అన్వేషించండి

దొంగలు వచ్చారు ..జాగ్రత్త.. ప్రజలకు అనంత పోలీసులు హెచ్చరిక

మీరు శివారుప్రాంతాల్లో నివసిస్తున్నారా..అయితే జాగ్రత్తగా ఉండండి. జిల్లాలోకి కొత్త దొంగ గ్యాంగ్‌లు వచ్చాయి. ఎవరైనా అనుమానాస్పదంగా కన్పిస్తే వెంటనే సమాచారం ఇవ్వండని అంటున్నారు అనంతపురం పోలీసులు.

అనంతపురం జిల్లాలోకి దొంగలు వచ్చారు... జాగ్రత్తగా ఉండండి. ఇది అనంతపురం పోలీసుల అనౌన్స్మెంట్. దొంగతనం జరిగిన తరువాత బాధపడే కంటే.. ముందే జాగ్రత్తపడటం మంచిదంటున్నారు అనంతపురం పోలీసులు. ఇప్పటికే కదిరిలో మహిళను హత్య చేసి దొంగతనం చేసిన కేసులో నిందితులు దొరకలేదు. బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నప్పటికీ క్లూ దొరకడం లేదు. ఎవరు చేశారన్నది కూడా తేల్చలేకపోతున్నారు పోలీసులు. దీనికి కొత్త ముఠాలు జిల్లాలోకి వచ్చాయన్న సమాచారంతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. రాత్రింబవళ్లు గస్తీ కాస్తున్నారు. ఎవరైనా కొత్తగా కన్పిస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకొంటున్నారు. వారి వేలిముద్రలు తీసుకొని చెక్ చేస్తున్నారు. వీధుల్లోకి కొత్తవారు కానీ, వెంట్రుకలు, పాత సామానులు అంటూ వచ్చేవారిపై అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్నారు. పోలీసులు వచ్చే వరకు వాళ్లను అక్కడే ఉంచాలని సూచిస్తున్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాలు, గేటెడ్ కమ్యూనిటీల‌్లో సమావేశం పెట్టి సిసి కెమెరాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటిని గమనిస్తూ పోలీసులుకు సహకరించాలని సూచిస్తున్నారు.

కొత్త గ్యాంగ్‌లు వచ్చాయన్న సమాచారం పోలీసు వర్గాల్లో కలవరానికి గురి చేస్తుంది. వేసవి కాలంలో ఎక్కువగా దొంగతనాలు జరిగేవి. అప్పుడు అంతా ఆరుబయట పడుకుంటారు కాబట్టి దొంగలకు చోరీలు చేయడం చాలా ఈజీగా ఉండేది. రానున్నరోజుల్లో కరోనా ఎక్కువగా ఉంటుందని అంచనాలతో దొంగలు ముందుగానే వచ్చారని అంటున్నారు పోలీసులు. మహారాష్ట్ర నుంచి వచ్చే పార్థీ గ్యాంగ్, తమిళనాడు నుంచి వచ్చే ఊజికుప్పంగ గ్యాంగ్లు ముందుగానే వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి తోడు ఇఫ్పటికే రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర గ్యాంగ్ లు రైళ్లలో దోపిడీకి తెగబడేవి. కానీ ప్రస్తుతం రైళ్లు పెద్ద ఎత్తున తిరగడం లేదు. రానున్నరోజుల్లో కోవిడ్ పెరిగితే రైళ్లు నిలిచిపోయే అవకాశం ఉందని అందుకే ఊళ్లపై పడుతున్నాయి ఈ గ్యాంగ్‌లు. ఇప్పటికే కదిరిలో ఒక దొంగల ముఠా ఒకరిని హత్యచేసి దోచుకెల్లిన సంఘటన కలకలం రేపింది. వీటికి తోడు చెడ్డీగ్యాంగ్ చేస్తున్న దొంగతనాలు కూడా పోలీసులను కలవరపెడుతున్నాయి. దీంతో అనంతపురం పోలీసులు హైఅలర్ట్ ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శివారు ప్రాంతాలు,పెద్ద ఇళ్లు ఉన్నవారు కచ్చితంగా సిసి కెమెరాలు పెట్టుకోవాల్సిందే అంటూ నోటీసులు ఇస్తున్నారు.

కొత్త ముఠాలు వచ్చాయన్న పక్కా సమాచారంతో రాత్రివేళ గస్తీతోపాటు, కొత్త వ్యక్తులకు ఇళ్ళు అద్దెకు ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు పోలీసులు. కదిరి హత్య కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసుల్లో అసహనం పెరిగిపోతోంది. అనుమానితులను  విచారిస్తున్నప్పటికీ వారి నుంచి సరైన సమాచరాం రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. త్వరలోనే కదిరి కేసును తేల్చాలన్న పట్టుదలతో ఉన్నారు పోలీసులు. పట్టణ శివారు గ్రామాల్లో పోలీసులు దండోరా కూడా వేయిస్తున్నారు. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండండి.....అనుమానితులు...సమస్యగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటున్నారు అనంతపురం పోలీసులు.

Also Read : నూతన సచివాలయ పనులను పరిశీలించిన కేసీఆర్.. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం

Also Read: Telangana New Secretariat : వచ్చే దసరాకు పాలనలో కొత్త వెలుగులు... రెడీ అవుతున్న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ !

lso Read: సాయితేజ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి !

Also Read: ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పుడల్లా లేనట్లే ! కొత్త మంత్రుల జాబితా రెడీ చేసుకున్నా వెనక్కి తగ్గిన సీఎం జగన్ !?

Also Read: పరువు కోసం బావ హత్య.. కాబోయే బామ్మర్దులు కత్తులతో ఘాతుకం

Also Read: Revanth Reddy: పార్లమెంటులో వాళ్లదంతా ఉత్తుత్తి పోరాటం.. టీఆర్ఎస్, బీజేపీది కుమ్మక్కు రాజకీయం

Also Read:  ఈ పిల్లలు జీవితాంతం బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు.. ఎండీ సజ్జనార్ గ్రేట్ ఆఫర్, ఎందుకంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget