అన్వేషించండి

Chandrababu: కళ్యాణదుర్గం టీడీపీ నేతలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు, వినకుంటే వేటు తప్పదా?

కళ్యాణదుర్గం టిడిపి నేతలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఆపార్టీ అధినేత చంద్రబాబు.అసమ్మతి కార్యకాలపాలకు పాల్పడుతూ పార్టీని నట్టేట ముంచుతున్న నేతలతో పాటు ప్రస్తుత ఇంచార్జ్ పై కూడా సీరియస్ అయ్యారు.

కళ్యాణదుర్గం టీడీపీ నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలకు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. టీడీపీకి బలమైన నియోజకవర్గమైన కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ప్రస్తుత ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు వర్గాల మధ్య ఆదిపత్య పోరుతో పార్టీ తీవ్రంగా నష్టపోతుందంటూ మండిపడ్డారు చంద్రబాబు. 

కళ్యాణదుర్గం నేతలతో జూమ్ ఆన్ లైన్ మీటింగ్‌లో ఇంటరాక్ట్ అయిన చంద్రబాబు నేతలందరికీ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. గతంలోనే ఉన్నం హనుమంతరాయ చౌదరికి నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని చెప్పానని, ప్రస్తుత ఇంచార్జ్ ఉమా మహేశ్వరనాయుడు కూడా అందరిని కలపుకుపోకుండా ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఇకనుంచి పార్టీ కార్యక్రమాలు అదిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకోవాలని గట్టిగా చెప్పారు. ఇప్పటికే పార్టీ చాల నష్టపోయిందని, ఇక చూస్తూ ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీనిపై సోషల్ మీడియాలో ఆడియో హల్ చల్ అవుతోంది. ఈ స్థాయిలో మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ కావడాన్ని సామాన్య కార్యకర్తలు స్వాగతిస్తోంటే నేతలకు మాత్రం మింగుడు పడలేదు. ఇక పార్టీ  ఎవరిని ఎంపిక చేస్తే వారిని గెలిపించుకోవాల్సిందే అంటూ స్పష్టం చేశారు చంద్రబాబు. ఉన్నం కుమారుడు మారుతి వ్యవహారంపై కూడా చంద్రబాబు సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా నేతల తీరు మాత్రం మారడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం టీడీపీ వ్యవహారంలో నేతల తీరు  మారకపోతే ఏం చేయాలో పార్టీకి బాగా తెలుసంటూ ఘటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.  

పార్టీ అధినేత వ్యాఖ్యలతో అసమ్మతి కార్యకలాపాలు చేస్తున్న నేతల భవిష్యత్ ఏంటో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రస్తుత ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు కూడా అసమ్మతి నేతలను కలపుకొనేందుకు ప్రయత్నాలు మొదలపెట్టినట్లు తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లకు చంద్రబాబు ఈ విధంగా స్పందించడంతో పార్టీ కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ నేతలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం విషయంలో చంద్రబాబు కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే రానున్న రోజుల్లో సమస్య మరింత జఠిలం అవుతుంది తప్ప పరిష్కారం కాదని, కచ్చితంగా ఎవరికో ఒకరికి భాద్యతలు అప్పగించాలని కార్యకర్తలు కోరుతున్నారు.

అప్పుడు కూడా ఎవరైనా అసమ్మతి కార్యక్రమాలు చేస్తే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలంటున్నారు  కార్యకర్తలు. మరి చంద్రబాబు వార్నింగ్ కేవలం జూమ్ మీటింగ్ కే పరిమితమా... లేక త్వరలోనే ఏమైనా కీలక నిర్ణయాలు ప్రకటిస్తారా అనే దానిపై స్థానిక పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనప్పటికి చంద్రబాబు ఓ రేంజ్ లో ఫైర్ అవ్వడాన్ని కార్యకర్తలు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక పార్టీ కి సంబందించిన కీలక నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందా అంటూ కార్యకర్తలు, నేతలు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
Embed widget