అన్వేషించండి

Ysrcp Protest : పత్తికొండ రోడ్లపై పసుపు నీళ్లు, శుద్ధి పేరుతో వైసీపీ వినూత్న నిరసన

Ysrcp Protest : కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టాయి. రోడ్డుపై పసుపు నీళ్లు చల్లుతూ శుద్ధి చేశారు.

Ysrcp Protest :  కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ నేతలు వినూత్న నిరసన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో పత్తికొండ అపవిత్రమైందని వైసీపీ నేతలు ఆరోపించారు. పత్తికొండను పవిత్రం చేసేందుకు  రోడ్డుపై పసుపు నీళ్లు చల్లి శుభ్రపరుస్తున్నామన్నారు. చంద్రబాబు మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు పర్యటనతో పత్తికొండ అపవిత్రమైందనంటూ పత్తికొండ పట్టణంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు వినూత్న రీతిలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. గతంలో చంద్రబాబు హయాంలో కరవు కాటకాలతో అల్లాడిపోయే రైతులు నేడు జగనన్న పాలనలో సమృద్ధి వర్షాలతో వ్యవసాయం చేసుకుంటున్నారని వైసీపీ నేతలు తెలిపారు. కరవుకు మారుపేరుగా ఉన్న చంద్రబాబు పత్తికొండకు వచ్చినందుకు పసుపు నీళ్లతో రహదారులను శుద్ధి చేశామన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ప్రధాన రహదారి అంతా పసుపు నీళ్లు చల్లుతూ శుభ్రం చేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు.  

చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు- మంత్రి గుమ్మనూరు జయరాం

రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శించారు. చంద్రబాబును ప్రజలు తిరస్కరించారన్నారు. మంత్రి జయరాం శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సానుభూతి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలేదన్నారు. చంద్రబాబుకు ఇప్పటికే చివరి ఎన్నికలు అయిపోయాయన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయరన్నారు.  తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే న్యాయవాదులపై దుర్భాషలాడారన్నారు. వికేంద్రీకరణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.  రాష్ట్ర ప్రయోజనాలతో చంద్రబాబు, పవన్‌ చెలగాటం ఆడుతున్నారన్నారు. 

చంద్రబాబుకు నిరసన సెగ 

చంద్రబాబు కర్నూలు పర్యటనలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. న్యాయవాదులు గో బ్యాక్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. న్యాయవాదుల నిరసనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పోలీసులు అదుపు చేయలేకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. వైసీపీ నేతలు గూండా రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ఆఫీస్ వద్ద మాట్లాడుతున్న చంద్రబాబును న్యాయవాదులు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. చంద్రబాబు రాయలసీమ ద్రోహీ, గో  బ్యాక్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అయితే న్యాయవాదులు, వైసీపీ శ్రేణులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. 

సీఎం జగన్ రాయలసీమ ద్రోహి 

"గూండాలందరినీ హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండాలి. దాడులకు పాల్పడిన వారిని తరిమి తరిమి కొడతాం. పోలీసుల వల్ల కాకపోతే చెప్పండి నేను వస్తా. తమాషా అనుకున్నారా వైసీపీ చోటామోటా రౌడీలు ఇలా దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ఏంచేస్తున్నారు. బట్టలిప్పించి కొట్టిస్తా దద్దమ్మలారా? పనికిమాలిన వ్యక్తుల్లారా నేరాలు-ఘోరాలు చేసిన దరిద్రులారా అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రౌడీలకు రౌడీని గుర్తు పెట్టుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సహనం పాటిస్తున్నాం. మా కార్యకర్తలకు పిలుపునిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే  మీ జగన్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేవాడా?.ఎవడ్రా రాయలసీమ దోహి, రాయలసీమను రత్నాల సీమను చేసాం. రాయలసీమకు ద్రోహం చేసింది జగన్. " - చంద్రబాబు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..
AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Basil Joseph OTT Movies: 'సూక్ష్మదర్శిని' హీరో బసిల్ జోసెఫ్ లేటెస్ట్ డార్క్ కామెడీ - ఓటీటీలో మార్చి 14న స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
'సూక్ష్మదర్శిని' హీరో బసిల్ జోసెఫ్ లేటెస్ట్ డార్క్ కామెడీ - ఓటీటీలో మార్చి 14న స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..
AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Basil Joseph OTT Movies: 'సూక్ష్మదర్శిని' హీరో బసిల్ జోసెఫ్ లేటెస్ట్ డార్క్ కామెడీ - ఓటీటీలో మార్చి 14న స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
'సూక్ష్మదర్శిని' హీరో బసిల్ జోసెఫ్ లేటెస్ట్ డార్క్ కామెడీ - ఓటీటీలో మార్చి 14న స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
Best Haleem Spots In Hyderabad : హైదరాబాద్​లో బెస్ట్ హలీమ్​ తినాలనుకుంటే ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు.. టేస్టీ టాపింగ్స్​తో కూడిన, ట్రెడీషనల్ హలీమ్ స్పాట్స్ ఇవే
హైదరాబాద్​లో బెస్ట్ హలీమ్​ తినాలనుకుంటే ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు.. టేస్టీ టాపింగ్స్​తో కూడిన, ట్రెడీషనల్ హలీమ్ స్పాట్స్ ఇవే
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
Embed widget