో చంద్రబాబు కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే రానున్న రోజుల్లో సమస్య మరింత జఠిలం అవుతుంది తప్ప పరిష్కారం కాదని, కచ్చితంగా ఎవరికో ఒకరికి భాద్యతలు అప్పగించాలని కార్యకర్తలు కోరుతున్నారు.

అప్పుడు కూడా ఎవరైనా అసమ్మతి కార్యక్రమాలు చేస్తే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలంటున్నారు  కార్యకర్తలు. మరి చంద్రబాబు వార్నింగ్ కేవలం జూమ్ మీటింగ్ కే పరిమితమా... లేక త్వరలోనే ఏమైనా కీలక నిర్ణయాలు ప్రకటిస్తారా అనే దానిపై స్థానిక పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనప్పటికి చంద్రబాబు ఓ రేంజ్ లో ఫైర్ అవ్వడాన్ని కార్యకర్తలు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక పార్టీ కి సంబందించిన కీలక నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందా అంటూ కార్యకర్తలు, నేతలు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget