అన్వేషించండి

Nitin Gadkari AP visit: ఏపీలో రూ.5 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపనలు - అభివృద్ధిలో దూసుకెళ్తున్నారని గడ్కరీ ప్రశంసలు

National highway projects: ఆంధ్రప్రదేశ్‌లో రూ.5,233 కోట్ల విలువైన 29 జాతీయ రహదారి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

29 national highway projects:  ఆంధ్రప్రదేశ్‌లోని   కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు.  29 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన ,  ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రాజెక్టులు మొత్తం 272 కిలోమీటర్ల విస్తీర్ణంలో రూ.5,233 కోట్ల విలువతో చేపట్టారు. మదనపల్లె-పీలేరు జాతీయ రహదారి,  కర్నూలు-మండ్లెం జాతీయ రహదారుల పనుల పూర్తి కావడంతో ప్రారంభించారు.     
రోడ్లు అభివృద్ధికి చిహ్నం : గడ్కరీ

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు  దీర్ఘకాలిక దృష్టిని , ష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ప్రశంసించారు.   ఈ ప్రాజెక్టులు రాష్ట్రాన్ని భారతదేశ ఆర్థిక వృద్ధి కేంద్రంగా మారుస్తాయని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   నాయకత్వాన్ని  గడ్కరీ  ప్రశంసించారు.  రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆయన సహకారాన్ని కొనియాడారు.  “అమెరికాలో మంచి రహదారుల వల్ల అమెరికా సంపన్నమైంది” అని పేర్కొంటూ, మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ పురోగతికి ఆధారమని నొక్కి చెప్పారు. ఈ రహదారులు వ్యవసాయం, పరిశ్రమలు, మరియు వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని ఆయన తెలిపారు. భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు రవాణా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తాయని ఆయన పేర్కొన్నారు.  విశాఖపట్నంలో రూ.1,85,000 కోట్ల NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ , నక్కపల్లిలో రూ.1,877 కోట్ల బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతం ఇస్తాయని ఆయన తెలిపారు.  

  
రాష్ట్రంలో మరో 20 పోర్టుల నిర్మాణం: చంద్రబాబు

“అభివృద్ధికి, నాగరికతకు రహదారులు చిహ్నం” అని  చంద్రబాబు పేర్కొన్నారు. మంచి రహదారులు ఆర్థిక వృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు,   పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయని ఆయన తెలిపారు.  ఈ 29 జాతీయ రహదారి ప్రాజెక్టులు 272 కిలోమీటర్ల పొడవును కవర్ చేస్తాయి, రాష్ట్రంలో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయన్నారు.  “తలపెట్టిన ప్రతి ప్రాజెక్టును సమర్థంగా పూర్తి చేసిన వ్యక్తి”గా  గడ్కరీని ప్రశంసించారు. గడ్కరీ చొరవ వల్ల దేశవ్యాప్తంగా రోజుకు 37 కిలోమీటర్ల పొడవైన హైవే నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు.  గడ్కరీ హయాంలో జాతీయ రహదారుల అభివృద్ధి గణనీయంగా మెరుగైందని, ముఖ్యంగా ముంబై-పుణె మధ్య తొలి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్ రోడ్డు నిర్మాణం ఒక మైలురాయిగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు.  పోలవరం ప్రాజెక్టుకు గడ్కరీ ఇచ్చిన మద్దతును  ఎప్పటికీ మర్చిపోలేను  అని చంద్రబాబు అన్నారు.  గడ్కరీ హయాంలో సాగర్‌మాలా మరియు భారత్‌మాలా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు భారతదేశ రహదారి వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాయని ఆయన అన్నారు.  రాష్ట్రంలో మరో 20 పోర్టుల నిర్మాణం జరగనుందని, ఇవి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్‌గా మారుస్తాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో నదులు మరియు కాలువలు పుష్కలంగా ఉన్నందున, డ్రై పోర్టుల నిర్మాణానికి అవకాశం ఉందని ఆయన అన్నారు. 
 
కూటమి 15 ఏళ్లు స్థిరంగా ఉండాలి: పవన్ కల్యాణ్ 

కూటమిలో ఉన్న మూడు పార్టీల్లోని నేతలు, కార్యకర్తలకు చిన్నచిన్న పొరపచ్చాలు ఉన్నా.. మీ స్ధాయిలోనే పరిష్కరించుకొని ముందుకెళ్లాలని పవన్ కల్యాణ్ సూచించారు. మన కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారనిని  జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అభివృద్ధిలో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ తిరిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని ఆకాంక్షించారు. కనీసం 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలన్నారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget