అన్వేషించండి

Kurnool Crime Case:పెళ్లైన నెలకే భర్తను చంపించిన భార్య! బ్యాంకు మేనేజర్‌తో కలిసి మర్డర్ స్కెచ్‌; రెండు జిల్లాలను షేక్ చేసిన హత్య

Kurnool Murder Case:పెళ్లైన కొద్ది రోజులకే ఓ వ్యక్తి మిస్‌ అయ్యాడు. పోలీసులు ఆరా తీస్తే హత్యకు గురైనట్టు తేలింది. లోతుగా వెళ్తే బ్యాంకు మేనేజర్ పాత్ర స్పష్టమైంది. భార్య, అత్త కూడా తలో చేయి వేశారట.

Kurnool Murder Case: మేఘాలయలో ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత తన భర్తను హనీమూన్‌కు తీసుకెళ్లి ఖతం చేసింది. ఈ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి కేసే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. పెళ్లైన కొద్దిరోజులకే గద్వాలకు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ముందు అదృశ్యమయ్యాడని కేసు నమోదు చేసుకున్న పోలీసులు తర్వాత కూపీ లాగితే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో కుటుంబ సభ్యులతోపాటు ఓ బ్యాంకు మేనేజర్ పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా భార్య పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

గద్వాల రాజవీధిలో ఉంటున్న ప్రైవేటు సర్వేయర్‌ తేజేశ్వరరావు ఈ మధ్య కాలంలో కల్లూరు యువతిని ప్రేమించాడు. ఈ మధ్యే వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లా పాణ్యం వెళ్లిన తేజేశ్వరరావు కనిపించకుండా పోయాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. 

గంట తేజేశ్వరరావు ఆఖరి సిగ్నల్‌ పాణ్యం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులను విచారిస్తే కీలకాంశాలు చెప్పారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో తేజేశ్వర్‌ హత్యకు గురైనట్టు గుర్తించారు. వారు చెప్పిన ఆధారాలంతో డిగ్ చేస్తే పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు వద్ద తేజేశ్వర్‌ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. 

మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు పోస్టు మార్టం పూర్తి చేశారు. తేజేశ్వర్‌ను అత్యతం కిరాతకంగా హత్య చేసినట్టు పోస్టు మార్టం రిపోర్టులో తేలింది. కారులో తీసుకెళ్లిన హంతకులు అక్కడే గొంతు కోసి హతమార్చారు. నన్నూరు టోల్‌ప్లాజా మీదుగా పాణ్యం మండలం పిన్నాపురం రోడ్డులో పడేశారు. అయితే కారులో వచ్చింది ఎవరు, ఎంత మంది వచ్చారు, వారిని ఎవరు పురమాయించారనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

ఇప్పటికి ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు తేజేశ్వర్ హత్యకు కేవలం వివాహేతర సంబంధమే కారణంగా అనుమానిస్తున్నారు. తేజేశ్వరరావు భార్యతో కర్నూలు టీజే మాల్‌లో ఉన్న కెనరా బ్యాంకు మేనేజర్‌ తిరుమలరావు వివాహేతర సంబంధం ఉందని అంటున్నారు. ఈ విషయంలో తేజేశ్వర్‌ అత్త కూడా హెల్ప్ చేశారని సమాచారం. వివాహానికి ముందు నుంచే తతంగం నడుస్తోంది. 

తన సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వరరావును హత మార్చేందుకు పెళ్లైన నెలరోజులకు భార్య స్కెచ్ వేసినట్టు పోలీసులు గుర్తించారు. బ్యాంకు మేనేజర్‌తో కలిసి ప్లాన్ చేసినట్టు, వీళ్లకు అత్త సహకరించినట్టు అనుమానిస్తున్నారు. పథకంలో భాగంగా ల్యాండ్‌ సర్వే కోసం తేజేశ్వరరావును కర్నూలుకు రప్పించారు. రప్పించే క్రమంలో మార్గ మధ్యలోనే హతమార్చారు. సర్వేకు వెళ్లిన తన బ్రదర్ కనిపించడం లేదని తేజవర్థన్‌ గద్వాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

తేజేశ్వరరావు హత్య కేసులో అసలు నిందితులను పట్టుకునేందుకు గద్వాల్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. కీలక నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

మృతుడు సోదరుడు మీడియాతో మాట్లాడుతూ ఇదంతా తన తమ్ముడి భార్యే చేసిందని అంటున్నాడు. మొదట తన తమ్ముడితో వివాహం నిశ్చేయైందని కానీ పెళ్లికి ఐదు రోజుల ముందే తను కనిపించకుండా పోయిందన్నాడు. అప్పుడు ఆరా తీస్తే వేరే వాళ్లతో వెళ్లిపోయినట్టు చెప్పుకొచ్చాడు. ఆ పెళ్లి వద్దనుకున్నామని కానీ మళ్లీ తమ తమ్ముడిని ట్రాప్ చేసిందని చెప్పాడు. కట్నం తల్లి ఇచ్చుకోలేదని అందుకే తాను అప్పుడు వెళ్లిపోయినట్టు కలరింగ్ ఇచ్చి బుట్టలో వేసుకుందని తెలిపాడు. తర్వాత తమకు ఇష్టం లేకపోయినా వారిద్దరు గత నెల 18న పెళ్లి చేససుకున్నారని వివరించాడు. అప్పటి నుంచి వారితో సంబంధం తెంచుకున్నానని కానీ ఇంతలో తమ్ముడు కనిపించడం లేదని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నాడు. భర్త చనిపోయిన భార్య ఎలా ఉంటుందో అందరికీ తెలుసని కానీ తన తమ్ముడి భార్య మొహంలో బాధ లేదని తెలిపాడు. అందుకే పోలీసులకు ఆమె, ఆమె ఫ్యామిలీపై ఫిర్యాదు చేశానని అన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఏం తేలుస్తారో చూడాలని చెప్పుకొచ్చాడు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కాగజ్‌నగర్ ప్రభుత్వం పాఠశాలలో అగ్ని ప్రమాదం- వంటగదిలో గ్యాస్‌ లీక్‌తో దుర్ఘటన 
కాగజ్‌నగర్ ప్రభుత్వం పాఠశాలలో అగ్ని ప్రమాదం- వంటగదిలో గ్యాస్‌ లీక్‌తో దుర్ఘటన 
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget