అన్వేషించండి

Chandrababu Speech: పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం - మహానాడులో చంద్రబాబు కీలక ప్రకటన

TDP: కడప స్టీల్ ప్లాంట్ పనులు పదిరోజుల్లో ప్రారంభమవుతాయని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత ఆయన ప్రసంగించారు.

Chandrababu Naidu speech In Mahanadu: బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి హాని జరగదని, సముద్రంలోకి వెళ్లే నీటినే మళ్లించుకుంటామని చంద్రబాబు కడప వేదికగా ప్రకటించారు. మహానాడులో మరోసారి టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికయిన తరవాత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. ఏపీ అత్యంత దిగువ రాష్ట్రమని.  ఏపీకి వరదలు వస్తే అవి సముద్రంలోకి వెళ్లిపోతాయన్నారు. ఆ నీటిని రాయలసీమకు మళ్లించుకునేందుకు బనకచర్ల నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ కేటాయింపుల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా తోడుకోబోమని స్పష్టం  చేశారు.  ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు వంటివి అని చంద్రబాబు  మరోసారి ప్రకటించారు. 

అలాగే బెంగళూరులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశ్రమను అక్కడి నుంచి తొలగించి ఏపీలో పెట్టాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారంటూ కర్ణాటకలో జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు. తాను ఎప్పుడూ అలాంటి పనులు చేయబోనని స్పష్టం చేశారు. వేరే రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు తరలించుకుపోవాలని అనుకోనన్నారు. అనంతపురం జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాల్సి ఉందన్నారు. లేపాక్షి ఏరోస్పేస్ పరిశ్రమలకు అనుకూలమని.. ఆ అంశంపైనే కేంద్రంతో చర్చించానన్నారు. 

కడప స్టీల్ ప్లాట్ పనులు పది రోజుల్లో ప్రారంభమవుతాయని ప్రకటించారు. గజంలో ఈ స్టీల్ ప్లాంట్ కు జిందాల్ శంకుస్థాపన చేశారు.కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. తెలుగుజాతి ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందని చంద్రబాబు అన్నారు రానున్న 40 ఏళ్లకు ప్రణాళికలు రూపొందించుకున్నామని  తెలిపారు.  గత ఐదేళ్లు ఏపీలో శాంతిభద్రతలు లేవని, వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. . బాబాయిని హత్య చేసి ఆ నింద మనపై మోపాలని చూశారని అయితే తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఏపీలో గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామన్నారు. శాంతిభద్రతలను ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. తప్పు చేసినవారి పట్ల చండశాసనుడిలా ఉంటానని చంద్రబాబు హెచ్చరిచారు.  రాయలసీమను ఎడారి కానివ్వమని, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. అలాగే, 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు  ప్రకటించారు. 

మరోసారి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు

చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  1995లో తొలిసారి  అధ్యక్ష పదవిని చేపట్టారు.  మూడు దశాబ్దాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.   1982లో ఎన్టీఆర్ స్థాపించినా, 1995లో పార్టీ పగ్గాలు చంద్రబాబు తీసుకున్నారు.    మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంద్రబాబుకు, పార్టీ అధ్యక్ష పదవిలో మరోసారి బాధ్యతలు అప్పగించడంలో కార్యకర్తలు ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించారు. కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చంద్రబాబు తెలిపారు.      

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget