అన్వేషించండి

Weather Updates Today: నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి

Andhra Pradesh News : తీవ్ర వాయుగుండం నేడు ఫెంగల్ తుపానుగా మారనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Rains In Andhra Pradesh | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇదివరకే తీవ్ర వాయుగుండంగా మారింది. నేడు వాయుగుండం ఫెంగల్ తుపానుగా ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతా వరణం మారిపోయింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర- వాయువ్య దిశగా కదులుతూ బుధవారం తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 

మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారి తమిళనాడు-శ్రీలంక తీరాలవైపు వెళ్లొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 27, 28, 29న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో వచ్చే నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.


Weather Updates Today: నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి

ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ 

ఏపీలో 27న ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. అయితే నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలతో పాటు యానాంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్, కృష్ణా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.

రాయలసీమలో శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నందున ఈ ప్రాంతాలకు కూడా ఐఎండీ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా నవంబర్ 28 నుంచి ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ చేసింది.  

అన్నదాతలకు వాతావరణశాఖ సూచనలు

రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా వరికోతలు ఆపాలని అన్నదాతలకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. వాతావరణ శాఖ ప్రకటన కంటిమీద కునుకులేకుండా చేస్తోందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఆకాశం మేఘావృతమై చలిగాలుల తీవ్రత పెరగడంతో తుపాను ముప్పుతప్పేలా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 30 మండలాల్లో సుమారు 4.37 లక్షల ఎకరాలలోవరిసాగైంది. ధాన్యం కోనుగోలు ముమ్మరంగా చేసి ఉంటే మరింత మంది కోతకోసి ఉండేవారు. సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు లేక పోవడం వాతావరణం కలిసి రాకపోయిన తుఫాన్ ప్రభావం లేకపోవడంతో నానా హైరానా తో పెట్టుబడి అధికమైన వరిపంటను రైతులు పండించగలిగారు. ఇప్పటికే వరిపైరును కోసి ఇమ్ము చేసిన రైతులు నూర్పు చేసిన ధాన్యం బస్తాలలో ఎత్తి నిల్వ చేస్తున్నారు. 


Weather Updates Today: నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి

తెలంగాణపై ఫెంగల్ తుపాను ప్రభావం

ఫెంగల్ తుపాను తెలంగాణపై సైతం ప్రభావం చూపనుంది. ఒక్రటెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. నాలుగైదు రోజులపాటు విపరీతంగా చల్లగాలులు వీచనున్నాయని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చిన్నారులు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం పొగమంచు అధికంగా కురవనుంది.

ప్రాంతాలు  గరిష్టం కనిష్టం
ఆదిలాబాద్  28.8    9.7
హైదరాబాద్ 28.4 14.8
ఖమ్మం  31.2       18.4
భద్రాచలం  29.6    18
దుండిగల్  28.4    13.2
పటాన్‌చెరు  28.2    11.2
హయత్ నగర్ 28      15 
నిజామాబాద్ 30.5     14.2
రామగుండం 28    15.4
మహబూబ్ నగర్ 29.4     18.2
మెదక్  28.6      10.6
నల్గొండ  28.5      18

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget