అన్వేషించండి

Godavari Floods : ఆరు జిల్లాల్లో 628 గ్రామాలపై వరద ప్రభావం, ధవళేశ్వరం వద్ద 25 లక్షల క్యూసెక్కుల వరద!

Godavari Floods : ఆరు జిల్లాల్లోని 44 మండలాల్లో 628 గ్రామాలపై గోదావరి వరద ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

Godavari Floods : రాజమహేంద్రవరం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీకి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో  21.32  లక్షల క్యూసెక్కులు ఉంది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర వరద ఉద్ధృతిని పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.  రేపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 25 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 6 జిల్లాల్లోని 44 మండలాల్లో  628 గ్రామాలపై గోదావరి వరద ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచిస్తోంది. 

62,337 మంది పునరావాస శిబిరాలకు తరలింపు 

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 21 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 9 మండలాలపై వరద ప్రభావం చూపే  అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరిలో 4 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఏలూరు జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు. అధికారులకు ఎప్పటికప్పుడు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలు ఇస్తుంది. వరద ఉద్ధృతం దృష్ట్యా అదనపు సహాయక బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. సహాయక చర్యల్లో మొత్తం  10 ఎన్డీఆర్ఎఫ్,  10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు ఆరు జిల్లాల్లోని  44 మండలాల్లో  279 గ్రామాలు వరద ప్రభావితం చెందాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 177 గ్రామాల్లో వరద ప్రవాహం  ఉండనుంది. ఇప్పటి వరకూ 62,337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరితో పాటు, వివిధ ప్రాజెక్టుల్లో  కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోందని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  

మరో 24 గంటలు కీలకం 

లంక గ్రామాలు, క‌ర‌క‌ట్టలు ప‌టిష్టంగా ఉండేలా చ‌ర్యలు తీసుకోవాని సీఎం జ‌గ‌న్ అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చార‌ు. వ‌ర‌ద బాధితుల‌ను సహాయక శిబిరాలకు త‌ర‌లించాలని, మ‌ర‌ణాలు సంభ‌వించ‌కుండా అధికారులు, సిబ్బంది, మాన‌వ‌త్వంతో వ్యవ‌హ‌రించాలని సీఎం సూచించారు. అంతే కాదు 5గురు ప్రత్యేక అధికారులను కూడా వ‌ర‌ద‌ల స‌మీక్షకు ఏర్పాటు చేశామన్నారు.  మ‌రో 24 గంట‌లు చాలా కీల‌కమని, అల‌ర్ట్ గా ఉండాల‌ని సీఎం అన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
New Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట- 18 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట- 18 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
New Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట- 18 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట- 18 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
Pawan Kalyan: 'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Singer Mangli: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
Bird Flu Latest News:ఆదివారానికి బర్డ్‌ఫ్లూ ఫీవర్‌- ఇంతకీ చికిన్ తినాలా? వద్దా?
ఆదివారానికి బర్డ్‌ఫ్లూ ఫీవర్‌- ఇంతకీ చికిన్ తినాలా? వద్దా?
Big Blow For RCB: ఆర్సీబీ నుంచి కీలక ప్లేయర్ ఔట్.. గతేడాది కప్పు కొట్టడంలో కీ రోల్ పొషించిన స్పిన్నర్
ఆర్సీబీ నుంచి కీలక ప్లేయర్ ఔట్.. గతేడాది కప్పు కొట్టడంలో కీ రోల్ పొషించిన వైనం
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.