అన్వేషించండి

Chittoor News : వ్యవసాయ బావిలో పడిపోయిన ఏనుగు, అటవీ అధికారుల రెస్క్యూ ఆపరేషన్

Chittoor News : చిత్తూరు జిల్లా గాండ్లపల్లి గ్రామంలోని వ్యవసాయ బావిలో ఒక ఏనుగు ప్రమాదవశాత్తు పడిపోయింది.

Chittoor News : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గాండ్లపల్లి గ్రామం వద్ద వ్యవసాయ బావిలో ఏనుగు పడిపోయింది. ఏనుగును గుర్తించిన గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు జేసీబీ సాయంతో బావి గోడను పగలగొట్టి  ఏనుగును రక్షించారు.  

అసలేం జరిగింది? 

చిత్తూరు జిల్లాలో గుంపు నుంచి తప్పిపోయిన ఏనుగు గాండ్లపల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. చీకట్లో దారి కనిపించక ఏనుగు బావిలో పడిపోయింది. పైకి వచ్చే దారి లేకపోవడంతో ఏనుగు రాత్రంతా బావిలోనే ఉండిపోయింది. మంగళవారం ఉదయం ఏనుగును గమనించిన గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు బావి వద్దకు చేరుకున్నారు. ఏనుగు రక్షించే ప్రయత్నం చేశారు.  

స్థానికంగా ఏనుగు హల్ చల్ 

చిత్తూరు జిల్లాలోని బంగారు పాళ్యం మండలంలో ఏనుగులు గుంపు సంచరిస్తుంది. కౌండిన్య అభయారణ్యం నుంచి పొలాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపు నుంచి ఓ ఏనుగు తప్పిపోయింది. తప్పిపోయిన ఒంటరి ఏనుగు స్థానికంగా హల్‌చల్ చేసింది. బంగారుపాళ్యం మండలంలోని టేకుమంద, బండ్లదొడ్డి, శ్రీని జ్యూస్ ఫ్యాక్టరీ, జాయతీ రహదారిపై స్థానికులను భయాందోళనకు గురిచేసింది.  అదే ఒంటరి ఏనుగు మంగళవారం ఉదయం గాండ్లపల్లి గ్రామం శివారులోని వ్యవసాయ బావిలో పడిపోయింది. స్థానికంగా భయాందోళన గురిచేస్తున్న ఏనుగు, బావిలో పడ్డ ఏనుగు రెండూ ఒకటేనని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియజేశారు.  అక్కడికి చేరుకున్న అధికారులు ఏనుగును బయటకు తీసుకొచ్చేందుకు జేసీబీ సాయంతో తవ్వకం చేపట్టారు. బావి గట్టు ఒక పక్క తవ్వడంతో ఏనుగు సురక్షితంగా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఏనుగు పక్కనున్న పొలాల్లోకి పారిపోయింది. 

ఫూటుగా తాగి బజ్జున్న ఏనుగులు

ఒడిశాలోని అడవిలో దాదాపు 24 ఏనుగులు గంటల తరబడి నిద్రించాయి. నీళ్లు అనుకొని నాటుసారా తాగడం వల్లే ఇవి గాఢ నిద్రలోకి పోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.  ఒడిశా కియోంజర్‌ జిల్లా పరిధిలోని అడవిలోకి స్థానిక గ్రామస్థులు వెళ్లారు. అక్కడ దొరికే కొన్ని పూలు, పండ్లతో 'మహువా' అనే సంప్రదాయక నాటు సారాను తయారు చేయడానికి అన్నీ సిద్ధం చేశారు. తొలుత వాటిని నానబెట్టి ఇంటికి వచ్చారు. మరుసటి రోజు మంగళవారం తిరిగి అడవిలోకి వెళ్లారు. అయితే వీటిని నానబెట్టి ఉన్న కుండలు పగిలిపోయి ఉండటాన్ని చూసి షాకయ్యారు. కొంతదూరం వెళ్లి చూస్తే 24 ఏనుగులు గాఢ నిద్రలో ఉన్నాయి. కుండల్లోని నానబెట్టిన నీటిని ఏనుగులు తాగేశాయని గుర్తించిన గ్రామస్థులు.. అటవీ అధికారులకు సమచారం ఇచ్చారు.  గ్రామస్థుల సమాచారంతో అటవీ అధికారులు అక్కడికి వెళ్లారు. అధికారులు భారీ శబ్ధం చేయడంతో ఏనుగులు లేచి వెళ్లిపోయాయి. ఏనుగుల గుంపు అప్పటికే మత్తెక్కించే పువ్వులతో పులియబెట్టిన నీటిని తాగినందుకే గాఢ నిద్రలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

Also Read : Tirupati News : తిరుపతి విద్యార్థులు ఆగ్రాలో, సినిమాల ప్రభావంతో ఇంట్లోంచి పారిపోయారు- డీఐజీ రవి ప్రకాష్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget