అన్వేషించండి

Chandrababu : చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం, నదిలో పడిపోయిన టీడీపీ నేతలు

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటు ర్యాంపు విరిగిపోయి టీడీపీ నేతలు వరద నీటిలో పడిపోయారు.

Chandrababu : తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తృటిలో తప్పిన  ప్రమాదం తప్పింది. కోనసీమ జిల్లా సోoపల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న బోటు ర్యాంపు తెగిపోయి ప్రమాదం చోటుచేసుకుంది. సోoపల్లి వద్ద చంద్రబాబుతో పంటు దిగేందుకు ఒక్కసారిగా పంటు చివర ర్యాంపు వద్దకు నేతలందరు ఒక్కసారిగా చేరుకున్నారు. చంద్రబాబును ముందుగా పంటు నుంచి నాటు పడవ ఎక్కించారు భద్రతా సిబ్బంది.  వేరొక నాటు పడవ ఎక్కేందుకు టీడీపీ నేతలందరూ ర్యాంపు మీదకి రావటంతో బరువు ర్యాంపు రెక్క విరిగిపోయింది.  దీంతో మాజీ మంత్రులు దేవినేని ఉమా, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యే రామరాజు, నేతలు కలవపూడి శివ, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, చంద్రబాబు ఎన్ఎస్జీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు నీటిలో పడిపోయారు. నీటిలో మునిగి ఊపిరాడక కొద్దిసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వెంటనే లైఫ్ జాకెట్లు వేసిన సిబ్బంది వారిని కాపాడారు.  ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఒడ్డుకు సమీపంలోనే ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పింది. 

Chandrababu : చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం, నదిలో పడిపోయిన టీడీపీ నేతలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం పర్యటిస్తున్నారు. కోడేరులో వశిష్ట గోదావరి నదిపై చంద్రబాబు బోటులో ప్రయాణించారు. అయోధ్యలంక, మర్రిమూల, నక్కిలంక, పుచ్చలలంక, రాయలంకల్లో ఆయన బోటులో పర్యటించారు. వరద బాధితులను చంద్రబాబు పరామర్శిస్తున్నారు. సాయంత్రం రాజోలు, పాలకొల్లులో పర్యటించి రాత్రికి అక్కడే స్టే చేయనున్నారు. శుక్రవారం యలమంచిలి మండలం దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగాధరపాలెం, లక్ష్మీపురం, పొన్నపల్లి గోదావరి గట్టు, నర్సాపురం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు నియోజక వర్గాలు ఆచంట, పి.గన్నవరం, రాజోల్, పాలకొల్లు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వరద ముంపు గ్రామాల్లో టీడీపీ అధినేత పర్యటించనున్నారు. 

Chandrababu : చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం, నదిలో పడిపోయిన టీడీపీ నేతలు

దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 ఇవ్వాలి- చంద్రబాబు 

పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. కోడేరులో వశిష్టగోదావరి నదిపై చంద్రబాబు, టీడీపీ నేతలు బోట్‌లో ప్రయాణించారు. బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని టీడీపీ నేతలు, బాధితులు చంద్రబాబుకు వివరించారు. కలుషిత నీరు ఇస్తున్నారని గ్రామస్థులు చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. వరద బాధితుల కష్టాలు బాధిస్తున్నాయన్న ఆయన ప్రజలను బురదలో ముంచేసి సీఎం గాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. వరద బాధితులకు తెలంగాణలో రూ.10 వేలు ఇస్తున్నారని, వైసీపీకి ఎందుకివ్వట్లేదని ప్రశ్నించారు. వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు చొప్పున ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Chandrababu : చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం, నదిలో పడిపోయిన టీడీపీ నేతలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Embed widget