అన్వేషించండి

East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్

East Godavari News : రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్మక్కు అయి ధాన్యం స్కామ్ చేస్తున్నారని వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. తన దగ్గర ఆధారాలున్నాయని, వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

East Godavari News : ధాన్యం కొనుగోలులో పెద్ద స్కామ్ జరుగుతోంది. ఈ మాటలు స్వయానా అధికార పార్టీ ఎంపీ ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో రబీ కోతలు పూర్తి అయి ధాన్యం సేకరణ ప్రారంభమయింది. అయితే ఈ రబీ ధాన్యం కొనుగోలులో పెద్ద స్కామ్ జరుగుతోందని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో బుధవారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా డీఆర్‌సీ, నీటి సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన ఎంపీ సుభాష్ చంద్రబోస్ సంచలన ఆరోపణలు చేశారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు రైస్ మిల్లర్లు నిలువుదోపిడీ చేస్తున్నారన్నారు. ఈ కుంభకోణం వెనుక రైస్ మిల్లర్లు, కొందరు అధికారులు ఉన్నారన్నారు. రైతుల దగ్గర దళారులతో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయించి, తర్వాత మిల్లరు ఓ  జాబితా తెచ్చి అధికారులకు ఇచ్చి అవే పేర్లతో ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతాలు జతచేయిస్తున్నారన్నారు. ఉదాహరణకు ఒక రైతుకు నాలుగు ఎకరాలు ఉంటే 2 ఎకరాలు రైతు పేర చూపించి, మిగతా రెండు ఎకరాలు వేరే మండలాల్లోని వ్యక్తుల పేర్లతో నమోదు చేసి ఒక్కో బస్తాకు కనీసం రూ.200 దోచేస్తున్నారని ఎంపీ ఆరోపించారు.

17 వేల మంది వివరాలు లేవు 

ఈ దోపిడీపై తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఎంపీ సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్తనన్నారు. సీబీసీఐడీతో విచారణ చేయిస్తే ఈ ధాన్యం స్కామ్ బయటపడుతుందన్నారు. కోనసీమ జిల్లాకు సంబంధించి కొన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఎంపీ అన్నారు. కాకినాడ జిల్లాలో కూడా ఈ తరహా మోసాలు జరుగుతున్నాయన్నారు. ఆ ఆధారాలు కూడా సేకరిస్తున్నానని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ మోసాలపై ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా అని ఎంపీ అధికారులను ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి మధుసూదన్‌ స్పందిస్తూ ఈ క్రాప్‌ ద్వారా నమోదైన రైతుల పేర్లతో రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 17 వేల మంది వివరాలు లభించడంలేదన్నారు. వెంటనే ఎంపీ సుభాష్ చంద్రబోస్ జోక్యం చేసుకుని ఆ పేర్లు ఏమైనట్లు అని ప్రశ్నించారు. వీటిని రైస్ మిల్లర్లు తప్పుడు పేర్లతో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఓ జాబితా అధికారులకు ఇస్తారన్నారు. 

East Godavari News :  ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్

(ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ) 

ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు : జేసీ శ్రీధర్ 

ఈ ధాన్యం కుంభకోణం బయటపడాలంటే ప్రతి గ్రామంలో ఎవరు ఎంత ధాన్యం విక్రయించారో చాటింపు వేసి ఆరా తీయాలని ఎంపీ అన్నారు. ఎంపీ ఆరోపణలపై స్పందించిన జేసీ సీహెచ్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు. ఆర్బీకేల ద్వారా ఎలా అమ్ముకోవాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎంపీ బోసు వాదనను టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు సమర్థించారు. ఈ సమావేశంలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మె్ల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BIG Shocks to BRS | బీఆర్ఎస్ నుంచి వలసలు ఆపడం కష్టమేనా..!? | ABP DesamDanam Nagender Face to Face | కొత్త నాయకత్వంకాదు..ముందు కేటీఆర్ మారాలంటున్న దానం | ABP DesamMadhavi Latha Sensational Interview | లక్ష ఓట్ల తేడాతో ఒవైసీని ఓడిస్తానంటున్న మాధవీలత | ABP DesamParipoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Embed widget