అన్వేషించండి

East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్

East Godavari News : రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్మక్కు అయి ధాన్యం స్కామ్ చేస్తున్నారని వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. తన దగ్గర ఆధారాలున్నాయని, వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

East Godavari News : ధాన్యం కొనుగోలులో పెద్ద స్కామ్ జరుగుతోంది. ఈ మాటలు స్వయానా అధికార పార్టీ ఎంపీ ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో రబీ కోతలు పూర్తి అయి ధాన్యం సేకరణ ప్రారంభమయింది. అయితే ఈ రబీ ధాన్యం కొనుగోలులో పెద్ద స్కామ్ జరుగుతోందని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో బుధవారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా డీఆర్‌సీ, నీటి సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన ఎంపీ సుభాష్ చంద్రబోస్ సంచలన ఆరోపణలు చేశారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు రైస్ మిల్లర్లు నిలువుదోపిడీ చేస్తున్నారన్నారు. ఈ కుంభకోణం వెనుక రైస్ మిల్లర్లు, కొందరు అధికారులు ఉన్నారన్నారు. రైతుల దగ్గర దళారులతో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయించి, తర్వాత మిల్లరు ఓ  జాబితా తెచ్చి అధికారులకు ఇచ్చి అవే పేర్లతో ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతాలు జతచేయిస్తున్నారన్నారు. ఉదాహరణకు ఒక రైతుకు నాలుగు ఎకరాలు ఉంటే 2 ఎకరాలు రైతు పేర చూపించి, మిగతా రెండు ఎకరాలు వేరే మండలాల్లోని వ్యక్తుల పేర్లతో నమోదు చేసి ఒక్కో బస్తాకు కనీసం రూ.200 దోచేస్తున్నారని ఎంపీ ఆరోపించారు.

17 వేల మంది వివరాలు లేవు 

ఈ దోపిడీపై తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఎంపీ సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్తనన్నారు. సీబీసీఐడీతో విచారణ చేయిస్తే ఈ ధాన్యం స్కామ్ బయటపడుతుందన్నారు. కోనసీమ జిల్లాకు సంబంధించి కొన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఎంపీ అన్నారు. కాకినాడ జిల్లాలో కూడా ఈ తరహా మోసాలు జరుగుతున్నాయన్నారు. ఆ ఆధారాలు కూడా సేకరిస్తున్నానని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ మోసాలపై ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా అని ఎంపీ అధికారులను ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి మధుసూదన్‌ స్పందిస్తూ ఈ క్రాప్‌ ద్వారా నమోదైన రైతుల పేర్లతో రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 17 వేల మంది వివరాలు లభించడంలేదన్నారు. వెంటనే ఎంపీ సుభాష్ చంద్రబోస్ జోక్యం చేసుకుని ఆ పేర్లు ఏమైనట్లు అని ప్రశ్నించారు. వీటిని రైస్ మిల్లర్లు తప్పుడు పేర్లతో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఓ జాబితా అధికారులకు ఇస్తారన్నారు. 

East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్

(ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ) 

ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు : జేసీ శ్రీధర్ 

ఈ ధాన్యం కుంభకోణం బయటపడాలంటే ప్రతి గ్రామంలో ఎవరు ఎంత ధాన్యం విక్రయించారో చాటింపు వేసి ఆరా తీయాలని ఎంపీ అన్నారు. ఎంపీ ఆరోపణలపై స్పందించిన జేసీ సీహెచ్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు. ఆర్బీకేల ద్వారా ఎలా అమ్ముకోవాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎంపీ బోసు వాదనను టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు సమర్థించారు. ఈ సమావేశంలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మె్ల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

RK Roja: మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
Embed widget