అన్వేషించండి

Chandrababu Naidu: ఏపీలో నిరంకుశ పాలన, అరాచకాలపై జోక్యం చేసుకోండి- రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో హింస, నిరంకుశ పాలన, అరాచకాలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో హింస, నిరంకుశ పాలన, అరాచకాలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇటవల తనపై తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో తనపై దాడులు జరిగాయని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, తనపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్రంలో వైసీపీ ప్రణాళిక ప్రకారం దాడులకు తెగబడుతోందని, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తనపై దాడులు జరగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి తనకు ఉన్న విశేషాధికారాలతో జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో తీవ్ర ఉత్రిక్తతలు ఏర్పడుతున్నాయని, అసాధారణ పరిస్థితులు ఉన్నాయని వివరించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థల విధ్వంసం జరుగుతోందని, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. న్యాయ, కేంద్ర సంస్థలపై దాడులను వివరిస్తూ ఆయన 9 పేజీల లేఖ రాశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొంటూ.. 2019లో జగన్ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక తన ‘విధ్వంసక పాలన’ను ఆవిష్కరించారని మండిపడ్డారు. అధికారం చేపట్టిన వెంటనే ప్రజా వేదికను కూల్చివేశారని,  ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని నాశనం చేశారని దుయ్యబట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలిపారని మండిపడ్డారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని తీవ్రంగా విమర్శించారు. పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం పరిస్థితి తయారైందన్నారు. 

చిత్తూరు జిల్లాలో తనపై హత్యాయత్నం జరిగిందని, తిరగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. 2019 ఆగస్టు నుంచి ఇటీవల అంగళ్లు ఘటన వరకు తనపై జరిగిన దాడులను లేఖలో వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అనుసరించిందంటూ పేర్కొన్నారు.  రాష్ట్రంలో అశాంతి పెరిగిపోయిందని, తిరిగి శాంతి నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటూ తగు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రపతి, ప్రధానిని ఆయన కోరారు. ఈ మేరకు 9 పేజీల లేఖతో పాటు ఆయా ఘటనలకు సంబంధించిన వివరాలతో 75 పేజీల డాక్యుమెంట్‌ను, వీడియోలను చంద్రబాబు పంపించారు.

ఇటీవల చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకర్గం ముదివేడు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లు లో టిడిపి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం చేశారనే ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసులో A1‌గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి దేవినేని ఉమా, A3గా మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డి, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్‌, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు.

అలాగే పుంగనూరు పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పుంగనూరులో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనల్లో ఇరుపార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులపై దాడులు జరిగాయి. పోలీస్ అధికారికి కంటి చూపు కూడా పోయింది. పోలీసులకు చెందిన పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు  200 మందికి పైగా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Letter to Revanth Reddy: పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Mudragada Padmanabham Funeral Chaos: ముద్రగడ అంత్యక్రియల్లో గందరగోళం - గన్ సెల్యూట్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
ముద్రగడ అంత్యక్రియల్లో గందరగోళం - గన్ సెల్యూట్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
Chandra Babu Comments:
"సముద్రంలోకి వెళ్లే జలాలు వాడుకుంటే సంపద సృష్టి జరిగినట్టే! నదుల అనుసంధానంతో కరవు పరార్‌" ముఖ్యమంత్రి చంద్రబాబు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Embed widget