అన్వేషించండి

YCP Attack: దాడులకు భయపడేది లేదు ...నేనే స్వయంగా రోడ్లపైకి వస్తా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్

కార్యకర్తలపై దాడులు చేస్తే తానే స్వయంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. వారితో ఫోన్ లో మాట్లాడారు.

వైసీపీ ప్రభుతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రహదారుల పరిస్థితులపై జనసేన పోరాటం చేస్తుంది. ట్విట్టర్ లో #JSPForAP_Roads యాష్ టాగ్ తో రోడ్ల గుంతల ఫొటోలు పెట్టి జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. రాష్ట్రంలోని రహదారుల అధ్వాన పరిస్థితిపై నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తలు, నేతలు, మహిళలపై దాడులు చేయడం హేయమైన చర్యని పవన్ కల్యాణ్ అన్నారు. పోలీసుల సమక్షంలో వైసీపీ నేతలు దాడులకు తెగబడుతుంటే ఆవేదన కలిగిస్తుందన్నారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ నాయకుడు పేడాడ రామ్మోహనరావు ప్లెక్సీ ఏర్పాటుచేశారు. 

 

Also Read: Somu Veerraju Arrest: చవితి వేడుకలకు అనుమతించాలని బీజేపీ నిరసన... ఉద్రిక్తంగా మారిన ఆందోళన... సోము వీర్రాజు అరెస్టు

 వైసీపీ నేతల దాడి

ఈ ఫ్లెక్సీపై తమ్మినేని సీతారాం ఫొటో ఉండడంపై పోలీసుల సమక్షంలో దాదాపు 25 మందికి పైగా అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దాడికి తెగబడ్డారని పవన్ విమర్శించారు. ఈ దాడిలో రామ్మోహన్​రావుతోపాటు ఏడుగురు జనసేన కార్యకర్తలు గాయపడ్డారని వెల్లడించారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా, ప్రజాసమస్యలపై నిరసన తెలిపిన తమ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టారని పవన్ ఆరోపించారు. గాయాలపాలైన వారిని కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడానికి పోలీసులు నిరాకరించారన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన తెలిపారని, దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసేలా చేశారన్నారు.  

ఫోన్ లో పరామర్శ

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేస్తే సమస్య ఇంకా పెద్దది అవుతుంది తప్ప పరిష్కారం కాదని పవన్‌ అన్నారు. తమ కార్యకర్తలపై దాడి జరిగితే తానే స్వయంగా రోడ్ల పైకి వస్తానని హెచ్చరించారు. ఆ పరిస్థితి తీసుకురావొద్దని పోలీసు ఉన్నతాధికారులను అభ్యర్థిస్తున్నానని అన్నారు.  ఏకపక్షంగా అధికార పార్టీ నేతల మాటలు విని, జనసేన కార్యకర్తలను వేధిస్తే పోలీసులు వారి వృత్తికి ద్రోహం చేసినవాళ్లవుతారన్నారని చెప్పారు. పోలీసుల సాయంతో కేసులుపెట్టి, దాడులు చేస్తే భయపడే వ్యక్తుల కాదని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన జనసేన నేతలను పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌ చేసి పరామర్శించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు పాలవలస యశస్వీ, టి.శివశంకర్‌తో మాట్లాడారు. 

 

Also Read: Pawan Kalyan: కిన్నెర కళాకారుడు మెుగులయ్యకు ఆర్థిక సాయం అందజేసిన పవన్.. ఫొటోలు చూశారా?

 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP PMAY Gramin 2.0: పేదల సొంతింటికి ముహూర్తం ఫిక్స్.. ఏపీ పీఎంఏవై గ్రామీణ్ స్కీమ్ పై గుడ్ న్యూస్!
పేదల సొంతింటికి ముహూర్తం ఫిక్స్.. ఏపీ పీఎంఏవై గ్రామీణ్ స్కీమ్ పై గుడ్ న్యూస్!
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
Vijay Trisha: సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
Heat Wave Alert : రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
Peddi Tickets Rate: తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
LPG Gas Subsidy: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
Embed widget