అన్వేషించండి

YCP Attack: దాడులకు భయపడేది లేదు ...నేనే స్వయంగా రోడ్లపైకి వస్తా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్

కార్యకర్తలపై దాడులు చేస్తే తానే స్వయంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. వారితో ఫోన్ లో మాట్లాడారు.

వైసీపీ ప్రభుతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రహదారుల పరిస్థితులపై జనసేన పోరాటం చేస్తుంది. ట్విట్టర్ లో #JSPForAP_Roads యాష్ టాగ్ తో రోడ్ల గుంతల ఫొటోలు పెట్టి జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. రాష్ట్రంలోని రహదారుల అధ్వాన పరిస్థితిపై నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తలు, నేతలు, మహిళలపై దాడులు చేయడం హేయమైన చర్యని పవన్ కల్యాణ్ అన్నారు. పోలీసుల సమక్షంలో వైసీపీ నేతలు దాడులకు తెగబడుతుంటే ఆవేదన కలిగిస్తుందన్నారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ నాయకుడు పేడాడ రామ్మోహనరావు ప్లెక్సీ ఏర్పాటుచేశారు. 

 

Also Read: Somu Veerraju Arrest: చవితి వేడుకలకు అనుమతించాలని బీజేపీ నిరసన... ఉద్రిక్తంగా మారిన ఆందోళన... సోము వీర్రాజు అరెస్టు

 వైసీపీ నేతల దాడి

ఈ ఫ్లెక్సీపై తమ్మినేని సీతారాం ఫొటో ఉండడంపై పోలీసుల సమక్షంలో దాదాపు 25 మందికి పైగా అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దాడికి తెగబడ్డారని పవన్ విమర్శించారు. ఈ దాడిలో రామ్మోహన్​రావుతోపాటు ఏడుగురు జనసేన కార్యకర్తలు గాయపడ్డారని వెల్లడించారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా, ప్రజాసమస్యలపై నిరసన తెలిపిన తమ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టారని పవన్ ఆరోపించారు. గాయాలపాలైన వారిని కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడానికి పోలీసులు నిరాకరించారన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన తెలిపారని, దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసేలా చేశారన్నారు.  

ఫోన్ లో పరామర్శ

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేస్తే సమస్య ఇంకా పెద్దది అవుతుంది తప్ప పరిష్కారం కాదని పవన్‌ అన్నారు. తమ కార్యకర్తలపై దాడి జరిగితే తానే స్వయంగా రోడ్ల పైకి వస్తానని హెచ్చరించారు. ఆ పరిస్థితి తీసుకురావొద్దని పోలీసు ఉన్నతాధికారులను అభ్యర్థిస్తున్నానని అన్నారు.  ఏకపక్షంగా అధికార పార్టీ నేతల మాటలు విని, జనసేన కార్యకర్తలను వేధిస్తే పోలీసులు వారి వృత్తికి ద్రోహం చేసినవాళ్లవుతారన్నారని చెప్పారు. పోలీసుల సాయంతో కేసులుపెట్టి, దాడులు చేస్తే భయపడే వ్యక్తుల కాదని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన జనసేన నేతలను పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌ చేసి పరామర్శించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు పాలవలస యశస్వీ, టి.శివశంకర్‌తో మాట్లాడారు. 

 

Also Read: Pawan Kalyan: కిన్నెర కళాకారుడు మెుగులయ్యకు ఆర్థిక సాయం అందజేసిన పవన్.. ఫొటోలు చూశారా?

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Embed widget