అన్వేషించండి

East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్

East Godavari News : రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్మక్కు అయి ధాన్యం స్కామ్ చేస్తున్నారని వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. తన దగ్గర ఆధారాలున్నాయని, వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

East Godavari News : ధాన్యం కొనుగోలులో పెద్ద స్కామ్ జరుగుతోంది. ఈ మాటలు స్వయానా అధికార పార్టీ ఎంపీ ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో రబీ కోతలు పూర్తి అయి ధాన్యం సేకరణ ప్రారంభమయింది. అయితే ఈ రబీ ధాన్యం కొనుగోలులో పెద్ద స్కామ్ జరుగుతోందని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో బుధవారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా డీఆర్‌సీ, నీటి సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన ఎంపీ సుభాష్ చంద్రబోస్ సంచలన ఆరోపణలు చేశారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు రైస్ మిల్లర్లు నిలువుదోపిడీ చేస్తున్నారన్నారు. ఈ కుంభకోణం వెనుక రైస్ మిల్లర్లు, కొందరు అధికారులు ఉన్నారన్నారు. రైతుల దగ్గర దళారులతో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయించి, తర్వాత మిల్లరు ఓ  జాబితా తెచ్చి అధికారులకు ఇచ్చి అవే పేర్లతో ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతాలు జతచేయిస్తున్నారన్నారు. ఉదాహరణకు ఒక రైతుకు నాలుగు ఎకరాలు ఉంటే 2 ఎకరాలు రైతు పేర చూపించి, మిగతా రెండు ఎకరాలు వేరే మండలాల్లోని వ్యక్తుల పేర్లతో నమోదు చేసి ఒక్కో బస్తాకు కనీసం రూ.200 దోచేస్తున్నారని ఎంపీ ఆరోపించారు.

17 వేల మంది వివరాలు లేవు 

ఈ దోపిడీపై తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఎంపీ సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్తనన్నారు. సీబీసీఐడీతో విచారణ చేయిస్తే ఈ ధాన్యం స్కామ్ బయటపడుతుందన్నారు. కోనసీమ జిల్లాకు సంబంధించి కొన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఎంపీ అన్నారు. కాకినాడ జిల్లాలో కూడా ఈ తరహా మోసాలు జరుగుతున్నాయన్నారు. ఆ ఆధారాలు కూడా సేకరిస్తున్నానని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ మోసాలపై ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా అని ఎంపీ అధికారులను ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి మధుసూదన్‌ స్పందిస్తూ ఈ క్రాప్‌ ద్వారా నమోదైన రైతుల పేర్లతో రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 17 వేల మంది వివరాలు లభించడంలేదన్నారు. వెంటనే ఎంపీ సుభాష్ చంద్రబోస్ జోక్యం చేసుకుని ఆ పేర్లు ఏమైనట్లు అని ప్రశ్నించారు. వీటిని రైస్ మిల్లర్లు తప్పుడు పేర్లతో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఓ జాబితా అధికారులకు ఇస్తారన్నారు. 

East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్

(ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ) 

ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు : జేసీ శ్రీధర్ 

ఈ ధాన్యం కుంభకోణం బయటపడాలంటే ప్రతి గ్రామంలో ఎవరు ఎంత ధాన్యం విక్రయించారో చాటింపు వేసి ఆరా తీయాలని ఎంపీ అన్నారు. ఎంపీ ఆరోపణలపై స్పందించిన జేసీ సీహెచ్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు. ఆర్బీకేల ద్వారా ఎలా అమ్ముకోవాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎంపీ బోసు వాదనను టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు సమర్థించారు. ఈ సమావేశంలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మె్ల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే ఎక్కువ, ఆయన ఓ తాలిబన్: కవిత తీవ్ర వ్యాఖ్యలు 
సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే ఎక్కువ, ఆయన ఓ తాలిబన్: కవిత తీవ్ర వ్యాఖ్యలు 
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
IND vs AFG Test Highlights: భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rajinikanth Annamalai New Party TN: అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
RERA Rules: ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Carpal Tunnel Syndrome : యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Embed widget