అన్వేషించండి

Guntur News : వృద్ధురాలి భూమి కొట్టేసిన అధికార పార్టీ నేతలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న బామ్మ!

Guntur News : గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అధికార పార్టీ నేత తన భూమి కబ్జా చేశాడని ఓ వృద్ధురాలు పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. స్పందనలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తుంది.

Guntur News : గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడులో అధికార పార్టీ నాయకులు బాలసాని, అనిల్ తన స్థలాన్ని కబ్జా చేశారని వృద్ధురాలు వెంకట సుబ్బమ్మ కన్నీటి‌ పర్యంతం అయ్యారు. తెనాలికి చెందిన వృద్ధురాలు‌ ఇక్కడ కొంత భూమిని కొన్నారు. ఇటీవల తన స్థలంలో ఇల్లు కట్టు కొనేందుకు రాగా ఆ స్థలాన్ని ఆక్రమించి అధికార పార్టీ నాయకుని అనుచరులు దౌర్జన్యానికి దిగారని ఆవేదన వ్యక్తం చేసింది. స్థలంలోకి అడుగు పెడితే చంపేస్తామని బెదిరించారని కన్నీటి పర్యంతం అయింది. భూ కబ్జాకు పాల్పడిన నాయకుడికి అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని ఆరోపించింది వృద్దురాలు. తన స్థలాన్నీ ‌ఆక్రమించి భూకబ్జాకు పాల్పడిన నాయకుడు, అతని అనుచరులపై  చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, తాడేపల్లి పోలీసులను ఆశ్రయించానని ఆమె తెలిపారు. ఇంత వరకు తనకు న్యాయం జరగలేదని‌‌ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఇదే తరహాలో భూకబ్జాకు పార్టీ నాయకుడు, అతని అనుచరగణం పాల్పడుతూ, బెదిరిస్తున్నారని స్థానికులు సహితం ఆరోపిస్తున్నారు. 

"నేను 23 గజాలు కొనుకున్నాను. స్థలం వద్దకు వెళ్లి చూస్తే బాలసాని, అనిల్ అది తమ స్థలమని నన్ను బెదిరించారు. స్పందనలో ఫిర్యాదు చేశాను, సీఐ, ఎస్పీలకు కూడా చెప్పుకున్నాను. కానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. వైసీపీ పార్టీ నేతలని ఎవరూ పట్టించుకోవడంలేదు. స్థలం చుట్టూ కంచె వేశాను. నా భూమిని ఆక్రమించుకుని నన్ను బెదిరిస్తున్నారు. స్థలం మాదేనని వాధిస్తున్నారు. చాలా రోజులుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. ఎవరూ పట్టించుకోవడంలేదు. నాకు న్యాయం చేయండి" బాధితురాలు వెంకట సుబ్బమ్మ. 

Guntur News : వృద్ధురాలి భూమి కొట్టేసిన అధికార పార్టీ నేతలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న బామ్మ!

కొండను మింగేసిన అధికార పార్టీ నేత : టీడీపీ ఆరోపణలు 

శ్రీకాకుళం జిల్లా మందస మండలం బహాడపల్లి పంచాయతీ, నల్ల బొడ్లూరు గ్రామం సమీపంలో ఉన్న 9 ఎకరాలు కంకర కొండను ఎటువంటి అనుమతులు లేకుండా అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు అక్రమ తవ్వకాలు జరిపి అమ్ముకున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆరోపించారు. గత సంవత్సరం మందస మండల తహసీల్దార్ బి.పాపారావు, మైన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ కొండపై ఉద్దానం మంచినీటి పథకానికి సంబంధించిన తాగునీటి ట్యాంకు ఉంది. గత సంవత్సర కాలంగా స్థానిక అధికారులకు సమాచారం అడిగిన ఇవ్వని కారణంగా ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకుని ప్రజలకు తెలియజేస్తామని గౌతు శిరీష అన్నారు. ఈ సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్న టీడీపీ నాయకులకు, కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
10K Steps Daily : రోజుకు 10 వేల అడుగులు నడవాలా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు
రోజుకు 10 వేల అడుగులు నడవాలా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Rains In AP and Telangana: ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
Embed widget