అన్వేషించండి

Chandrababu: జెండాలు వేరైనా 3 పార్టీల అజెండా ఒకటే, ఈ ఎన్నికల్లో గెలుపు NDAదే: చంద్రబాబు

Andhra Pradesh Elections 2024: ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజధానుల మూడు ముక్కలాటతో అమరావతిని భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

Prajagalam Public Meeting at Chilakaluripet: చిలకలూరిపేట: వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపు అని, ఎవరికీ సందేహం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. మోదీ ఒక వ్యక్తి కాదు.. భారత్ను విశ్వగురుగా మారుస్తున్న శక్తి అని, మోదీ అంటే సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు, ఆత్మవిశ్వాసం అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. మన కూటమికి అండగా ఉంటామని సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు సైతం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

Chandrababu: జెండాలు వేరైనా 3 పార్టీల అజెండా ఒకటే, ఈ ఎన్నికల్లో గెలుపు NDAదే: చంద్రబాబు

జెండాలు వేరైనా మూడు పార్టీల అజెండా ఒక్కటే..
‘మూడు పార్టీల జెండాలు వేరైనా తమ అజెండా ఒక్కటే. అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి ప్రధాని మోదీ. సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పారు మోదీ. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేవి ప్రధాని మోదీ నినాదాలు. పేదరికం లేని భారత్ అనేది మోదీ కల అని మనకు తెలుసు. ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ప్రధాని మోదీ ఆశయాలతో మనమంతా ఏకం కావాలి. సరైన సమయంలో దేశానికి మోదీ లాంటి నేత ప్రధాని అయ్యారు’ - చంద్రబాబు 


Chandrababu: జెండాలు వేరైనా 3 పార్టీల అజెండా ఒకటే, ఈ ఎన్నికల్లో గెలుపు NDAదే: చంద్రబాబు

3 ముక్కలాటతో అమరావతిని భ్రష్టు పట్టించిన జగన్ 
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజధానుల మూడు ముక్కలాటతో అమరావతిని భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. 2014లో మేం వచ్చాక 11 జాతీయ విద్యాసంస్థలను తెచ్చినట్లు గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణం ప్రారంభించాం అన్నారు. గతంలో కేంద్రం సాయంతో పోలవరాన్ని 72 శాతం పూర్తి చేయగా.. అధికారంలోకి వచ్చిన జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఈ ప్రజాగళం సభ. రాబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు ఏపీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. వైసీపీ పాలనలో గత ఐదేళ్లలో విధ్వంసం జిరగింది, ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి కనుక ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు మూడు పార్టీలు జత కట్టాయని కూటమి ఆవశ్యకతను చంద్రబాబు వివరించారు.

జగన్ అధికార దాహానికి బాబాయ్‌ బలయ్యారు! 
వైసీపీ పాలనతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. పారిశ్రామిక వేత్తలు భయపడి పారిపోతున్నారు. మరికొందర్ని వైసీపీ ప్రభుత్వం తరిమేసింది. టీడీపీ, జనసేన నేతలతో పాటు తనపై సైతం అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేసిన ఘనుడు వైఎస్ జగన్. ఇసుక, మైనింగ్, భూములు ఇలా అన్నింటిని దోచేశారు. సీఎం జగన్ అధికార దాహానికి ఆయన బాబాయ్‌ వివేకా బలయ్యారు. జగన్‌ ఇద్దరు చెల్లెళ్లు సైతం రోడెక్కి తన సోదరుడికి, వైసీపీకి ఓటు వేయొద్దని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ భవనాలు తాకట్టులో ఉన్నాయి. 400+ సీట్లతో దేశంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుంది. రాష్ట్రం నుంచి 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత మనపై ఉంది. - చంద్రబాబు


Chandrababu: జెండాలు వేరైనా 3 పార్టీల అజెండా ఒకటే, ఈ ఎన్నికల్లో గెలుపు NDAదే: చంద్రబాబు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget