అన్వేషించండి

Ippatam Politics : ఇప్పటం చుట్టూ ఏపీ రాజకీయాలు, పవన్ ప్రకటించిన ఆర్థిక సాయం వద్దంటూ బ్యానర్లు!

Ippatam Politics : ఏపీలో ఇప్పటం గ్రామం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. తాజాగా పవన్ ప్రకటించిన ఆర్థిక సాయం వద్దంటూ గ్రామంలో బ్యానర్లు వెలిశాయి.

Ippatam Politics : జనసేనాని పవన్ కల్యాణ్ సభ తరువాత ఫేమస్ అయిన ఇప్పటం గ్రామం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. దీంతో గ్రామస్తులపై రాజకీయ ఒత్తిడి పెరగడంతో పవన్ ప్రకటించిన ఆర్థిక సాయం వద్దంటూ కొందరు ఏకంగా బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు.

ఇప్పటంపై పట్టు కోసం  

ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పేరిట ఇళ్లు కూల్చివేత వ్యవహారం తరువాత రాజకీయం ఆసక్తిగా మారింది. ఎవరికి వారు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో గ్రామస్తులపై ఒత్తిడి పెరిగిపోయింది. జనసేన అధినేత పవన్ గ్రామంలో పర్యటించి స్థానికంగా నష్టపోయిన బాధితులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. ఒక్కసారిగా మారిన రాజకీయంతో అధికార పక్షం దూకుడు మరింతగా పెంచింది. పవన్ ఇస్తానని ప్రకటించిన ఆర్థిక సాయాన్ని నిరాకరిస్తున్నట్లు కొందరు పరోక్షంగా తమ ఇళ్ల ముందు బ్యానర్లను ప్రదర్శించారు. గ్రామంలో రాజకీయం వద్దని సూచించారు. మీ పరిహారం మాకొద్దని బ్యానర్లపై రాశారు. ఇప్పటం గ్రామం  వరుసగా వార్తల్లో కి ఎక్కటం, గ్రామంలో రాజకీయ పార్టీలన్నీ పోటా పోటీగా తమ ఆర్భాటాలను ప్రదర్శించుకునే ప్రయత్నం చేయటంతో గ్రామస్తులు వాటిని ఎదుర్కొనేందుకు ఇలాంటి చర్యలు చేపట్టారని అంటున్నారు.Ippatam Politics : ఇప్పటం చుట్టూ ఏపీ రాజకీయాలు, పవన్ ప్రకటించిన ఆర్థిక సాయం వద్దంటూ బ్యానర్లు!

సభ తరువాత 50 లక్షలకు కూడా ఆటంకమే 

జనసేన ఆవిర్భావ సభ తరువాత సభాస్థలికి భూమిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటం గ్రామానికి 50 లక్షల రూపాయలు విరాళాన్ని అందించారు పవన్ కల్యాణ్. అయితే అవి కూడా గ్రామానికి ఇంకా అందలేదు. పవన్ ఇచ్చే విరాళాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశాలు వచ్చాయని, స్థానిక మున్సిపల్ అధికారులు చెప్పటంతో  గ్రామస్తులు అందుకు అంగీకరించలేదు. దీంతో గ్రామంలోని పెద్దలంతా కలసి కమిటీగా ఏర్పడి, పవన్ ఇచ్చే 50 లక్షల రూపాయలతో గ్రామంలో అవసరమైన వాటికి నిధులు ఖర్చు చేసుకోవాలని తీర్మానించారు. అయితే ఇందుకు వైసీపీ నేతలు సహకరించలేదు. దీంతో అది కాస్త  ఇప్పటికీ పెండింగ్ లో పడింది. ఇప్పుడు ఇళ్ల తొలగింపుతో నష్టపోయిన బాధితులను పవన్ లక్ష రూపాయలు పరిహారం ప్రకటించారు. అదే సమయంలో బాధితులను గుర్తించి వారికి జనసేన కార్యాలయం నుంచి సమాచారాన్ని అందించారు. దీంతో గ్రామంలో జనసేన నాయకులు పవన్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు.  

అకస్మాత్తుగా బ్యానర్ల ప్రదర్శన 

ఇప్పటికే రాజకీయంగా ఇప్పటం గ్రామం హైలైట్ కావటంతో  గ్రామంలో కొందరికి ఇబ్బందిగా మారింది. దీంతో ప్రభుత్వం తమ ఇంటిని కూల్చలేదని, మీ ఎవ్వరి సానుభూతి తమకు అవసరం లేదని, డబ్బులు ఇచ్చి అబద్దాన్ని నిజం చేయాలని ప్రయత్నించవద్దంటూ కొన్ని ఇళ్ల ముందు బ్యానర్లను ప్రదర్శించారు. అయితే దీని వెనక వైసీపీ నేతల ప్రమేయం ఉందనే ప్రచారం కూడా ఉంది. పవన్ ఇస్తానంటున్న ఆర్థిక సహాయాన్ని అడ్డుకునే క్రమంలో రాజకీయంగా పై చేయి సాధించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి బ్యానర్లను ఏర్పాటు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.  మరో వైపు ఇప్పటం గ్రామం కేంద్రంగా జరుగుతున్న రాజకీయం కేవలం, గ్రామానికి మాత్రమే పరిమితం కావటం లేదు. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఇప్పటం గ్రామంపై పట్టుకోసమే రాజకీయంగా జనసేన, వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపున టీడీపీ నేత నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీకి సిద్ధమవుతున్న వేళ ఏ అవకాశం దక్కినా వదలుకోకుండా రాజకీయ పార్టీలు చక్రం తిప్పుతున్నాయి.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget