అన్వేషించండి

Chandrababu: టీడీపీ, జనసేనలో వైసీపీ కోవర్టులు- హాట్‌టాపిక్‌గా చంద్రబాబు కామెంట్స్

Gurazala TDP Meeting: గురజాల నియోజకవర్గంలో జరిగిన రా.. కదలి.. రా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో జగన్ చెప్పాలని సవాల్ విసిరారు.

Gurazala in Palnadu District: తాము వచ్చిన వెంటనే పల్నాడు జిల్లాలోని వరికిపుడిసెల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అభివృద్దికి మారుపేరు టీడీపీ అని, విధ్వంసానికి మారుపేరు వైసీపీ అని వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లాల్లో అనేకమంది తమ్ముళ్లను పోగొట్టుకున్నానని, కోడెలను వేధించి ఆయన మృతికి వైసీపీ నేతలు కారణమయ్యారని ఆరోపించారు. శనివారం గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో జరిగిన రా.. కదలి.. రా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ  సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోలీసుల విచారణ పేరుతో పిలిచి పార్టీ కార్యకర్తలను చంపుతున్నారని, తాగునీటి కోసం వచ్చిన ఎస్టీ మహిళలను తొక్కించి చంపారని అన్నారు. పల్నాడు జిల్లాలోని నరహంతకులను వదిలిపెట్టేది లేదని, తీవ్రవాదులు, ముఠా నాయకులను అణచివేసింది తామేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఐదేళ్లలో పల్నాడులో ఒక్క పనైనా చేశారా?

'పల్నాడు జిల్లాలో 30 మందిని పొట్టనపెట్టుకున్నారు. పల్నాడులోని పలు గ్రామాల ప్రజల ఊర్లు వదిలిపోయారు. పల్నాడు జిల్లా ప్రజల అభివృద్దికి మా వెంట నడవాలి. నా ఇంటి గేట్లకు తాళాలు వేసినప్పుడు జగన్‌ను హెచ్చరించా. ఈ తాళ్లే నీ మెడకు ఉరితాళ్లు అవుతాయని ఆనాడే చెప్పా. జగన్ నోటిని శాశ్వతంగా మూయించే శక్తి మాకుంది. ఏ తప్పు చేయని ప్రత్తిపాటి శరత్‌ను అరెస్ట్ చేశారు. జగన్ చేసిన తప్పులకు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచాలి? జగన్ బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు. పులివెందుల పంచాయతీ చేస్తే కుర్చీని మడిచి మీ ఊరికి పంపిస్తాం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సిద్దం కావాలి. ఓడిపోయేందుకు సిద్దం.. సిద్దం అని జగన్ అంటున్నారు. పల్నాడు జిల్లాలో ఈ ఐదేళ్లలో ఒక్క పనైనా చేశారా? విరికిపుడిసెల ఎత్తిపోతలను ఏడాదిలోగా పూర్తి చేస్తాం. పల్నాడు జిల్లాలో తలపెట్టిన వాటర్ గ్రిడ్‌ను పూర్తి చేస్తాం' అని చంద్రబాబు పేర్కొన్నారు.

Chandrababu: టీడీపీ, జనసేనలో వైసీపీ కోవర్టులు- హాట్‌టాపిక్‌గా చంద్రబాబు కామెంట్స్

హు కిల్డ్ బాబాయ్.. జగన్ సమాధానం చెప్పాలి

పోలీస్ స్టేషన్లలో ఉంచి మన కార్యకర్తలను దారుణంగా వేధించారన్న చంద్రబాబు.. కార్యకర్తలను కాపాడుకునేందుకు యరపతినేని ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఓటు వేయాలని, మీరు నీతిగా, న్యాయంగా ఉంటే తాము కూడా అలాగే ఉంటామన్నారు. వైసీపీ ప్రభుత్వం పనైపోయిందని పోలీసులు కూడా గ్రహించాలని, తమ పోరాటం మా కోసం కాదని, ఐదుకోట్ల మంది ప్రజల బాగు కోసమని అన్నారు. హు కిల్డ్ బాబాయ్ అనేది జగన్ ఇప్పటికైనా చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు. హత్యలు చేసేవారు రాజకీయాలకు పనికిరారని జగన్ చెల్లి సునీత చెప్పిందని,  ఎంతో బాధతో జగన్ పార్టీకి ఓటేయవద్దని చెప్పిందని గుర్తు చేశారు. బాబాయ్‌ను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే జగన్ ఓటు అడగాలన్నారు. ఆస్తిలో వాటా అడిగిందని సొంత చెల్లి షర్మిలను ఇబ్బంది పెడుతున్నారని, టిష్యూ పేపర్‌లా వాడుకుని యూజ్ అంట్ త్రో విధానాన్ని జగన్  పాటిస్తున్నారని విమర్శించారు.

'మరో 40 రోజుల్లో జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్దం. జగన్‌కు అనేక ప్యాలెస్‌లు ఉన్నాయి. అవన్నీ సరిపోక విశాఖ రుషికొండలో మరో ప్యాలస్ కట్టారు. టీడీపీ, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టారు. పవన్, నా ఆలోచనలు ఒక్కటే.. మాలో విబేధాలు పెట్టలేవు. సంపద సృష్టించి ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ మాది. ఈ నెల 5వ తేదీన బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
Dangerous bike smoke: బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?

వీడియోలు

Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Akshay Kumar: నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
Telangana Assembly Budget Session: ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Weight Loss Journey : మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
Embed widget