అన్వేషించండి

CM Chandrababu: వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే - పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని ఆదేశం

Vijayawada Floods: విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. బుడమేరు, కొల్లేరు డ్రెయిన్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

CM Chandrababu Aerial Survey In Vijayawada: విజయవాడలోని (Vijayawada) వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) శుక్రవారం ఏరియల్ సర్వే (Aerial Survey) చేశారు. వరదలకు మూల కారణమైన బుడమేరు (Budameru) డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వరద ప్రవాహం, ముంపు, గండ్లు పడిన ప్రాంతాలను సర్వే చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. అంతకుముందు నగరంలో కొనసాగుతోన్న వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గగా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. వీటిపై పూర్తి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు, షాపుల్లో బురదను తొలగించాలని.. చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. వరదలకు ఇళ్లల్లో చెడిపోయిన ఎలక్ట్రిక్ వస్తువులను రిపేర్ చేయించేందుకు నిపుణులను పిలిపించాలని సూచించారు. అటు, బుడమేరుకు పడిన గండ్ల పూడ్చివేత పనులను అధికారులు సీఎంకు తెలిపారు.

రంగంలోకి ఆర్మీ

మరోవైపు, బుడమేరు గండ్ల పూడ్చివేతలో భారత ఆర్మీకి చెందిన టాస్క్ ఫోర్స్ విభాగం పనిచేస్తోంది. ఇప్పటికే పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన రెండు గండ్లను పూడ్చివేశారు. ఎన్డీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవులూరు వద్ద గండిని పూడ్చివేత పనులను ఆర్మీ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ వింగ్, రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక పరికరాలతో రంగంలోకి దిగగా.. శుక్రవారం సాయంత్రం వరకూ గండిని పూడ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గండ్ల పూడ్చివేతతో విజయవాడకు వరద ప్రవాహం తగ్గనుంది.

బాధితులకు నిత్యావసరాల కిట్లు

అటు, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసర కిట్లను ప్రభుత్వం అందిస్తోంది. దాదాపు 2 లక్షల కుటుంబాలకు వీటిని అందించేలా చర్యలు చేపట్టింది. మొదటి రోజు 50 వేల కుటుంబాలకు కిట్లు అందించారు. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లి, 2 కిలోల బంగాళదుంపలు, లీటర్ నూనె అందజేస్తున్నారు. ఈ పోస్ మిషన్ ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డు లేని వారికి.. ఆధార్, బయోమెట్రిక్ ద్వారా కిట్ ఇస్తున్నారు.

విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే వరద నుంచి కోలుకుంటోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద తగ్గలేదు. అజిత్ సింగ్ నగర్‌లోని పలు ప్రాంతాల్లోకి గురువారం కంటే శుక్రవారం మరో అడుగు నీరు చేరింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రామకృష్ణాపురం, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతుండగా స్థానికులు బంధువులు ఇళ్లకు వెళ్తున్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. వరద తగ్గిన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం చేశారు. వైద్య శాఖ బాధితులకు మందులు పంపిణీ చేస్తోంది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వరద బాధితులకు తక్కువ ధరకే కూరగాయలు అందిస్తున్నారు.

Also Read: Andra Pradesh Trains: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget