అన్వేషించండి

Weather Updates Today: నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి

Andhra Pradesh News : తీవ్ర వాయుగుండం నేడు ఫెంగల్ తుపానుగా మారనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Rains In Andhra Pradesh | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇదివరకే తీవ్ర వాయుగుండంగా మారింది. నేడు వాయుగుండం ఫెంగల్ తుపానుగా ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతా వరణం మారిపోయింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర- వాయువ్య దిశగా కదులుతూ బుధవారం తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 

మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారి తమిళనాడు-శ్రీలంక తీరాలవైపు వెళ్లొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 27, 28, 29న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో వచ్చే నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.


Weather Updates Today: నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి

ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ 

ఏపీలో 27న ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. అయితే నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలతో పాటు యానాంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్, కృష్ణా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.

రాయలసీమలో శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నందున ఈ ప్రాంతాలకు కూడా ఐఎండీ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా నవంబర్ 28 నుంచి ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ చేసింది.  

అన్నదాతలకు వాతావరణశాఖ సూచనలు

రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా వరికోతలు ఆపాలని అన్నదాతలకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. వాతావరణ శాఖ ప్రకటన కంటిమీద కునుకులేకుండా చేస్తోందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఆకాశం మేఘావృతమై చలిగాలుల తీవ్రత పెరగడంతో తుపాను ముప్పుతప్పేలా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 30 మండలాల్లో సుమారు 4.37 లక్షల ఎకరాలలోవరిసాగైంది. ధాన్యం కోనుగోలు ముమ్మరంగా చేసి ఉంటే మరింత మంది కోతకోసి ఉండేవారు. సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు లేక పోవడం వాతావరణం కలిసి రాకపోయిన తుఫాన్ ప్రభావం లేకపోవడంతో నానా హైరానా తో పెట్టుబడి అధికమైన వరిపంటను రైతులు పండించగలిగారు. ఇప్పటికే వరిపైరును కోసి ఇమ్ము చేసిన రైతులు నూర్పు చేసిన ధాన్యం బస్తాలలో ఎత్తి నిల్వ చేస్తున్నారు. 


Weather Updates Today: నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి

తెలంగాణపై ఫెంగల్ తుపాను ప్రభావం

ఫెంగల్ తుపాను తెలంగాణపై సైతం ప్రభావం చూపనుంది. ఒక్రటెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. నాలుగైదు రోజులపాటు విపరీతంగా చల్లగాలులు వీచనున్నాయని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చిన్నారులు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం పొగమంచు అధికంగా కురవనుంది.

ప్రాంతాలు  గరిష్టం కనిష్టం
ఆదిలాబాద్  28.8    9.7
హైదరాబాద్ 28.4 14.8
ఖమ్మం  31.2       18.4
భద్రాచలం  29.6    18
దుండిగల్  28.4    13.2
పటాన్‌చెరు  28.2    11.2
హయత్ నగర్ 28      15 
నిజామాబాద్ 30.5     14.2
రామగుండం 28    15.4
మహబూబ్ నగర్ 29.4     18.2
మెదక్  28.6      10.6
నల్గొండ  28.5      18

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget