అన్వేషించండి

Viveka Murder Case: సాక్షుల వరుస మరణాలు - తనకు సెక్యూరిటీ పెంచాలని ఎస్పీని కోరిన దస్తగిరి

వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కడప ఎస్పీ అశోక్ కుమార్ ను కలిశారు. తనకు భద్రత పెంచాలని, ప్రాణాలకు ముప్పు ఉందని ఎస్పీని కోరారు.

Viveka Murder Case | కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనకు భద్రత పెంచాలని ఎస్పీని కోరారు. కడప ఎస్పీ ఆఫీసుకు వెళ్లిన దస్తగరి.. వివేకా హత్య కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్నారని తనకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని భావిస్తున్నట్లు దస్తగరి చెప్పారు. వివేకా హత్య కేసుకు సంబంధించి ముఖ్యమైన సాక్షి వాచ్‌మెన్ రంగన్న ఇటీవల చనిపోయారు. ఆయన మృతిపై భార్య అనుమానం వ్యక్తం చేయగా, దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు.

వాచ్‌మెన్‌ రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం
వివేకా కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగన్న ఇటీవల చనిపోయారు. కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయగా.. పులివెందుల భాకరాపురం శ్మశాన వాటికలో రంగన్న మృతదేహానికి మార్చి 8న రీపోస్టుమార్టం నిర్వహించారు. మంగళగిరి, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఆయన మృతదేహంపై ఏమైనా గాయాలున్నాయా, అనుమానస్పద గుర్తులు ఉన్నాయా అని పరిశీలించారు. 

సాక్షుల వరుస మరణాలు
వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న గంగాధర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అభిషేక్‌రెడ్డి, డ్రైవర్‌ నారాయణ యాదవ్‌, వాచ్‌మన్‌ రంగన్న మరణించారు. అయితే వీరివి అనుమానాస్పద మరణాలు అని, వీరి మృతి వెనుక కేసుతో ప్రమేయం ఉన్న వారి హస్తం ఏమైనా ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షుల వరుస మరణాలపై విచారణ చేపట్టామని కడప ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు. రంగన్న మృతి తరువాత వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలపై సిట్ ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, 10 మంది కానిస్టేబుళ్లు ఈ సిట్ బృందంలో ఉంటారు. సాక్షులు కోరితే వారికి భద్రత కల్పిస్తామని ఇటీవల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. దాంతో తనకు భద్రత పెంచాలని, తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని దస్తగిరి ఎస్పీ ఆఫీసుకు వెళ్లి కోరారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
Pawan Kalyan Kotappakonda Visit: కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
Embed widget