అన్వేషించండి

Pawan Kalyan: జనసేనానికి పోటా పోటీగా ఫోన్లు - ఆ రెండు పార్టీలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి !

Janasena Chief Pawan Kalyan: జనసేనాని ఉద్దేశపూర్వకంగానే బీజేపీ, టీడీపీకి దూరంగా ఉంటున్నారనే గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. బీజేపితో పొత్తు ఉందని పదే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. 

జనసేనాని విశాఖ పర్యటన వివాదంపై ఆ రెండు పార్టీలు చెబుతున్నాయనే అంశంపై రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. మెన్నటివరకు ఆ రెండు పార్టీలకు పవన్ దూరంగా ఉంటున్నారంటూ జరిగిన ప్రచారానికి విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడి ఘటన తరువాత కాస్త క్లారిటి వచ్చినట్లు కనిపిస్తోంది. విశాఖ పర్యటన తరువాత రాజకీయ పరిస్దితులు మారాయా అనే చర్చ నడుస్తుంది. జనసేనాని ఉద్దేశపూర్వకంగానే బీజేపీ, టీడీపీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం గత కొంతకాలం నుంచి ఏపీలో జరుగుతోంది. ముఖ్యంగా బీజేపితో పొత్తు ఉందని పదే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. 

ఢిల్లీలో పవన్‌కు దూరంగా బీజేపీ పెద్దలు !
పవన్ టీడీపీకి దగ్గర అవుతున్నారని, అందుకే బీజేపీ నేతలు పవన్ ను దూరం పెడుతున్నారని కూడా ప్రచారం జరిగింది. బీజేపి అదిష్టానం చాలా సార్లు పవన్ ను కనీసం అపాయింట్ మెంట్ కూడ ఇవ్వలేదని, అందుకే కాషాయ పార్టీ నేతలతో పవన్ దూరంగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావించారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ బీజేపి నేతలను కలుసుకునేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ లేకపోవడంతో ఎవరినీ కలవకుండానే తిరిగొచ్చారని చర్చ నడిచింది. ఇదే విషయంలో సోషల్ మీడియా కేంద్రంగా పవన్ పై ట్రోలింగ్ జరిగింది. వైసీపీ నేతలు ఈ విషయంలో పవన్ ను నేరుగానే టార్గెట్ చేసి విమర్శలు చేశారు. 
సరిగ్గా అదే సమయంలో బీజేపి నేతలకు వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వెళ్లటం, పవన్ కు బీజేపి నేతలు అపాయింట్ మెంట్ ఇవ్వలేదనే ప్రచారం జరగడంతో దూరం పెరిగిందా అనే అనుమానం ప్రజల్లోనూ మొదలైంది. పవన్ అసంతృప్తికి కారణం అయిన వరుస ఘటనలతో దూరం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే విషయంలో జనసేన నాయకుల కన్నా, బీజేపి నేతలే అనేక సార్లు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జనసేన తమతోనే ఉందని ఇరు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని నేతలు అన్నారు. దీనిపై జనసేన నాయకులు మాత్రం అంతగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. పవన్ కూడా బీజేపి విషయంలో ఎదురయిన పలు అంశాలపై మాట్లాడేందుకు కూడ చాలా సార్లు నిరాకరించారు. కానీ తనకు మద్దతు ఉందని మాత్రం పలుమార్లు ప్రస్తావించారు.

టీడీపీ విషయంలోనూ జససేన వ్యవహరం పై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. గత ఎన్నికల తరువాత జనసేన టీడీపీకి దూరంగా వచ్చింది. బీజేపికి దగ్గరగా ఉన్నామని, ఆ పార్టీల పొత్తుపై క్లారిటీ వచ్చింది. కానీ  టీడీపీ నేతలు మాత్రం పవన్ ను, ఆయన పార్టీ నేతలను దూరం పెట్టలేదని చెబుతున్నారు. ఇక్కడ రాజకీయ కారణాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీకి, బీజేపి నేతలు కూడా టచ్ లో ఉన్నారు. టీడీపీ కీలక నేతలు బీజేపీలో చేరినప్పటికి తెర వెనుక మాత్రం వారంతా టీడీపీకి దగ్గరగా ఉన్నారనే ప్రచారం లేకపోలేదు. ఇదే సమయంలో టీడీపీ నేతలు జనసే ను అదే సాఫ్ట్ కార్నర్ లో చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడే మరో కీలక అంశంపై చర్చ నడుస్తుంది. గతంలో పలుమార్లు పవన్ ప్రసంగాల్లో ఇప్పటి వరకు మేం తగ్గాం.. ఇకపై మీరు తగ్గాలని వ్యాఖ్యలు చేశారు. అవి టీడీపీని ఉద్దేశించి చేసినవేనని ఏపీ ప్రజలు సైతం అనుకున్నారు.  

పొత్తుల విషయం పరిశీలిస్తే, టీడీపీకి పవన్ సీట్ల విషయంలో కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో జనసేన, టీడీపీ, బీజేపీ దారెటు  వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో ఉంటుందోననే ఆసక్తి మొదలైంది. ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల్లో పవన్ మరో కామెంట్ కూడా చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న ఓటును చీలకుండా చూస్తామని పవన్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు అన్ని కలుస్తాయని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు జనసేనాని.
విశాఖ వేదికగా పోటా పోటీ ఫోన్ లు...
విశాఖ వేదికగా జనసేనానిపై వైసీపీ పొలిటికల్ టార్గెట్ చేసింది. ఈ పరిస్థితుల్లో మూడు పార్టీలు కలిసే ఉన్నాయని, గతంలోలాగ కూటమి ఏర్పాటు చేస్తాయా అని వైసీపీలో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. బీజేపి ఏపీ నాయకులు, జాతీయ నేతలు పవన్ కు మద్దతుగా నిలిచారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా పవన్ కు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పవన్ పట్ల వ్యవహరించిన తీరును బీజేపీ, టీడీపీ తప్పుపట్టాయి. ఇదే వేదికగా మూడు పార్టీల నేతలు భవిష్యత్ రాజకీయాలుపై కలిసి అడుగులు వేయనున్నాయా అని చర్చ మళ్లీ మెదలైంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu farmhouse controversy: మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Embed widget