అన్వేషించండి

Chandrababu: టీడీపీ, జనసేనలో వైసీపీ కోవర్టులు- హాట్‌టాపిక్‌గా చంద్రబాబు కామెంట్స్

Gurazala TDP Meeting: గురజాల నియోజకవర్గంలో జరిగిన రా.. కదలి.. రా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో జగన్ చెప్పాలని సవాల్ విసిరారు.

Gurazala in Palnadu District: తాము వచ్చిన వెంటనే పల్నాడు జిల్లాలోని వరికిపుడిసెల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అభివృద్దికి మారుపేరు టీడీపీ అని, విధ్వంసానికి మారుపేరు వైసీపీ అని వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లాల్లో అనేకమంది తమ్ముళ్లను పోగొట్టుకున్నానని, కోడెలను వేధించి ఆయన మృతికి వైసీపీ నేతలు కారణమయ్యారని ఆరోపించారు. శనివారం గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో జరిగిన రా.. కదలి.. రా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ  సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోలీసుల విచారణ పేరుతో పిలిచి పార్టీ కార్యకర్తలను చంపుతున్నారని, తాగునీటి కోసం వచ్చిన ఎస్టీ మహిళలను తొక్కించి చంపారని అన్నారు. పల్నాడు జిల్లాలోని నరహంతకులను వదిలిపెట్టేది లేదని, తీవ్రవాదులు, ముఠా నాయకులను అణచివేసింది తామేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఐదేళ్లలో పల్నాడులో ఒక్క పనైనా చేశారా?

'పల్నాడు జిల్లాలో 30 మందిని పొట్టనపెట్టుకున్నారు. పల్నాడులోని పలు గ్రామాల ప్రజల ఊర్లు వదిలిపోయారు. పల్నాడు జిల్లా ప్రజల అభివృద్దికి మా వెంట నడవాలి. నా ఇంటి గేట్లకు తాళాలు వేసినప్పుడు జగన్‌ను హెచ్చరించా. ఈ తాళ్లే నీ మెడకు ఉరితాళ్లు అవుతాయని ఆనాడే చెప్పా. జగన్ నోటిని శాశ్వతంగా మూయించే శక్తి మాకుంది. ఏ తప్పు చేయని ప్రత్తిపాటి శరత్‌ను అరెస్ట్ చేశారు. జగన్ చేసిన తప్పులకు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచాలి? జగన్ బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు. పులివెందుల పంచాయతీ చేస్తే కుర్చీని మడిచి మీ ఊరికి పంపిస్తాం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సిద్దం కావాలి. ఓడిపోయేందుకు సిద్దం.. సిద్దం అని జగన్ అంటున్నారు. పల్నాడు జిల్లాలో ఈ ఐదేళ్లలో ఒక్క పనైనా చేశారా? విరికిపుడిసెల ఎత్తిపోతలను ఏడాదిలోగా పూర్తి చేస్తాం. పల్నాడు జిల్లాలో తలపెట్టిన వాటర్ గ్రిడ్‌ను పూర్తి చేస్తాం' అని చంద్రబాబు పేర్కొన్నారు.

Chandrababu: టీడీపీ, జనసేనలో వైసీపీ కోవర్టులు- హాట్‌టాపిక్‌గా చంద్రబాబు కామెంట్స్

హు కిల్డ్ బాబాయ్.. జగన్ సమాధానం చెప్పాలి

పోలీస్ స్టేషన్లలో ఉంచి మన కార్యకర్తలను దారుణంగా వేధించారన్న చంద్రబాబు.. కార్యకర్తలను కాపాడుకునేందుకు యరపతినేని ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఓటు వేయాలని, మీరు నీతిగా, న్యాయంగా ఉంటే తాము కూడా అలాగే ఉంటామన్నారు. వైసీపీ ప్రభుత్వం పనైపోయిందని పోలీసులు కూడా గ్రహించాలని, తమ పోరాటం మా కోసం కాదని, ఐదుకోట్ల మంది ప్రజల బాగు కోసమని అన్నారు. హు కిల్డ్ బాబాయ్ అనేది జగన్ ఇప్పటికైనా చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు. హత్యలు చేసేవారు రాజకీయాలకు పనికిరారని జగన్ చెల్లి సునీత చెప్పిందని,  ఎంతో బాధతో జగన్ పార్టీకి ఓటేయవద్దని చెప్పిందని గుర్తు చేశారు. బాబాయ్‌ను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే జగన్ ఓటు అడగాలన్నారు. ఆస్తిలో వాటా అడిగిందని సొంత చెల్లి షర్మిలను ఇబ్బంది పెడుతున్నారని, టిష్యూ పేపర్‌లా వాడుకుని యూజ్ అంట్ త్రో విధానాన్ని జగన్  పాటిస్తున్నారని విమర్శించారు.

'మరో 40 రోజుల్లో జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్దం. జగన్‌కు అనేక ప్యాలెస్‌లు ఉన్నాయి. అవన్నీ సరిపోక విశాఖ రుషికొండలో మరో ప్యాలస్ కట్టారు. టీడీపీ, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టారు. పవన్, నా ఆలోచనలు ఒక్కటే.. మాలో విబేధాలు పెట్టలేవు. సంపద సృష్టించి ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ మాది. ఈ నెల 5వ తేదీన బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈసీకి ఓటర్ల సమగ్ర జాబితా సవరించే అధికారం ఉంది: సుప్రీంకోర్టు
ఈసీకి ఓటర్ల సమగ్ర జాబితా సవరించే అధికారం ఉంది: సుప్రీంకోర్టు
Nara Lokesh On Women Reservation: రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
TDP Hybrid Mahanadu 2026: డిజిటల్ విప్లవానికి వేదికగా హైబ్రీడ్ మహానాడు - రాజకీయంలో సరికొత్త ట్రెండ్ సెట్టర్ -కేడర్ కనెక్టివిటీయే చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
డిజిటల్ విప్లవానికి వేదికగా హైబ్రీడ్ మహానాడు - రాజకీయంలో సరికొత్త ట్రెండ్ సెట్టర్ -కేడర్ కనెక్టివిటీయే చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
Rains Alert: మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Embed widget