అన్వేషించండి

Andhra Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో ఈడీ సైలెంట్ ఆపరేషన్ - డిస్టిలరీల యజమానులకు నోటీసులు - కీలక మలుపు ఖాయమా?

ED Investigation: ఆంధ్రా లిక్కర్ కేసులో ఈడీ కూడా దూకుడుగా విచారణ జరుపుతోంది. డిస్టిలరీల యజమానులకు నోటీసులు జారీ చేస్తోంది. సీఐడీ సిట్ చార్జిషీటు ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లుగా తెలుస్తోంది.

ED investigation in Andhra liquor Scam Case:  ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సీఐడీ సిట్ అధికారులు ఇప్పటికే ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేశారు. ఈ స్కామ్ మొత్తానికి సూత్రధారిగా జగన్‌ను గుర్తించారని అరెస్టు చేయవచ్చన్న ప్రచారం కూడా ఊపందుకుంటోంది. ఇలాంటి సమయంలో  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకిదిగింది.  
 
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతుండగానే, కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసులు పెట్టింది.  అక్రమ నగదు చెలామణి కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ స్కామ్ మొత్తం నగదు లావాదేవీలు నిండి ఉన్నాయని సిట్ గుర్తించింది. సీఐడీ నమోదుచేసిన కేసు ఆధారంగానేమే నెలలోనే ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది.

మద్యం సరఫరాదారుల నుంచి కమీషన్ల రూపంలో భారీగా ముడుపులు వసూలు చేసి, ఆ డబ్బును హవాలా మార్గాల్లో తరలించారని సిట్ తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. ఈడీ విచారణకు సిఫారసు చేస్తున్నట్లుగా అసెంబ్లీలోనే చంద్రబాబు ప్రకటించారు. సిట్ అధారాలను బేస్ చేసుకుని ఈడీ కూడా నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది.  వైసీపీ హయాంలో భారీగా మద్యం ఆర్డర్లు పొంది, కమిషన్లు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్న డిస్టిలరీల యజమానులకు నోటీసులు జారీ చేస్తోంది.  శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రానున్న రోజుల్లో మరికొంత మంది మద్యం వ్యాపారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్న వ్యక్తులను ఈడీ విచారించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. 

ఈ కేసులో ఇప్పటికే  ఎంపీ పి.వి. మిథున్ రెడ్డితో సహా 12 మందిని సిట్ అరెస్టు చేసింది. నిందితులు మద్యం సిండికేట్‌గా ఏర్పడి, ఆర్డర్లు ఇచ్చే విధానాన్ని అనుకూలంగా మార్చుకుని, భారీగా కమీషన్లు దండుకున్నారని సిట్ తన చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ అక్రమ ధనాన్ని ఎన్నికల ఖర్చులకు, ఇతర పెట్టుబడులకు మళ్లించినట్లు చెబుతోంది. సిట్ దర్యాప్తుతో పాటు ఇప్పుడు ఈడీ విచారణ కూడా మొదలుకావడంతో, ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది తేలనుందని భావిస్తున్నారు.  

లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించుకున్న దొంగ డబ్బు లో హెచ్చు భాగం హవాలా విదేశాలకు తరలిపోయిందని సిట్ సేకరించిన వివరాలు  ఈడీకి అందించింది. నిందితులు విదేశాల్లో కూడా లాజిస్టిక్స్ పేరుతో కంపెనీలు పెట్టి బ్లాక్ ను వైట్ చేశారని .. ఇండియాకు తరలించారని గుర్తించారు. అలాగే  2024 ఎన్నికల్లో దాదాపు 300 కోట్లు వైసిపి అభ్యర్థులకు ఇచ్చారన్న సమాచారం కూడా సిట్ ఈడీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  నోట్ల కట్టల డెన్ లను గుర్తించారు. అక్కడ తీసిన వీడియోలు సాక్ష్యాలను కూడా ఈడీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అరెస్టులు ప్రారంభిస్తే.. లిక్కర్ కేసులో కొత్త  సంచలనాలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి.  రాజకీయంగానూ కలకలం రేపే  అవకాశాలు ఉంటాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Embed widget