అన్వేషించండి

AP BJP Leaders : పీఎం ఆవాస్ యోజన ఇళ్లకు వైసీపీ రంగులు వద్దు, కేంద్రమంత్రికి బీజేపీ నేతల ఫిర్యాదు

AP BJP Leaders : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు.

AP BJP Leaders : దిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ నేతలు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.. ఆదివారం  కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న పొరపాట్లు, అలసత్వంపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కేంద్రమంత్రికి వినతిపత్రం అందించారు. త్వరలో ఏపీలో పర్యటించాలని కోరగా హర్దీప్ సింగ్ పూరి వస్తానని హామీ ఇచ్చారు.  

20 లక్షల ఇళ్లు మంజూరు
 
 వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 10 లక్షల ఇళ్ల కేటాయించారని సోము వీర్రాజు తెలిపారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో ఏపీ ప్రభుత్వానికి 10 లక్షల ఇళ్లను కేటాయించారన్నారు. కేంద్రం కేటాయించిన ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని, ఇళ్లు నిర్మాణ స్థితికి రావడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి తన రాయితీని మంజూరు చేసిందన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 30 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరిని కోరారు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం మరో 20 లక్షలు ఇళ్లను ప్రధాన మంత్రి ఆవాస్ యోజక కింద మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈ 20 లక్షల ఇళ్లలో కేవలం 6 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 30 వేల ఇళ్లు లబ్దిదారులకు అందజేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 

ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇది ప్రత్యక్ష నిదర్శమని సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఒకసారి ఏపీలో పర్యటించి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాలని కేంద్రమంత్రిని కోరారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీచేయాలని కోరారు. పేదలకు లబ్దిచేకూరాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ తీసుకొచ్చిన ఈ పథకాన్ని సక్రమంగా అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.  

వైసీపీ రంగులు వద్దు

"దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా ఏపీకి ఎక్కువగా ఇళ్లు కేటాయిస్తే రాష్ట్రంలో ఎందుకు నత్తనడకన నడుస్తుంది?. ఈ విషయంపై కేంద్రమంత్రి వెంటనే సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశాము. ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి వ్యక్తిగతంగా పరిశీలన చేయాలని కోరాము. కేంద్ర సహకారంతో నిర్మాణం జరుగుతున్న ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే బోర్డు లేదు. వైసీపీ రంగులు వేస్తున్నారు, వైసీపీ ఇళ్లుగా మార్చడం సిగ్గుచేటు. కేంద్రం గైడ్లైన్స్ లో లేని విషయాలను అమలు చేస్తున్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలపై ప్రస్తుత పరిస్థితి ఎంటి, వాస్తవాలు తెలుసుకోవాలని కోరాం. జగనన్న కాలనీ మోదీ అన్న ఇల్లు అని పేరు పెట్టాలని కోరాము. వైసీపీ కలర్ వాడొద్దు ఫిర్యాదు చేశాం. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లు సైతం ఇప్పటికీ ప్రజలకు ఇవ్వలేదు. వాస్తవాలు తెలుసుకోవాలని పేదలకు న్యాయం చేయాలని కోరాము." - విష్ణువర్ధన్ రెడ్డి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
Embed widget