అన్వేషించండి

Tiger Attack Fact Check : పెద్దపులి మనుషులపై దాడి చేసిందా? వైరల్ అవుతున్న ఫొటోల్లో నిజమెంత?

Tiger Attack Fact Check : కాకినాడ జిల్లా వాసుల్ని రెండు విషయాలు భయపెడుతున్నాయి. ఒకటి పెద్ద పులి, మరొకటి ఫేక్ న్యూస్. తాజాగా పులి మనుషులపై దాడి చేసిందని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఏబీపీ దేశం ఫాక్ట్ చెక్ చేసింది.

Tiger Attack Fact Check : కాకినాడ జిల్లాలో పులిపై పుకార్లు మళ్లీ షికారు కొడుతున్నాయి. అసలే పులి సంచారంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న ప్రజలను తాజాగా మరో పుకారు మరింత భయపెడుతోంది. పెద్ద పులి మనుషులపై దాడి చేసిందని, ఇద్దరు చనిపోయారని సోషల్ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో నిజమేంతో ఏబీపీ దేశం ఫాక్ట్ చెక్ చేసింది. 

అసలేం జరిగింది? 

రక్తమోడుతున్న క్షతగాత్రుల ఫొటోలు కాకినాడ జిల్లాలో సోమవారం ఉదయం నుంచి చక్కర్లు కొడుతున్నాయి. చూడ్డానికే అతి భయంకరంగా ఉన్న ఈ ఫొటోలుతో ఒక మెసేజ్ కూడా మరింత భయాన్ని సృష్టిస్తోంది. రౌతులపూడిలో కొన్ని రోజులుగా పాగా వేసిన పెద్దపులి తాజాగా మనుషులపై దాడి చేసి  గాయపరిచిందని ఈ మెసేజ్ సారాంశం. దీంతో కాకినాడ జిల్లా ప్రజల్లో ఒకటే వణుకు మొదలయ్యింది. పులి సంచారిస్తున్న గ్రామాల్లో ప్రజలంతా హడలెత్తిపోతున్నారు. ఇంతకీ ఇంతవరకు పశువులపై మాత్రమే దాడిచేసిన పెద్దపులి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నట్లుగా నిజంగా మనుష్యులపై దాడి చేసిందా అంటే ఏమాత్రం నిజంకాదని తేలింది. రౌతులపూడి మండలంలో లచ్చిరెడ్డిపాలెంలో రెండు రోజులుగా సంచరిస్తున్న బెంగాల్ టైగర్ పాదముద్రలను అక్కడ పొలాల్లోని అరటి తోటల్లో అటవీశాఖ అధికారులు గుర్తించారు. నిన్నంతా అక్కడ వర్షం కురవడంతో పులి ఉనికిని గుర్తించేందుకు అటవీశాఖ అధికారులకు ఇబ్బందికరంగా మారింది. అయితే లచ్చిరెడ్డిపాలెం సమీప ప్రాంతాల్లోనే పులి ఉందని అధికారులు స్థానికులను  ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. పశువులను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. ఈ రోజు కూడా పులి జాడ అధికారులకు తెలియరాలేదు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఎక్కడివి? 

పులి జాడ తెలియక నిన్నటి నుంచి తీవ్రంగా అధికారులు గాలిస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఎక్కడివంటే ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంటి దాడికి సంబంధించిన ఫొటోలు అని ఏబీపీ ఫాక్ట్ చెక్ లో తేలింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎలుగుబంటి సంచరించింది. ఈ ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి ఫొటోలే ఇప్పుడు పులి దాడి ఫొటోలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఫేక్ న్యూస్ వైరల్ 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు పులి దాడిలో గాయపడ్డవారు కాదని, ఇంతవరకు పులి పశువులపై దాడి చేసింది తప్ప మనుషులపై ఎటువంటి దాడులు చేయలేదని జిల్లా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో వాస్తవం లేదని, ఇలా ప్రజలను భయాందోళనలు సృష్టిస్తున్నవారిపై అవసరమైతే కేసులు పెడతామని హెచ్చరించారు. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దని సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget