అన్వేషించండి

ఆర్థిక మంత్రి బుగ్గనకు షాక్ ఇచ్చిన ప్రధాన అనుచరుడు, వైసీపీ పతనం స్టార్ట్ అయిందంటూ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రికి ప్రధాన అనుచరుడు షాక్ ఇచ్చారు. సడెన్‌గా సైకిల్‌ ఎక్కి.. వైసీపీ పతనం స్టార్ట్ అయిందంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు.

ఏపి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో డోన్‌లో వలసల పర్వం మొదలైంది. మంత్రి డోన్ నియోజకవర్గ పరిధిలోనే పర్యటనలో ఉండగానే ఆయన ముఖ్య అనుచరుడైన ధార హరనాథ్ రెడ్డి కండువా మార్చేశారు. నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, డోన్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ సమక్షంలో సైకిల్‌ చేరారు.

డోన్ మున్సిపల్  కార్పోరేషన్ ఎన్నికల్లో 32వ వార్డు వైస్సార్సీపీ తరుపున హరనాథ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీకి సేవలు అందించారు. కౌన్సిలర్ హరనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి పక్కన ఉంటూ ఆయనకు భజన చేసే వ్యక్తులకు మాత్రమే విలువలు ఇస్తున్నారని హరనాథ్‌ అనుచరులు చెవుళ్లు కొరుక్కుంటున్నారు. ఆయన ఒక్కరే కాదు డోన్ కౌన్సిలర్ల చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారని టాక్.  

ఆర్థికశాఖ మంత్రి డోన్ నియోజకవర్గ పరిధిలో పర్యటనలో ఉండగానే ఆయన ముఖ్య అనుచరుడు 32వ వార్డు కౌన్సిలర్ ధార హరనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో డోన్ వైసీపీలో కలకలం రేపుతోంది. వార్డు కౌన్సిలర్‌తోపాటు మరి కొంతమంది కూడా టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తల్లోనూ, అటు ప్రజాల్లోనూ అసంతృప్తి కనిపిస్తోందని విపక్ష నేతలు చెబుతున్నారు. 

రాబోయే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ పరిధిలో వైసీపీకి గట్టి షాక్ ఇస్తామంటున్నారు నేతలు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత మండలం బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చి 6వార్డులు కైవసం చేసుకుని బుగ్గన కోటకు బీటలు వారేలా చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రికి ముఖ్య అనుచరుడిగా పార్టీకి అండగా ఉంటూ పార్టీకి సేవలు చేశారు. అటువంటి వ్యక్తే ఊహించని విధంగా టిడిపిలో చేరి మంత్రికి ఊహించని షాక్ ఇచ్చారు. తన నుంచే వలసలు మొదలవుతాయని హరినాథ్ రెడ్డి తెలిపారు.        

డోన్‌లో వైసీపీ పార్టీలోనే ఉంటూ చాలా మంది కౌన్సిలర్లు కూడా విలువలు లేక మగ్గుతున్నారని వారు బాధలు బయటికి చెప్పుకోలేక పోతున్నారని వైసీపీకి పతనం 32వ వార్డు నుంచి మొదలైందని అన్నారు హరినాథ్‌రెడ్డి. డోన్ టీడీపీ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి తనకు ఎటువంటి ప్రలోభాలకు గురి చేయలేదని, తానంతట తానే స్వయంగా తెలుగుదేశం పార్టీలో చేరానని ఆయన అన్నారు. ప్రస్తుతానికి 32 వ వార్డు నుంచి తాను ఒక్కడినే పార్టీలో చేరానని ఇప్పటి నుంచి వైసిపికి ముందు ముందు ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. మొత్తం మీద మంత్రి బుగ్గనకు ముఖ్య అనుచరుడు సడన్ గా టిడిపిలోకి జంప్ కావడంపై జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget