అన్వేషించండి

CAG Report : శాసనసభ ఆమోదం లేకుండా రూ.2.36 లక్షల కోట్లు వినియోగించేశారు - ఏపీ ఆర్థిక లావాదేవీలపై కాగ్ నివేదిక

CAG Report : 2014 -2020 మధ్య సుమారు రూ.2.36 లక్షల కోట్ల నిధులను శాసనసభ ఆమోదం లేకుండా ఏపీ ప్రభుత్వం వినియోగించిందని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ప్రత్యేక బిల్లుల పేరిట అనధికార లావాదేవీలు జరిగాయని తేల్చింది.

CAG Report : ఏపీలో శాసనసభ ఆమోదం లేకుండా ప్రత్యేక బిల్లుల కింద అనధికార లావాదేవీలు జరిగాయని కాగ్ నివేదిక(CAG Report) ఇచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ ఆర్థిక లావాదేవీలపై శాసనసభకు కాగ్ నివేదిక సమర్పించింది.  2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.35,540 కోట్ల రెవెన్యూ లోటు(Revenue Deficit) ఉందని కాగ్ తెలిపింది. 2020-21 నాటికి ఏపీకి రూ.3,48,246 కోట్ల రుణాలు ఉన్నట్టు కాగ్‌ పేర్కొంది. దాంతో పాటు రూ.55,167 కోట్ల ద్రవ్య లోటు ఉన్నట్టు వెల్లడించింది. శాసనసభ ఆమోదం లేకుండా ఏపీ ప్రభుత్వం(AP Govt) రూ. 1,10,509 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ తన నివేదికలో తెలిపింది. 

శాసనసభ ఆమోదం లేకుండా నిధుల వినియోగం 

2014-15 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు రూ.2,36,811 కోట్ల నిధులను శాసనసభ ఆమోదం లేకుండా ప్రభుత్వాలు వినియోగించాయని కాగ్‌ నివేదికలో పేర్కొంది. శాసనసభలో ఆమోదం లేకుండా నిధుల ఖర్చు పెట్టడం ఆర్టికల్ 204, 205 నిబంధనల ఉల్లంఘనేనని కాగ్‌ పేర్కొంది. ప్రత్యేక బిల్లుల కింద రూ. 48,284 కోట్లు అనధికార లావాదేవీలు జరిగాయని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. 2021 అక్టోబరు 12వ తేదీన జరిగిన ఈ లావాదేవీలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఆర్డర్ నెంబరు 80 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని తెలిపింది. 

ఆ రూ.25 వేల కోట్ల రుణం బడ్జెట్ లో చూపించలేదు 

2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్(Off Budget Borrowings) పేరిట రూ.38,312 కోట్లు వివిధ బ్యాంకుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినట్టు కాగ్‌ పేర్కొంది. ఈ లావాదేవీలు బడ్జెట్ లో చూపించలేదని తెలిపింది. 2021 మార్చి 31వ తేదీ నాటికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు రూ.1,16,330 కోట్లు చేరాయని కాగ్ వెల్లడించింది. వివిధ సంక్షేమ పథకాల(Welfare Schemes) అమలుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం రూ.25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చినా వివరాలు బడ్జెట్(Budget)లో చూపించలేదని కాగ్‌ నివేదికలో పేర్కొంది. 

బడ్జెట్ లో ఏపీ రెవెన్యూ లోటు 

2022-23 ఆర్థిక సంవత్సరానికి 2,56, 257 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదించారు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. ఇందులో రెవెన్యూ వ్యయం అంచా 2,08, 261 కోట్లగా పేర్కొన్నారు. మూలధన వ్యయం అంచనా 47,996 కోట్ల రూపాయలుగా చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 17,036 కోట్ల రూపాయలు ఉండబోతుందని... ద్రవ్య లోటు 48, 724 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 1.27శాతంగా, ద్రవ్యలోటు 3.64శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తుమ్మిడిహెట్టి వివాదంపై చర్చలకు సిద్ధమని మహారాష్ట్ర సీఎంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ
తుమ్మిడిహెట్టి వివాదంపై చర్చలకు సిద్ధమని మహారాష్ట్ర సీఎంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Pawan Kalyan Producers Meeting: పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
Remote Robotic Surgery : హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Pune Porsche Crash Case: పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Embed widget