అన్వేషించండి

Jagan Bail Cancellation Petition: ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దుపై ముగిసిన వాదనలు.. ఆగస్టు 25న తుది తీర్పు వెల్లడి

ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ మలుపులు తిరుగుతుంది. బెయిల్ రద్దు చేయాలని వైసీసీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఆగస్టు 25న కోర్టు తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. సీఎం వైఎస్ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌లో లిఖిత పూర్వక వాదనలకు సీబీఐ నేడు మరోసారి సమయం కోరింది.

సీబీఐ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరికొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే దీనిని ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది వెంకటేశ్‌ వ్యతిరేకించారు. గడువు ఇవ్వొద్దని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ రోజే సీబీఐ ఏదో ఒకటి చెప్పాలని, అందుకు కొంత సమయం ఇస్తామని విచారణను కోర్టు కాసేపు వాయిదా వేసింది. అనంతరం వాదన ప్రారంభం కాగా, తాము ఈ కేసులో ఎలాంటి వాదనలు వినిపించడం లేదని, విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో విచారణ ముగిసిందని తెలిపింది. ఈ కేసులో ఆగస్టు 25న తుది తీర్పు వెలువడే అవకాశం  ఉంది.  

గతంలో సీఎం జగన్, పిటిషనర్ తరపు న్యాయవాదులు రిజాయిండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టుకు విచక్షణ అధికారానికే వదిలేస్తున్నామని తెలిపారు. బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని రిజాయిండర్లో పేర్కొన్నారు.  అదే విషయాన్ని ఆన్ రికార్డుల్లోకి తీసుకోవాలని నేటి విచారణలో సీబీఐ తరఫు న్యాయవాదలు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును ఆగస్టు 25న వెల్లడిస్తామని తెలిపింది. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోసం రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తమ అభిప్రాయం చెప్పకుండా కోర్టు నిర్ణయానికే వదిలేసింది. దీంతో సీబీఐ కోర్టు తీసుకునే నిర్ణయం ఇప్పుడు  కీలకంగా మారింది. సాధారణంగా అయితే దర్యాప్తు సంస్ధల అభిప్రాయం మేరకు ట్రయల్ కోర్టులు తీర్పులు వెలువరిస్తుంటాయి. కానీ ఇక్కడ సీబీఐ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్న అంశంపై తమ అభిప్రాయం చెప్పకపోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సీబీఐ కోర్టు పరిధిలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు సీబీఐ కోర్టు తమ విచక్షణ మేరకు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. 

వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్ పై గతంలోనే ఏపీ సీఎం స్వయంగా, సీబీఐ మోమో, రఘురామ రిజాయిండర్ సైతం దాఖలు చేశారు. కానీ దర్యాప్తు సంస్థ అభిప్రాయం చెప్పాలంటూ కోర్టు మరోసారి కోరినా సీబీఐ తమ పాత వాదనకే కట్టుబడటంతో... ఇప్పుడు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు ముగియడంతో తీర్పు కోసం సీబీఐ కోర్టు విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఇప్పటికే పిటిషనర్ తో పాటు ప్రతివాదుల వాదనలు కూడా నమోదు చేసిన కోర్టు బెయిల్ రద్దుపై తీర్పు వెలువరించే అవకాశముంది.

Also Read: Guntur Electric Shock: గుంటూరు జిల్లాలో ఘోరప్రమాదం.. విద్యుదాఘాతానికి గురై ఆరుగురు మృతి... అందరూ ఒడిశా వాసులే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన

వీడియోలు

MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
The Raja Saab Reaction : ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Balakrishna : ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
Bangladesh: భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
Embed widget