అన్వేషించండి

థర్మల్‌ కంపెనీ కేసులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ ఛార్జిషీట్‌...

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజుకు 2021 సంవత్సరం ఆఖరి రోజు రెండు దెబ్బలు తగిలాయి. ఒకటి సీబీఐ కొడితే ఇంకొకటి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ కొట్టింది.

ఎప్పటి నుంచే సాగుతున్న ఇండ్‌భారత్‌ థర్మల్‌ పవర్‌ కంపెనీ కేసు విషయంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 2018లో రిజిస్టర్‌ అయిన కేసు విషయంలో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రఘురామ సహా 16 మందిని నిందితులుగా తేల్చింది. కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని మోసం చేశారని తన ఛార్జిషీట్‌లో పేర్కొంది కేంద్రదర్యాప్తు సంస్థ. 
2018 అక్టోబర్ 3న ఇండ్‌భారత్‌సహా డైరెక్టర్లపై కేసు రిజిస్టర్‌ అయింది. 2019 ఏప్రిల్‌ 29న సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేసింది. ఈ ఎంక్వయిరీలో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయని చెబుతోంది సీబీఐ. 
తమిళనాడులో ట్యుటికోరిన్‌ థర్మల్‌ విద్యుదుత్పత్తి సంస్థ ఏర్పాటు చేస్తామంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఛైర్మన్‌గా ఉన్న ఇండ్‌భారత్‌ కంపెనీ 947.71 కోట్లు రుణం తీసుంది. ఈ రుణాన్ని ఆర్‌ఈసీ, ఐఐఎఫ్‌సీఎల్‌తో కూడిన కన్సార్షియం నుంచి తీసుకుంది. ఈ డబ్బుతో థర్మల్‌ విద్యుదుత్పత్తి కంపెనీ పూర్తి చేయలేదు కదా రుణ ఒప్పంద రూల్స్‌ కూడా పాటించలేదు. 
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో ఆ రుణాలను మళ్లించారని సీబీఐ ఆరోపణలు చేస్తోంది. కాంట్రాక్టర్లకు అడ్వాన్సుగా చెల్లింపులు చేశారని పేర్కొంది. పిక్స్‌డ్‌ చేసిన డబ్బు నుంచి మళ్లీ రుణాలు తీసుకున్నారని సీబీఐ ప్రధాన ఆరోపణ. ఈ ప్రక్రియతో అప్పులు ఇచ్చిన కంపెనీలు నష్టపోయాయని పేర్కొంది సీబీఐ. 
థర్మల్‌ కంపెనీ ఏర్పాటు పేరుతో ఇండ్‌ భారత్‌ కంపెనీ అక్రమంగా నిధులు వాడుకుందని... దీని వల్ల కన్షార్షియం 947.71 నష్టపోవడానికి కారణమైందని సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది. 

మరోవైపు ఇదే కేసులో ఇండ్‌భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ దివాలా సంస్థగా ప్రకటించింది నేషనల్‌ కంపెనీలా ట్రైబ్యునల్‌.  పరిష్కారానికి అనుమతిస్తూ హైదరాబాద్‌ బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది. ఇండ్‌ భారత్‌ కంపెనీ తీసుకున్న 327.51కోట్లు చెల్లించకపోవడంతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు పిటిషన్ వేసింది. రూ. 1383.38కోట్ల వసూలు కోసం దిల్లీ రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌లో బ్యాంకుల కన్సార్షియం పిటిషన్ వేశాయి. వీటికి ఇండ్‌ భారత్‌ కంపెనీ 872.63 కోట్లను మాత్రమే హామీ ఇచ్చింది. 
ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ వేసే ముందు తమకు నోటీసులు ఇవ్వలేదని... వ్యక్తిగత పిటిషన్ వేయడానికి వీల్లేదని అందుకే దివాలా ప్రక్రియకు అనుమతి ఇవ్వొద్దంటూ ఇండ్‌భారత్‌ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అన్ని అంశాలను పరిశీలించాక ఇండ్‌ భారత్‌ థర్మల్‌ దివాలా ప్రక్రియ చేపట్టడానికి అనుమతి ఇచ్చింది. దివాలా పరిష్కార నిపుణుడిగా శ్రీకాకుళం వంశీకృష్ణను నియమించింది. ఇండ్‌ భారత్‌ ఆస్తుల క్రయవిక్రయాలపై నిషేధం విధించింది. 

Also Read: తమిళ హీరోలు ప్రజల కోసం పోరాడతారు... తెలుగు హీరోలు తమ కోసం కూడా నోరెత్తలేరా ? .. టీడీపీ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Highcourt: కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
Botsa tears: వైఎస్‌ను గుర్తు చేసుకుని ఏడ్చిన బొత్స - అచ్చెన్నాయుడు విమర్శలపై ఆగ్రహం
వైఎస్‌ను గుర్తు చేసుకుని ఏడ్చిన బొత్స - అచ్చెన్నాయుడు విమర్శలపై ఆగ్రహం
Atchannaidu: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
Jagan Vs Sharmila: జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Highcourt: కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
US-Iran Conflict: ఇరాన్, అమెరికా మధ్య వర్కౌట్ కాని కాల్పుల విరమణ ఒప్పందం! పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత!
ఇరాన్, అమెరికా మధ్య వర్కౌట్ కాని కాల్పుల విరమణ ఒప్పందం! పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత!
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Gold Price: మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
KKR vs LSG Match Update: కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
Atchannaidu: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
Jagan Vs Sharmila: జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
Embed widget