అన్వేషించండి

Chandrababu: జెండాలు వేరైనా 3 పార్టీల అజెండా ఒకటే, ఈ ఎన్నికల్లో గెలుపు NDAదే: చంద్రబాబు

Andhra Pradesh Elections 2024: ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజధానుల మూడు ముక్కలాటతో అమరావతిని భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

Prajagalam Public Meeting at Chilakaluripet: చిలకలూరిపేట: వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపు అని, ఎవరికీ సందేహం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. మోదీ ఒక వ్యక్తి కాదు.. భారత్ను విశ్వగురుగా మారుస్తున్న శక్తి అని, మోదీ అంటే సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు, ఆత్మవిశ్వాసం అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. మన కూటమికి అండగా ఉంటామని సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు సైతం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

Chandrababu: జెండాలు వేరైనా 3 పార్టీల అజెండా ఒకటే, ఈ ఎన్నికల్లో గెలుపు NDAదే: చంద్రబాబు

జెండాలు వేరైనా మూడు పార్టీల అజెండా ఒక్కటే..
‘మూడు పార్టీల జెండాలు వేరైనా తమ అజెండా ఒక్కటే. అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి ప్రధాని మోదీ. సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పారు మోదీ. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేవి ప్రధాని మోదీ నినాదాలు. పేదరికం లేని భారత్ అనేది మోదీ కల అని మనకు తెలుసు. ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ప్రధాని మోదీ ఆశయాలతో మనమంతా ఏకం కావాలి. సరైన సమయంలో దేశానికి మోదీ లాంటి నేత ప్రధాని అయ్యారు’ - చంద్రబాబు 


Chandrababu: జెండాలు వేరైనా 3 పార్టీల అజెండా ఒకటే, ఈ ఎన్నికల్లో గెలుపు NDAదే: చంద్రబాబు

3 ముక్కలాటతో అమరావతిని భ్రష్టు పట్టించిన జగన్ 
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజధానుల మూడు ముక్కలాటతో అమరావతిని భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. 2014లో మేం వచ్చాక 11 జాతీయ విద్యాసంస్థలను తెచ్చినట్లు గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణం ప్రారంభించాం అన్నారు. గతంలో కేంద్రం సాయంతో పోలవరాన్ని 72 శాతం పూర్తి చేయగా.. అధికారంలోకి వచ్చిన జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఈ ప్రజాగళం సభ. రాబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు ఏపీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. వైసీపీ పాలనలో గత ఐదేళ్లలో విధ్వంసం జిరగింది, ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి కనుక ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు మూడు పార్టీలు జత కట్టాయని కూటమి ఆవశ్యకతను చంద్రబాబు వివరించారు.

జగన్ అధికార దాహానికి బాబాయ్‌ బలయ్యారు! 
వైసీపీ పాలనతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. పారిశ్రామిక వేత్తలు భయపడి పారిపోతున్నారు. మరికొందర్ని వైసీపీ ప్రభుత్వం తరిమేసింది. టీడీపీ, జనసేన నేతలతో పాటు తనపై సైతం అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేసిన ఘనుడు వైఎస్ జగన్. ఇసుక, మైనింగ్, భూములు ఇలా అన్నింటిని దోచేశారు. సీఎం జగన్ అధికార దాహానికి ఆయన బాబాయ్‌ వివేకా బలయ్యారు. జగన్‌ ఇద్దరు చెల్లెళ్లు సైతం రోడెక్కి తన సోదరుడికి, వైసీపీకి ఓటు వేయొద్దని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ భవనాలు తాకట్టులో ఉన్నాయి. 400+ సీట్లతో దేశంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుంది. రాష్ట్రం నుంచి 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత మనపై ఉంది. - చంద్రబాబు


Chandrababu: జెండాలు వేరైనా 3 పార్టీల అజెండా ఒకటే, ఈ ఎన్నికల్లో గెలుపు NDAదే: చంద్రబాబు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget