![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
RK Roja: 'అదే మేము చేసిన తప్పా?' - రుషికొండ భవనాలపై మాజీ మంత్రి రోజా ప్రశ్నల వర్షం, టీడీపీ, వైసీపీ మధ్య ట్విట్టర్ వార్
Rushikonda Buildings: రుషికొండలో అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలపై తీవ్ర దుమారం రేగుతోంది. తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా స్పందించగా దీనికి టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
![RK Roja: 'అదే మేము చేసిన తప్పా?' - రుషికొండ భవనాలపై మాజీ మంత్రి రోజా ప్రశ్నల వర్షం, టీడీపీ, వైసీపీ మధ్య ట్విట్టర్ వార్ ex minister roja sensational tweet on rushikonda buildings and tdp ysrcp twitter war RK Roja: 'అదే మేము చేసిన తప్పా?' - రుషికొండ భవనాలపై మాజీ మంత్రి రోజా ప్రశ్నల వర్షం, టీడీపీ, వైసీపీ మధ్య ట్విట్టర్ వార్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/afb3efa10b8e67e6a1c4efd183f3f23b1718774042139876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rk Roja Comments On Rushikonda Buildings: వైసీపీ హయాంలో రుషికొండలో నిర్మించిన భవనాలపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ అంశంపై ఇప్పటికే అధికార టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రభుత్వ సొమ్ముతో రుషికొండపై (Rushikonda) విలాసవంతమైన భవనాలు నిర్మించారంటూ టీడీపీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తోంది. వైసీపీ నేతలు సైతం దీనికి కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) ఈ అంశంపై స్పందించారు. రుషికొండలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా.? అని ఆమె ప్రశ్నించారు. 'విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా..? వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా..? 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా..? 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం... ఇందులో అక్రమం ఎక్కడుంది..? విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా..? ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా...?' అని నిలదీశారు.
రుషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా..?
— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2024
విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా..?
వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో…
'అది వాస్తవం కాదా.?'
'ఏడు బ్లాకుల్లో ఏమేమి నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా...? హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా..? ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..? హైదరాబాద్లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా... ఈ రోజు విమర్శలు చేసేది..? లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్లలో రూ.40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది..?' అని రోజా ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ అధినేత మా జగనన్నపై, మాపై ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెన్ను చూపేది లేదు... వెనకడుగు వేసేది లేదు' అని స్పష్టం చేశారు.
టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్
అయితే, ఈ ట్వీట్పై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి ట్విట్టర్ వేదికగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు అన్నట్లుంది మీ యవ్వారం... ముందు ఆ ప్యాలెస్కు.. మీ బెంజ్ కారుకు ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టండి మాజీ మంత్రి గారు..' అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు అన్నట్లుంది మీ యవ్వారం... ముందు ఆ ప్యాలెస్ కు..మీ బెంజ్ కారుకు ఉన్న సంబంధం ఎంటో బయట పెట్టండి మాజీ మంత్రి గారు.. https://t.co/4rFmdDq5K7
— Gali Bhanu Prakash (@GaliBhanuTDP) June 19, 2024
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)