అన్వేషించండి

Pawan Kalyan: జనసేనానికి పోటా పోటీగా ఫోన్లు - ఆ రెండు పార్టీలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి !

Janasena Chief Pawan Kalyan: జనసేనాని ఉద్దేశపూర్వకంగానే బీజేపీ, టీడీపీకి దూరంగా ఉంటున్నారనే గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. బీజేపితో పొత్తు ఉందని పదే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. 

జనసేనాని విశాఖ పర్యటన వివాదంపై ఆ రెండు పార్టీలు చెబుతున్నాయనే అంశంపై రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. మెన్నటివరకు ఆ రెండు పార్టీలకు పవన్ దూరంగా ఉంటున్నారంటూ జరిగిన ప్రచారానికి విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడి ఘటన తరువాత కాస్త క్లారిటి వచ్చినట్లు కనిపిస్తోంది. విశాఖ పర్యటన తరువాత రాజకీయ పరిస్దితులు మారాయా అనే చర్చ నడుస్తుంది. జనసేనాని ఉద్దేశపూర్వకంగానే బీజేపీ, టీడీపీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం గత కొంతకాలం నుంచి ఏపీలో జరుగుతోంది. ముఖ్యంగా బీజేపితో పొత్తు ఉందని పదే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. 

ఢిల్లీలో పవన్‌కు దూరంగా బీజేపీ పెద్దలు !
పవన్ టీడీపీకి దగ్గర అవుతున్నారని, అందుకే బీజేపీ నేతలు పవన్ ను దూరం పెడుతున్నారని కూడా ప్రచారం జరిగింది. బీజేపి అదిష్టానం చాలా సార్లు పవన్ ను కనీసం అపాయింట్ మెంట్ కూడ ఇవ్వలేదని, అందుకే కాషాయ పార్టీ నేతలతో పవన్ దూరంగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావించారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ బీజేపి నేతలను కలుసుకునేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ లేకపోవడంతో ఎవరినీ కలవకుండానే తిరిగొచ్చారని చర్చ నడిచింది. ఇదే విషయంలో సోషల్ మీడియా కేంద్రంగా పవన్ పై ట్రోలింగ్ జరిగింది. వైసీపీ నేతలు ఈ విషయంలో పవన్ ను నేరుగానే టార్గెట్ చేసి విమర్శలు చేశారు. 
సరిగ్గా అదే సమయంలో బీజేపి నేతలకు వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వెళ్లటం, పవన్ కు బీజేపి నేతలు అపాయింట్ మెంట్ ఇవ్వలేదనే ప్రచారం జరగడంతో దూరం పెరిగిందా అనే అనుమానం ప్రజల్లోనూ మొదలైంది. పవన్ అసంతృప్తికి కారణం అయిన వరుస ఘటనలతో దూరం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే విషయంలో జనసేన నాయకుల కన్నా, బీజేపి నేతలే అనేక సార్లు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జనసేన తమతోనే ఉందని ఇరు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని నేతలు అన్నారు. దీనిపై జనసేన నాయకులు మాత్రం అంతగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. పవన్ కూడా బీజేపి విషయంలో ఎదురయిన పలు అంశాలపై మాట్లాడేందుకు కూడ చాలా సార్లు నిరాకరించారు. కానీ తనకు మద్దతు ఉందని మాత్రం పలుమార్లు ప్రస్తావించారు.

టీడీపీ విషయంలోనూ జససేన వ్యవహరం పై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. గత ఎన్నికల తరువాత జనసేన టీడీపీకి దూరంగా వచ్చింది. బీజేపికి దగ్గరగా ఉన్నామని, ఆ పార్టీల పొత్తుపై క్లారిటీ వచ్చింది. కానీ  టీడీపీ నేతలు మాత్రం పవన్ ను, ఆయన పార్టీ నేతలను దూరం పెట్టలేదని చెబుతున్నారు. ఇక్కడ రాజకీయ కారణాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీకి, బీజేపి నేతలు కూడా టచ్ లో ఉన్నారు. టీడీపీ కీలక నేతలు బీజేపీలో చేరినప్పటికి తెర వెనుక మాత్రం వారంతా టీడీపీకి దగ్గరగా ఉన్నారనే ప్రచారం లేకపోలేదు. ఇదే సమయంలో టీడీపీ నేతలు జనసే ను అదే సాఫ్ట్ కార్నర్ లో చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడే మరో కీలక అంశంపై చర్చ నడుస్తుంది. గతంలో పలుమార్లు పవన్ ప్రసంగాల్లో ఇప్పటి వరకు మేం తగ్గాం.. ఇకపై మీరు తగ్గాలని వ్యాఖ్యలు చేశారు. అవి టీడీపీని ఉద్దేశించి చేసినవేనని ఏపీ ప్రజలు సైతం అనుకున్నారు.  

పొత్తుల విషయం పరిశీలిస్తే, టీడీపీకి పవన్ సీట్ల విషయంలో కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో జనసేన, టీడీపీ, బీజేపీ దారెటు  వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో ఉంటుందోననే ఆసక్తి మొదలైంది. ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల్లో పవన్ మరో కామెంట్ కూడా చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న ఓటును చీలకుండా చూస్తామని పవన్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు అన్ని కలుస్తాయని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు జనసేనాని.
విశాఖ వేదికగా పోటా పోటీ ఫోన్ లు...
విశాఖ వేదికగా జనసేనానిపై వైసీపీ పొలిటికల్ టార్గెట్ చేసింది. ఈ పరిస్థితుల్లో మూడు పార్టీలు కలిసే ఉన్నాయని, గతంలోలాగ కూటమి ఏర్పాటు చేస్తాయా అని వైసీపీలో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. బీజేపి ఏపీ నాయకులు, జాతీయ నేతలు పవన్ కు మద్దతుగా నిలిచారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా పవన్ కు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పవన్ పట్ల వ్యవహరించిన తీరును బీజేపీ, టీడీపీ తప్పుపట్టాయి. ఇదే వేదికగా మూడు పార్టీల నేతలు భవిష్యత్ రాజకీయాలుపై కలిసి అడుగులు వేయనున్నాయా అని చర్చ మళ్లీ మెదలైంది.

టాప్ హెడ్ లైన్స్

CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
Gade Saikrishna Case: గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం- సిట్ అదుపులో ఇద్దరు కానిస్టేబుల్స్‌ 
గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం- సిట్ అదుపులో ఇద్దరు కానిస్టేబుల్స్‌ 
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget