By: ABP Desam | Updated at : 23 Nov 2021 12:59 PM (IST)
Mepma_Employee_Anitha_Deepthi
ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై, ఆయన కుటుంబంపై అసెంబ్లీ సాక్షిగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని తన భార్య భువనేశ్వరిపై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు బాధను తట్టుకోలేక ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. అది మొదలుకుని టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు పెరుగుతోంది. చంద్రబాబుపై అభిమానంతో ఇటీవల ఓ కానిస్టేబుల్ రాజీనామా చేయడం తెలిసిందే. తాజాగా మరొకరు ఉద్యోగానికి రాజీనామా చేశారు.
చంద్రబాబుకు అవమానం జరగడంపై కలతచెందిన కడప జిల్లాకు చెందిన ఓ మహిళ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం వై.కోటకు చెందిన దుద్యాల అనితాదీప్తి మెప్మాలో టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ జాబ్కు రిజైన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేకోడూరులో ఆదివారం దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఉన్నతాధికారులకు అందజేయనున్నానని తెలిపారు.
Also Read: Prakasam: చంద్రబాబును అవమానించారని కానిస్టేబుల్ రాజీనామా
రైల్వేకోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం, ఎర్రగుంట కోట గ్రామానికి చేసిన *అనిత దీప్తి దుద్యాల* అనే ఒక దళిత మహిళ ఉన్నత చదువులు చదువుకొని గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది.... pic.twitter.com/fSiGajBkR8
— Seenu (@Srinu_LokeshIst) November 21, 2021
టీడీపీ నేత, శాప్ మాజీ డైరెక్టర్ జయచంద్ర కుమార్తెనే ఈ అనితాదీప్తి. 2014లో ఎర్రగుంట్లలో మెప్మా టౌన్ మిషన్ కో ఆర్డినేటర్గా చేరారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానం జరగడాన్ని జీర్ణించుకోలేక, అందుకు నిరసనగా ఉద్యగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడేళ్లుగా ఉద్యోగం చేస్తున్నానని.. కానీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తనను బాధించాయన్నారు. 2024లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యేందుకు తనవంతుగా పనిచేస్తానన్నారు. ఆయన తిరిగి సీఎం అయ్యాక ఉద్యోగంలో మళ్లీ చేరుతానని వ్యాఖ్యానించారు.
Koo Appశాసనసభలో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వైకాపా శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరుతూ తెలుగు మహిళలు ఆధ్వర్యంలో ఏ.ఎం.జీ స్కూల్ నుండి పాదయాత్ర చేసి దుమ్ములుపేట సెంటర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సిఎం డౌన్ డౌన్, ద్వారంపూడి క్షమాపణ చెప్పాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. #kakinada #tdp - Daily News (@daily_news05) 22 Nov 2021
ఇటీవల కానిస్టేబుల్ రాజీనామా
ప్రకాశం జిల్లాకు చెందిన విజయ్ కృష్ణ అనే కానిస్టేబుల్ 1998 బ్యాచ్.. రాతపరీక్షలోనూ టాపర్గా నిలిచారు. 2002 ఒంగోలు పీటీసీలో బెస్ట్ షూటర్గా నిలిచారు. 2003లో కూడా బెస్ట్ షూటర్ గా అవార్డు పొందారు. చంద్రబాబు హయాంలోనే ఆయనకు ఉద్యోగం వచ్చిందని, అలాంటి వ్యక్తికి అసెంబ్లీ సాక్షిగా అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయారు.
చంద్రబాబు గారి పై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఒక కానిస్టేబుల్ ఖండించారు. చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగం వచ్చిందని.. ఈరోజు వరకు విలువలతో చేయి చాచకుండా నిజాయతీగా బ్రతికానని...వైసీపీ చేసే దిగజారుడు రాజకీయాలు మంచివి కావని అంటూ కన్నీటిపర్యంతమయ్యారు pic.twitter.com/avzAJHnin3
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) November 20, 2021
చంద్రబాబుకు మద్దతుగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నైతిక విలువలు, నిబద్దత కోల్పోయిన ఈ ప్రభుత్వం మరింత దారుణంగా ప్రవర్తిస్తుందన్నారు. తాను ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేశానని, ఎక్కడా చేయి చాచలేదని ఏపీలో పరిస్థితులు పోలీసులకు తెలునంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయింది.
Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు బంద్
Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు
Anantapur News: వైద్యం వికటించి చిన్నారికి తీవ్ర అస్వస్థత, అధికారులు పట్టించుకోలేదని ఫ్యామిలీ ఆందోళన
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Chandrababu : తిరుమలకు చంద్రబాబు - వరుసగా ఐదో తేదీ వరకూ ఆలయాల సందర్శన !
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!
/body>