అన్వేషించండి

Water Dispute: కృష్ణా జలాల వివాదం.. పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

జ‌ల వివాదాల‌ను మ‌ధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పిన భారత న్యాయమూర్తి సలహాను పాటించమని ఏపీ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.  కోర్టుల్లోనే వివాదాలను పరిష్కరించుకుంటామని తెలిపింది. 

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ఇంకా నడుస్తూనే ఉంది. కృష్ణా జల వివాదంలో ఏపీ పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై సీజేఐ ఎన్వీ రమణ విచారణ చేపట్టారు. జల వివాదానికి మధ్యవర్తిత్వమే మంచిదని.. సోమవారం నాడు జరిగిన విచారణలో జస్టిస్ రమణ చెప్పారు. అయినా ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. న్యాయపరంగానే సమస్యకు పరిష్కారాన్ని కోరుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

కృష్ణా ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

జస్టిస్ రమణ ఏం చెప్పారంటే...

'కృష్ణా జ‌లాల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం... ద్వారా క‌లిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటే సరిపోతుంది కదా. మీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయం చెప్పండి. మధ్యవర్తిత్వం ద్వారా స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేలా చూడండి. నేను రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వాడిని. రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వానికి అంగీక‌రిస్తేనే మంచిది. అవసరమైతే ఇందుకు సుప్రీంకోర్టు కూడా సహకరిస్తుంది. ఈ విషయంలో అనవసరంగా కోర్టు జోక్యం చేసుకోవాలని భావించడంలేదు.' అని జస్టిస్ రమణ సూచించారు.

మరోవైపు.. సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్రం కోరింది.  కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సీజేఐ ఎన్వీ రమణ తోసిపుచ్చారు. ఈ కేసును మరో ధర్మాసనానికి జస్టిస్ రమణ బదిలీ చేశారు.


మధ్యవర్తిత్వం కుదరదు అంటే.. పిటిషన్ ను వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తానని చెప్పినట్లే... బుధవారం జస్టిస్ రమణ బదిలీ చేశారు. ఇక ఈ కేసు ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది తెలియాల్సి ఉంది. తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా ఉంది.

కృష్ణానది జలాల వివాదంపై రివర్‌బోర్డు సభ్యులు గురువారం రాయలసీమలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. బృందంలో తెలంగాణకు చెందినవారు ఎవరూ ఉండకూడదని బోర్డుకు ఇప్పటికే ఏపీ సర్కార్‌ షరతు విధించిన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలతో.. కేఆర్ఎంబీ బృందం పర్యటించబోతోంది. ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించి ఎన్జీటీకి నివేదికను ఇవ్వనుంది.


ఇదిలా ఉండగా.. మంగళవారం జరిగిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సంయుక్త సమన్వయ భేటీకి.. తెలంగాణకు చెందిన సభ్యులు గైర్హాజరయ్యారు. గెజిట్‌ ప్రకారం ప్రాజెక్టుల స్వరూపంపై అభ్యంతరాలున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నందున వివరాలు ఇవ్వాలని బోర్డు సభ్యులు కోరగా అందుకు ఏపీ నిరాకరించింది. తెలంగాణ మాత్రం పూర్తిస్థాయి బోర్డు భేటీ జరిపిన తర్వాతే.. సమన్వయ కమిటీ భేటీ జరపాలని కోరుతోంది. ఇదే అంశంపై గతంలో గోదావరి యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది. కృష్ణాబోర్డు పూర్తి స్థాయి సమావేశాన్ని అత్యవసరంగా అయినా ఏర్పాటు చేయాలని.. ఆ తర్వాతే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ వాదిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
AP Cabinet Decisions Ease: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
Banakacherla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
Chiranjeevi AP Brand Ambassador Rumors: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్!
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget