అన్వేషించండి

AP All Party Meeting : ఏపీ ప్రభుత్వ స్పాన్సర్డ్ టెర్రరిజంపై కలసికట్టుగా పోరాటం - ఏపీలో అఖిలపక్ష పార్టీల నిర్ణయం !

ఏపీలో ప్రభుత్వ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోందని.. దానికి వ్యతిరేకంగా అందరూ ఏకమై పోరాడాలని నిర్ణయించుకున్నారు. విజయవాడలో తొలి అఖిలపక్ష సమావేశం జరగింది.

AP All Party Meeting  :  ఆంద్రప్రదేశ్ లో అప్రజాస్వామిక చర్యల పై సుప్రీం న్యాయమూర్తికి ఫిర్యాదు చేయాలని టీడీపీ ఆద్వర్యాన జరిగిన అఖిల పక్ష సమావేశం తీర్మానం చేసింది.ఎపీలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్య హక్కుల దుర్వినియోగం పై ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం – సేవ్ డెమెక్రసీ నినాదంతో అఖిలపక్ష సమావేశం విజయవాడలో జరిగింది. టీడీపీ  రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అద్యక్షతన జరిగిన సమావేశంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గోని రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల పై విరుచుకుపడ్డారు. 

మూడున్నరేళ్లలో ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయ్యిందని, వైసీపీ వచ్చాక వాక్ స్వాతంత్రాన్ని ప్రజలు కోల్పోయారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు  విమర్శించారు.  రాష్ట్రానికి ఒక ఫ్యాక్షనిస్టు సీఎం అయ్యాడని ద్వజమెత్తారు. జగన్ కు ఓటేసి ప్రజలు తప్పు చేశారని వ్యక్తిగతంగా భావిస్తున్నారని, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తండ్రి తరహాలోనే మరోసారి రాష్ట్రాన్ని  దోచుకోవడానికి సీఎం అయ్యారని మండిపడ్డారు. ప్రజలు ఒక అవినీతి పరుడుకి ఓటేశారన్నారు.  ఎన్నిక అయిన తరువాత వైసీపీ తప్ప రాష్ట్రంలో ఎవరూ ఉండ కూడదనుకుంటున్నారని మండిపడ్డారు. కేసులు పెట్టి, జైల్లో వేసినా ప్రతిపక్షాలన్నీ పోరాడుతున్నాయని అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ పై అన్ని వర్గాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, జగన్ రెడ్డి నాయకత్వంలోనే 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని గుర్తు చేశారు. జోగి రమేష్ ,చంద్రబాబు ఇంటి పై దాడికి పాల్పడ్డారని .. పల్నాడులో 18 మంది బలహీన వర్గాలకు చెందిన వారిని హత్య  చేశారని గుర్తు చేశారు. మాచర్ల ఘటనతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలని ప్రయత్నం జరిగిందని ఫైర్ అయ్యారు.సిద్దాంతాలు, పార్టీలు వేరైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అచ్చెన్నాయుడు అన్నారు. 

 స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం - సేవ్ డెమొక్రసీ అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు.ఈ తీర్మానాలను  అఖిలపక్ష, ప్రజాసంఘాల నేతలు ఆమోదించారు. రాష్ట్రంలో జరిగిన అప్రజాస్వామిక, హింసాత్మాక ఘటనలు ఖండిస్తూ అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు కలిసి గవర్నర్, ఏపీకి రానున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం సమర్పించాలని తీర్మానం చేశారు. ప్రజాస్వామ్య ఉద్యమాన్ని మరింతగా సమన్వయ పరచడానికి రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు.

పోలీసుల ఏకపక్ష దమన చర్యలను నిరసిస్తూ బాధితులకు రక్షణగా ప్రతి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక పని చేసేందుకు ప్రణాళికను సిద్దం చేయాలని తీర్మానం చేశారు. గ్రామ, మండల స్థాయిలో ప్రజల్ని చైతన్య పరచడానికి నిరంతర కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం చేశారు.. ఏపీలో 2019 ప్రజా వ్యతిరేక పాలనపై నిరనస తెలిపిన ప్రతిపక్షం, ప్రజా సంఘాలు, దళిత, బహుజన, ముస్లిం మైనారిటీలపై జరిగిన హింసాత్మ  దాడులను అఖిలపక్ష సమావేశంలో  ఖండించారు. రాబోయే రోజుల్లో అఖిలపక్షం నేతలు విజయవాడ వేదిక గా చేసుకొని ప్రతి నెల సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Janasena Rajya Sabha Nominee Lingamaneni Ramesh: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ - అధికారిక ప్రకటన
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ - అధికారిక ప్రకటన

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
India Predicted Playing XI Vs AFG: ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
Embed widget