అన్వేషించండి

Guntur: రద్దయిన 26 పథకాలు వెంటనే అమలు చెయ్యాలి, గుంటూరులో 48 గంటలపాటు నిరసన దీక్ష

రద్దయిన 26 పథకాలను వెంటనే అమలు చెయ్యాలని కోరుతూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల పాటు నిరసన దీక్ష ప్రారంభిచారు.

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ లో రద్దయిన 26 పథకాలను వెంటనే అమలు చెయ్యాలని కోరుతూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల పాటు నిరసన దీక్ష ప్రారంభిచారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ నేతృత్వంలో నిరసన దీక్ష ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, గుజరాత్ ఎమ్మెల్యే శంభునాథ్ తుండియా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోర్చా ఇంఛార్జ్ బిట్ర శివన్నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు దీక్షలో పాల్గోన్నారు. 

రూ.32 వేల కోట్లను అనుచరులకు దోచిపెట్టారు ! 
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 32 వేల కోట్ల నిధులను ఏపీ సీఎం జగన్ తన అనుచరులకు దోచిపెట్టారని ఆరోపించారు. దళితుల కార్పొరేషన్ లో వారికి ఎటువంటి నిధులు లేకుండా చేసి, ఎస్సీలను రోడ్డు మీద వదిలేశారన్నారు. సీఎం జగన్ వారికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఆశపెట్టి.. వారికి రావాల్సిన నిధులను దోచుకున్నారని ఆరోపించారు. దళితులకు ద్రోహం చేసిన వారు మంత్రులగా పనికి రారు. వారిని నిరుద్యోగులను చేసింది వైసీపీ ప్రభుత్వం అని మండిపడ్డారు. 

దళిత కార్పొరేషన్ లో దళితులకు రద్దు చేసిన పథకాలను తిరిగి అమలు చెయ్యాలని బీజేపీ ఎస్సీ ప్రధాన కార్యదర్శి, గుజరాత్ ఎమ్మెల్యే శంభునాథ్ తుండియా కోరారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ 48 గంటల నిరసన దీక్ష చేపట్టిందన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం దళితులను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల నిధులను దుర్వినియోగం చెయ్యడమే కాకుండా వారిని చంపిన వారికి వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వటం చాలా దారుణం అన్నారు. వైసీపీ చేసే ఎన్నో అరాచకాలను సహించాం, కాని దళితులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. చివరికి వారి భుములు కూడా లాక్కొని అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం, ఎస్సీలను విద్యకు కూడా దూరం చేస్తూ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. 
వైసీపీ ప్రభుత్వం చేసే అన్యాయాలను ఎత్తి చూపిస్తాం, ఎందుకు ఈ ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపిస్తుంది వారికి ప్రజలను హింసించడంలో ఆనందం పొందుతున్నారని అన్నారు. కేంద్రం  ప్రవేశ పెట్టిన 26 పథకాలు ఎస్సీ ఎందుకు రద్దు చేసారు అని ప్రశ్నించారు, వాటిని వెంటనే ఆంధ్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా వింతలు చూస్తున్నామని, ఆయనకు నచ్చినట్లు ప్రజలను ఆడుకుంటున్నారని తెలిపారు. తన ఇంట్లో సొమ్ము ప్రజలకు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నాడని, రాష్ట్రాన్ని దోచుకుంటూ ప్రజలను హింసిస్తున్నాడని ఆరోపించారు. 

కేంద్రం ఇస్తున్న సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించే హక్కు మీకెవరు ఇచ్చారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీలో బ్రిటీష్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నట్లు అనిపిస్తుందన్నారు. నవరత్నాల పేరుతో నిధులను పంచుతూ ఓట్లు అడిగే హక్కు జగన్‌కు లేదన్నారు. రాష్ర్టంలో మంత్రుల ప్రవర్తన తలదించుకునేల ఉందని మండిపడ్డారు. తన యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంతలా దిగజారిన పోలీసు వ్యవస్థను చూడలేదని, పేదల సొమ్ముతో బతుకుతున్నారంటూ మండిపడ్డారు. అమ్మ ఒడి పేరుతో ఏ విధంగా 26 పథకాలను తొలగిస్తారని ఏపీ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఇంకా ఎన్ని రోజులు దళితుల సొమ్ము తింటారు, జగన్ నీతిమాలిన చట్టాలు ఇక ఈ రాష్ట్రంలో చెల్లవని హెచ్చరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

అమరావతి శాశ్వత రాజధానంట... మేమేమో అడుక్కు తినాలంట..! రాజధానిపై ధర్మాన కీలక వ్యాఖ్యలు
అమరావతి శాశ్వత రాజధానంట... మేమేమో అడుక్కు తినాలంట..! రాజధానిపై ధర్మాన కీలక వ్యాఖ్యలు
AP Coaching Institutions Rules 2026: ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
Maoist Surrender: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
AP Coaching Institutions Rules 2026: ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Hardik Pandya Luxury Car: హార్దిక్ పాండ్యా లగ్జరీ కార్ల కలెక్షన్ , ఇండియాలోనే ఫస్ట్ ఓనర్‌గా రికార్డు!
హార్దిక్ పాండ్యా లగ్జరీ కార్ల కలెక్షన్ , ఇండియాలోనే ఫస్ట్ ఓనర్‌గా రికార్డు!
CSK vs RR: చెన్నై కష్టాలను పెంచగల రాజస్థాన్ ఆటగాళ్లు వీరే.. లిస్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
చెన్నై కష్టాలను పెంచగల రాజస్థాన్ ఆటగాళ్లు వీరే.. లిస్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
Maoist Surrender: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
Embed widget