అన్వేషించండి

CM Chandrababu: 'రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక' - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Andhra News: 10 పాయింట్ల ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధిలో ముందుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు.

CM Chandrababu Key Decision: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) విశాఖ పర్యటనలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక తెస్తున్నామని అన్నారు. 10 పాయింట్ల ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెట్రో రైల్, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో శనివారం సీఎం సమీక్ష నిర్వహించారు. జీరో పావర్టీ దిశగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. 'ఉద్యోగాల సృష్టి, కల్పన, నైపుణ్యాల పెరుగుదల, రైతు సాధికారత, ఆదాయం పెంపులో నెంబర్ వన్ కావాలి. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధిలో దూసుకెళ్లాలి. స్వచ్ఛ ఏపీ దిశగా వేగంగా అడుగులు వేయాలి. అన్ని రకాల సాంకేతికత, పరిశోధనలో మనమే నెంబర్ వన్ కావాలి. పీ 4 విధానంలో సంపద సృష్టిద్దాం.' అని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం డబ్బు కంటే మంచి ఆలోచనే ముఖ్యమని అన్నారు.

'రుషికొండ భవనాలపై..'

అంతకు ముందు వైసీపీ హయాంలో రుషికొండలో నిర్మించిన భవనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజా ధనంతో తన స్వార్ధం కోసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్మించిన విలాసవంతమైన భవనాలపై ప్రజాకోర్టులో చర్చ జరగాలని తెలిపారు. 'ప్రజాస్వామ్యoలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయా.? అని ఆశ్చర్యం కలుగుతుంది. గుండె చెదిరిపోయే నిజాలు ఇక్కడ కనిపించాయి. ఇలాంటి నేరాలు చెయ్యడానికి చాలా గుండె ధైర్యం కావాలి. చాలా దేశాలు తిరిగాను కానీ పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ప్యాలెస్ కట్టడం ఎక్కడా చూడలేదు. నిజాం ప్యాలెస్ పలక్నుమా ప్యాలెస్ చూశా. ఈ ప్యాలెస్ చూస్తే ఆశ్చర్యం, ఉద్వేగం కలిగింది. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ కోసం రూ.400 కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ రూ.430 కోట్లతో ఈ ప్యాలెస్ కట్టారు. 7 బ్లాక్‌ల్లో 13,548 చ.మీటర్లలో కట్టడమే కాకుండా చుట్టూ ఉన్న 18 ఎకరాలను జపాన్ టెక్నాలజీతో కొండ చుట్టూ ప్రొటెక్షన్ కట్టించారు. పీఎం, ప్రెసిడెంట్ విడిది కోసం కడుతున్నామని అన్నారు. వారు నావెల్ గెస్ట్ హౌస్‌లొనే ఉన్నారు. వారు ఇలాంటి ప్యాలెస్‌లను కట్టమని అడగలేదు కదా.' అని పేర్కొన్నారు. 

ప్యాలెస్‌లో బాత్ టబ్‌కు రూ.36 లక్షలు, కమోడ్‌కు రూ.12 లక్షలు, 9.88 ఎకరాల్లో 7 బ్లాక్‌లతో విలాసవంతమైన ప్యాలెస్ పర్యావరణానికి విధ్వంసం చేసి నిర్మించడాన్ని ఏ ఒక్కరూ హర్షించరని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాలెస్ సమూహం దేనికి ఉపయోగపడుతుందో తెలియడం లేదన్నారు. 'దేశంలో అత్యంత అరుదైన ప్రదేశం.. దేనికీ పనికి రాకుండా భవంతులు కట్టేశారు. ఈ ప్రాంత సరిహద్దుల్లోకి ఎవరినీ రాకుండా కట్టడి చేసి, ఎన్జీటి, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాలను మభ్యపెట్టి, అధికారులను భయపెట్టి ప్రజల్ని మోసం చేశారు. కళింగ బ్లాక్‌లో 300 మందికి కాన్ఫరెన్స్ హాల్‌ను నిర్మించారు. ప్రజలకు ఈ విషయాలు తెలియాలి.' అని పేర్కొన్నారు. 

Also Read: CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget