అన్వేషించండి

Kunrool News : రెచ్చిపోయిన పీఈటీ, చున్నీ వేసుకోలేదని కడ్డీ కాల్చి విద్యార్థిని చెంపపై వాతలు!

Kunrool News : కర్నూలు జిల్లాలో ఓ టీచర్ ప్రతాపం చూపింది. చున్నీ వేసుకోలేదని బాలికకు వాత పెట్టింది.

Kunrool News : ఇటీవల కాలంలో ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రతాపం చూపుతున్న ఘటనలు పెరిగాయి. చిన్న చిన్న కారణాలకు ఉపాధ్యాయులు విద్యార్థులను తీవ్రంగా కొడుతున్నారు. ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలిక చున్నీ వేసుకోలేదని పీఈటీ ప్రతాపం చూపింది. ఇనుప కడ్డీ కాల్చి విద్యార్థిని బుగ్గపై వాత పెట్టాంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం అయింది. కొత్తపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పాములపాడు మండలం బానకచెర్ల గ్రామానికి చెందిన కీర్తి అనే బాలిక 10వ తరగతి చదువుతుంది. విద్యార్థిని చున్నీ వేసుకోకుండా స్కూల్ కు రావడంతో ఆగ్రహానికి గురైన పీఈటీ ఆమెను ఆడుకోనివ్వలేదు. అంతటితో ఆగకుండా ఇనుప కడ్డీ వేడిచేసి బాలిక చెంపపై వాత పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ కు చేరుకుని ఆందోళన చేశారు. పీఈటీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

విద్యార్థులపై డీన్ ప్రతాపం 

హన్మకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులపై డీన్ ప్రతాపం చూపాడు. హన్మకొండ హంటర్ రోడ్డులోని ప్రైవేట్ స్కూల్ లో విద్యార్థులపై డీన్ ప్రతాపం చూపాడు. తన ప్రశ్నకు సమాధానం చెప్పటంలేదని చర్మం కమిలిపోయేలా కర్రతో చితకబాదాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగుచూసింది. కమిలి పోయిన దెబ్బలు చూసి కూడా కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలన్న ఆలోచన చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే పిల్లలపై ఏవిధంగా పర్యవేక్షణ చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. పైగా ఈ విషయాలు బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడు మోషన్ వెళ్లేందుకు కూడా కూర్చొలేని స్థితిలో ఉన్నాడని తండ్రి తెలిపారు. ఆదివారం తన కుమారుడిని చూసేందుకు వచ్చిన సమయంలో ఆయన ఫోన్ ద్వారా జరిగిన విషయాలు తన తల్లితండ్రులకు తెలియజేయడంతో వారు స్కూల్ కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీన్ పై చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదంటూ ప్రిన్సిపాల్ వద్ద పంచాయితీ పెట్టారు. అయితే విద్యార్థులపై చేయి చేసుకున్న డీన్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. 

ఉపాధ్యాయుడికి బడితపూజ

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యoగా ప్రవర్తించాడు. విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో పాఠశాలకు వచ్చి టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు వెంకట రమణను తల్లిదండ్రులు చితకబాదారు. వెంకటరమణ మోడ్రన్ పబ్లిక్ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు.  

"ఆ సార్ మాకు సైన్స్ చెబుతాడు. కారణంగా లేకుండా టచ్ చేస్తుంటాడు. నన్నే చూడండి అంటుంటాడు. చూసి నవ్వుతుంటాడు. ల్యాబ్ లో మార్కులు వేసేందుకు అభ్యంతకరంగా ప్రవర్తిస్తున్నాడు." - విద్యార్థిని   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
What Indians Ate On New Year: సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Embed widget