అన్వేషించండి

Chandrababu Naidu: ఏపీలో నిరంకుశ పాలన, అరాచకాలపై జోక్యం చేసుకోండి- రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో హింస, నిరంకుశ పాలన, అరాచకాలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో హింస, నిరంకుశ పాలన, అరాచకాలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇటవల తనపై తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో తనపై దాడులు జరిగాయని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, తనపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్రంలో వైసీపీ ప్రణాళిక ప్రకారం దాడులకు తెగబడుతోందని, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తనపై దాడులు జరగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి తనకు ఉన్న విశేషాధికారాలతో జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో తీవ్ర ఉత్రిక్తతలు ఏర్పడుతున్నాయని, అసాధారణ పరిస్థితులు ఉన్నాయని వివరించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థల విధ్వంసం జరుగుతోందని, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. న్యాయ, కేంద్ర సంస్థలపై దాడులను వివరిస్తూ ఆయన 9 పేజీల లేఖ రాశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొంటూ.. 2019లో జగన్ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక తన ‘విధ్వంసక పాలన’ను ఆవిష్కరించారని మండిపడ్డారు. అధికారం చేపట్టిన వెంటనే ప్రజా వేదికను కూల్చివేశారని,  ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని నాశనం చేశారని దుయ్యబట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలిపారని మండిపడ్డారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని తీవ్రంగా విమర్శించారు. పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం పరిస్థితి తయారైందన్నారు. 

చిత్తూరు జిల్లాలో తనపై హత్యాయత్నం జరిగిందని, తిరగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. 2019 ఆగస్టు నుంచి ఇటీవల అంగళ్లు ఘటన వరకు తనపై జరిగిన దాడులను లేఖలో వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అనుసరించిందంటూ పేర్కొన్నారు.  రాష్ట్రంలో అశాంతి పెరిగిపోయిందని, తిరిగి శాంతి నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటూ తగు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రపతి, ప్రధానిని ఆయన కోరారు. ఈ మేరకు 9 పేజీల లేఖతో పాటు ఆయా ఘటనలకు సంబంధించిన వివరాలతో 75 పేజీల డాక్యుమెంట్‌ను, వీడియోలను చంద్రబాబు పంపించారు.

ఇటీవల చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకర్గం ముదివేడు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లు లో టిడిపి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం చేశారనే ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసులో A1‌గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి దేవినేని ఉమా, A3గా మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డి, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్‌, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు.

అలాగే పుంగనూరు పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పుంగనూరులో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనల్లో ఇరుపార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులపై దాడులు జరిగాయి. పోలీస్ అధికారికి కంటి చూపు కూడా పోయింది. పోలీసులకు చెందిన పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు  200 మందికి పైగా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget