అన్వేషించండి

Female Population: ఏపీలో అబ్బాయిల కంటే అమ్మాయిల జనాభే ఎక్కువ- దేశవ్యాప్తంగా మనం ఏ స్థానంలో ఉన్నామంటే?

Female Population: 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలున్నారు. ఇప్పుడు 2023–24లో ఆ సంఖ్య ప్రతి వెయ్యిమందికి 1,032కు చేరింది.

Andhra Pradesh: లైంగిక వివక్ష అనే మానసిక రుగ్మత విషయంలో రాను రాను మార్పు కనపడుతోంది. భ్రూణ హత్యల వంటి దుర్మార్గాల సంఖ్య కూడా తగ్గుతోంది. ఆడబిడ్డ అంటే అరిష్టం కాదు, అదృష్టం అనే విధంగా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు కనపడుతోంది. దీనికి తాజా నిదర్శనమే ఈ గణాంకాలు. లేబర్ ఫోర్స్ సర్వే విడుదల చేసిన తాజా గణాంకాలు భారత దేశంలో పెరుగుతున్న ఆడ పిల్లల సంఖ్యను తెలియజేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్థానం మరింత మెరుగుపడటం ఇక్కడ విశేషం. 

ఏపీలో అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పుట్టిన ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 1032గా ఉంది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అబ్బాయిల సంఖ్య కంటే అమ్మాయిల సంఖ్యే అధికంగా ఉంటోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే ఈ వివరాలను బయటపెట్టింది. 2023 జులై నుంచి 2024 జూన్‌ వరకు ఈ సర్వే జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆడబిడ్డల సంఖ్య పెరుగుతోందనేది ఈ సర్వే సారాంశం. 

కేరళ టాప్.. 
ఎప్పటిలాగే అక్షరాస్యత అధికంగా ఉన్న కేరళ రాష్ట్రం ఆడబిడ్డల సంఖ్యలో కూడా తన మొదటి స్థానాన్ని నిలుపుకొంది. అబ్బాయిల కన్నా అమ్మాయిలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో మేఘాలయ నిలిచింది. ఒడిశా మూడో స్థానంలో ఉండగా.. ఏపీకి మరో పొరుగు రాష్ట్రం తమిళనాడు నాలుగో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది. టాప్-5లో మేఘాలయ మినహా మిగతా నాలుగు రాష్ట్రాలు దక్షిణాదిలోనే ఉండటం విశేషం. 

దేశవ్యాప్తంగా చూస్తే అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది. అయితే అమ్మాయిల సంఖ్యలో కూడా గణనీయమైన పెరుగుదల కనపడుతోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 963 మంది అమ్మాయిలున్నారు. నేడు అంటే 2023–24 నాటికి ప్రతి 1000 మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 981కి పెరగడం విశేషం. ఇక ఆడబిడ్డల సంఖ్య అధికంగా ఉన్న కేరళలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1,138 మంది అమ్మాయిలు ఉన్నారు. 

ఏపీలో గణనీయమైన పెరుగుదల.. 
గతంలో అంటే.. 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలున్నారు. ఇప్పుడు 2023–24లో ఆ సంఖ్య ప్రతి వెయ్యిమందికి 1,032కు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య కాస్త తక్కువగా ఉంది. గ్రామాల్లో ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 1,019 కాగా, పట్టణాల్లో ఆ సంఖ్య 1,064 గా ఉంది. 

దేశం మొత్తం మీద 11 రాష్ట్రాల్లో అబ్బాయిలకంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. ఇక అబ్బాయిల సంఖ్య గరిష్టంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. హర్యాణాలో ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు కేవలం 867 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. దేశరాజధాని ఢిల్లీలో కూడా ఈ సంఖ్య దారుణంగా ఉంది. ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 837 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. 

Also Read: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు గుడ్ న్యూస్‌- దసరా నుంచి మరో పథకం అమలు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
HYDRA: రూల్స్ తెలుసా? హైకోర్టును కూడా కూల్చేస్తారా? ఆదివారం కూల్చాల్సిన అవసరమేంటీ? హైడ్రా అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం
రూల్స్ తెలుసా? హైకోర్టును కూడా కూల్చేస్తారా? ఆదివారం కూల్చాల్సిన అవసరమేంటీ? హైడ్రా అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం
Virus Attack: ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
HYDRA: రూల్స్ తెలుసా? హైకోర్టును కూడా కూల్చేస్తారా? ఆదివారం కూల్చాల్సిన అవసరమేంటీ? హైడ్రా అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం
రూల్స్ తెలుసా? హైకోర్టును కూడా కూల్చేస్తారా? ఆదివారం కూల్చాల్సిన అవసరమేంటీ? హైడ్రా అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం
Virus Attack: ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
Mithun Chakraborty: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
Tesla Workers : సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
Mohammed Siraj Catch: కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా
కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా
Devara Collection Day 3: బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ఊచకోత... మూడు రోజుల్లు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు
బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ఊచకోత... మూడు రోజుల్లు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు
Embed widget