అన్వేషించండి

Srikakulam Nartu Ramarao : శ్రీకాకుళంలో సామాజిక సమీకరణాలతో నర్తు రామారావుకు చాన్స్ - సీనియర్ నేతకు గుర్తింపు !

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత నర్తు రామారావుకు సీఎం జగన్ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు.

 

Srikakulam Nartu Ramarao :   స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి వైఎస్ఆర్‌సీపీ  తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్‌కు  తెరపడింది.  పార్టీ ఆవిర్భావం తర్వాత ఇచ్ఛా పురం నియోజకవర్గంలో వైకాపాలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న నర్తు రామా రావు పేరును వైకాపా తరఫున స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా అధిష్టానం ప్రకటించింది.  యాదవ, తూర్పుకాపు, రెడ్డిక సామాజిక వర్గాల్లో ఒక దానికి ఎమ్మెల్సీ కేటాయిస్తారని ముందునుంచే ప్రచారం జరిగింది. ఓ దశలో శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎం. వి. పద్మావతి పేరు బలంగా వినిపించింది. ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఎవరికివారు అధిష్టానం స్థాయిలో లాబీయింగ్ చేశారు. తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, పాలిన శ్రీనివాస్ కూడా తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఉత్తరాంధ్ర సమన్వయకర్త బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను కోరారు. 

2019 ఎన్నికలకు ముందు వరకు ఇచ్ఛాపురం వైకాపా సమన్వయకర్తగా ఉన్న రామా రావును ఎలక్షన్ దగ్గరలో తప్పించారు. ఆ సీటును సాయిరాజుకు కట్టబెట్టారు. వైకాపా అధి కారంలోకి వస్తే మండలికి పంపిస్తామని అప్పుడే రామారావుకు జగన్ నుంచి స్పష్టమైన హామీ లభించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక జిల్లా నుంచి పాలవలస విక్రాంత్, దువ్వాడ శ్రీనివా స్లను మండలికి పంపించారు. స్థానిక సంస్థల కోటాలో యాదవులకు అవకాశం ఇవ్వాలని భావించిన జగన్ గతంలో రామారావుకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. స్థానిక సంస్థల్లో వైకాపాకు తిరుగులేని ఆధిక్యం ఉంది. దీంతో రామారావు ఎన్నిక లాంఛనమే.
 
నర్తు రామారావుకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది.  పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీచేసినా ఓడిపోయారు.  1990ల నుంచి రామారావు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు.   ధర్మాన సోదరులకు రామారావు అత్యంత సన్నిహితుడు. 2004లో కాంగ్రెస్ పార్టీకి వై.ఎస్. పాదయాత్ర వల్ల ఓ వేవ్ వచ్చింది. ఆ ఎన్నికల్లో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే టిక్కెట్ రామారావుకు దాదాపు ఖరారైంది. అయితే చివరి నిమిషంలో లల్లూను టిక్కెట్ వరించడంతో అతడి గెలుపుకోసం రామారావు పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి 2004లో ఇచ్ఛాపురంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. 2009లో రామారావుకు టిక్కెట్ వచ్చినా ఓడిపోయారు. 2014లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వైకాపా నుంచి రామారావు పోటీ చేసినా విజయం ఆయనను వరించలేదు. 2019 ఎన్నికలకు ముందు రామారావును తప్పించి మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్  బరిలోకి దిగినా పాత ఫలితాలే పునరావృతమయ్యాయి.  

జిల్లాలో యాదవుల సంఖ్య గణనీయంగా ఉంది. రెండు, మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో యాదవులు ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం యాదవులకు జిల్లా నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం కల్పించలేదు. నర్తు రామారావు రెండు సార్లు అసెంబ్లీకి పోటీచేసినా ఆయనను విజయం వరించలేదు.   జిల్లా నుంచి తొలిసారి యాదవ సామాజికవర్గ వ్యక్తిని మండలికి పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదే సామాజికవర్గానికి చెందిన పాలిన శ్రావణికి ఇప్పటికే జడ్పీ వైస్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టారు.   వైకాపా అధికారంలోకి వస్తే కళింగకోమట్లకు ఎమ్మెల్సీ ఇస్తానని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల కోటాలో తమకు అవకాశం లభిస్తుందని కళింగకోమట్లు భావించారు. అయితే వారికి నిరాశే ఎదురైంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget