అన్వేషించండి

Chandrababu Bangalore : రైతు బిడ్డల కోసమే ఐటీకి ప్రోత్సాహం - ఎగతాళి చేసినా వెనక్కి చూడలేదు - బెంగళూరులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

TDP : రైతు బిడ్డలు బాగుపడాలనే తాను ఐటీకి ప్రోత్సాహం ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. సమాజం కోసం సంపాదించిన దాంట్లో ఐదు శాతం ఖర్చు పెట్టాలని సూచించారు.


Chandrababu :    ప్రపంచంలోనే తెలుగువారు నంబర్‌వన్‌గా ఉండాలనేది తన ఆకాంక్షని తెలుగుదేశం  అధినేత చంద్రబాబు (ChandraBabu) స్పష్టం చేశారు. బెంగళూరులో నిర్వహించిన బెంగళూరు టీడీపీ ఫోరం  సమావేశంలో ఆయన మాట్లాడారు.  ముఖ్యమంత్రిగా ఐటీని ప్రోత్సహించాలనుకున్నప్పుడు  విజన్‌-2020 అని చెప్పినప్పుడు నన్ను హేళన చేశారన్నారు. రైతు బిడ్డ ఐటీలో ఎందుకు పనిచేయకూడదు అని ఆలోచన చేశానని.. 30 సంవత్సరాల క్రితం చేసిన ఆలోచనతో ఈ రోజు ఇంత మంది ఐటీ ఉద్యోగులుగా స్థిరపడ్డారన్నారు.  థింక్ గ్లోబలీ... యాక్ట్ గ్లోబలీ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎక్కడ ఉన్నా గ్లోబలీ పనిచేసే అవకాశం ఉందన్నారు. కానీ ఇప్పుడు ఆ ఫలాలు అందరూ అనుభవిస్తున్నారని తెలిపారు.పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయం. పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలన్నారు. 

తనకు కష్టం వచ్చినప్పుడు అంతా అండగా నిలబడ్డారని బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులను ప్రశంసించారు.  ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే అవకాశం భారత దేశానికే ఉందన్నారు. 2047 సంవత్సరానికి భారత దేశం నెంబర్ వన్‌గా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను కూడా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. నవశకం తెలుగువారి శఖం అవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే నంబర్ వన్‌గా తెలుగు ప్రజలు ఉండాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. బెంగళూరు టీడీపీ ఫోరంను చాలా పద్ధతిగా ఆర్గనైజ్ చేస్తున్నారన్నారని  ప్రశంసించారు. 

ఆడపిల్లకు చదువెందుకు అని అన్నారని... ఇప్పుడు ఆడపిల్లలు మగవారితో సమానంగా ఎదుగుతున్నారన్నారు. ఆడపిల్లకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని విమర్శించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజంను చూడాలన్నదే తన కోరికన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించాలని దే లక్ష్యమని స్పష్టం చేశారు. పీ4 వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని.. పీ4 అంటే పబ్లిక్ ప్రయివేట్ పీపుల్ పార్టనర్ షిప్ అని టీడీపీ చీఫ్  తెలిపరు.        

ఆంధ్రప్రదేశ్‌ని బాగు చేసేందుకు మీరు ఏం చేయగలరు ప్లాన్ చేయాలని సూచించారు.  వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి. వచ్చే ఎన్నికలు ఎందుకు ముఖ్యమో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.  ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలని..   మీరు సంపాదించే దానిలో 5 శాతం  సమాజం కోసం ఖర్చు చేయాలని సూచించారు.  సమాజహితం కోసం మీరు కష్టపడాలి. నాకోసం కాదు నేను చేసే పనులు తర తరాలు గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటే నా జన్మ దన్యమైనట్లేనన్నాుర.  బెంగళూరులో సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు కుప్పంకు బయలుదేరి వెళ్లారు. కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.                                                                      

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget