అన్వేషించండి

Pawan family meeting with Modi : ఫ్యామిలీతో సహా ప్రధాని మోదీతో పవన్ భేటీ - ఆత్మీయ పలకరింపులు !

Andhra Politics : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబంతో ప్రధాని మోదీని కలిశారు. రాజకీయాలకు సంబంధం లేని ఆత్మీయ సమావేశం అని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Jana Sena chief Pawan Kalyan met PM Modi with his family : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రదాని మోదీతో సమావేశం అయ్యారు. ఆయన వెంట సతీమణి అన్నా లెజ్ నోవా, కుమారుడు అకీరానందన్ ఉన్నారు. ఎన్డీఏ కూటమి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడే ఉన్నారు. మరోసారి శుక్రవారం ఎన్డీఏ కూటమి సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ సమయం ఇవ్వడంతో ఆయనతో మరోసారి సమావేశం అయ్యారు. కుటుంబాన్ని పరిచయం  చేశారు. తన కుమారుడు అకీరాను కూా ప్రధానితో భేటీకి తీసుకెళ్లారు. అకీరా ఇటీవల పవన్ కల్యాణ్‌తో ఎక్కువగా కనిపిస్తున్నారు. చంద్రబాబునాయుడుతో సమావశంలోనూ అకీరా కనిపించారు. 

సమావేశంలో  కుమారుడ్ని ప్రధానికి పరిచయం చేశారు పవన్ కల్యాణ్. 

 ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రెండు ఎంపీ సీట్లు ఉన్న జనసేన పార్టీ కూడా ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బుధవారం జరిగిన ఎన్డీఏ మీటింగ్‌లో కూడా పవన్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రధాని మోదీ నాయకత్వానికి మద్దతిస్తూ సంతకాలు కూడా చేశారు. మరోసారి శుక్రవారం ఎన్డీఏ సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి వర్గంలో జనసేన పార్టీకి కూడా చోటు దక్కుతుందని భావిస్తున్నారు.   

ఎన్నికల్లోఅద్భుత విజయం సాధించిన జనసేన 

ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అరుదైన ఘనత సాధించారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించారు.  రాష్ట్రంలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసేన భాగస్వామ్యం ఉంటుందని పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ చెప్పారు. అయితే అదే సమయంలో జనసేన ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెడుతోందని, ఈ రెండింటి మధ్య టెక్నికల్‌గా ఎలా సాధ్యమో చూడాలని అంటున్నారు. అంటే ప్రతిపక్ష పాత్ర కూడా జనసేన పాటించాలనుకుంటోంది.                            
 
కేవలం రూపాయి జీతం తీసుకుంటాననే ఆర్భాటపు మాటలు కాకుండా ఓ ప్రజా ప్రతినిధిగా ఖజానా నుంచి సంపూర్ణ జీతం తీసుకుంటా. దీనివల్ల తాము చెల్లించే పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నందున పనులు ఎందుకు చేయవనే అధికారం ప్రజలకు ఉంటుంది. అందుకే సంపూర్ణంగా జీతం తీసుకొని అంతే సంపూర్ణంగా ప్రజల కోసం కష్టపడతానని స్పష్టం చేస్తున్నారు.  యువతకు ప్రజాప్రతినిధులు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా జనసేన ప్రయాణం ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించి ఎన్నో సమస్యలున్నాయి. వ్యక్తిగత దూషణలు లేకుండా కొత్త ఒరవడిని తెద్దాం. కొత్తగా నిరి్మస్తున్న జనసేన కార్యాలయం తలుపులు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేందుకు నిరంతరం తెరిచే ఉంటాయని క్యాడర్‌కు భరోసా ఇచ్చారు.                        

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Case against Aare Shyamala: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
CM Revanth Reddy: ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
Deputy CM Pawan Kalyan: తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
Advertisement

వీడియోలు

Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Case against Aare Shyamala: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
CM Revanth Reddy: ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
Deputy CM Pawan Kalyan: తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
Allu Sirish Nayanika : ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
ICC Women's World Cup 2025: జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి కారణం అదే! మానసికంగా కుంగదీస్తున్న వివాదాలకు బ్యాట్‌తో సమాధానం!
జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి కారణం అదే! మానసికంగా కుంగదీస్తున్న వివాదాలకు బ్యాట్‌తో సమాధానం!
Second Hand Car Buying Tips పాత కారు కొనే ముందు ఈ 3 విషయాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!
పాత కారు కొనే ముందు ఈ 3 విషయాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!
No Nut November : నవంబర్ స్పెషల్ NNN... అబ్బాయిలు ఇది ఫాలో అయితే కలిగే లాభాలేంటి? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
నవంబర్ స్పెషల్ NNN... అబ్బాయిలు ఇది ఫాలో అయితే కలిగే లాభాలేంటి? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
Embed widget