అన్వేషించండి

Bjp On CM Jagan Photo : జగన్ పోస్టర్ పై బీజేపీ అభ్యంతరం, శివాలయాల వద్ద నిరసన

సీఎం జగన్ బాల శివుడికి పాలు తాగిస్తున్నట్లు అధికార వైసీపీ పార్టీ ప్రచారం చేయడం హిందూ ధర్మాన్ని కించపరచడమే అవుతుందని నెల్లూరు మూలపేట శివాలయం వద్ద బీజేపీ నేతలు నిరసన చేశారు.

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వైసీపీ వేసిన ఓ పోస్టర్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నెల్లూరులో కూడా బీజేపీ నాయకులు బ్యానర్లతో ఆందోళన చేపట్టారు.  

ఆదిదేవుడు శివుడుని బాలునిగా చిత్రీకరించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ శివుడికి పాలు తాగిస్తున్నట్లు అధికార వైసీపీ పార్టీ ప్రచారం చేయడం హిందూ ధర్మాన్ని కించపరచడమే అవుతుందని నెల్లూరు మూలపేట శివాలయం వద్ద బీజేపీ నేతలునిరసన తెలిపారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పైశాచిక పాలనకు నిదర్శనంగా వైసిపి పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని అన్నారు. జగన్ సర్కార్ కు హిందువుల పట్ల చులకన భావం ఉన్నట్లు శివరాత్రి సందర్భంగా ప్రచారం చేసిన ఈ కార్టూన్ స్పష్టం చేస్తుందని విమర్శించారు. వైసీపీ తప్పు తెలుసుకుని హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ నమామిగంగే  రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్, వీర రాఘవులు, గంగుల జనార్ధన్ యాదవ్, డాక్టర్ సుప్రియ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

క్షమాపణకు డిమాండ్..

శివరాత్రి సందర్భంగా వేసిన పోస్టర్ ని వెంటనే సోషల్ మీడియానుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల వద్ద నిరసనలు తెలియజేస్తామని చెప్పింది. వైసీపీ దీన్ని లైట్ తీసుకోవడంతో బీజేపీ నేతలునిరసనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నెల్లూరులో కూడా ఆందోళనలు జరిగాయి.

సోషల్ మీడియాలో ట్రోలింగ్..

మరోవైపు వైసీపీ పోస్టర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం బాల శివుడు అంటూ ఆందోళనలు చేపట్టడం విశేషం. వైసీపీ పోస్టర్ లో కేవలం ఓ బాలికకు జగన్ పాలు పడుతున్నట్టుగా ఉంది. శివరాత్రి సందర్భంగా ఇలా పాలుపట్టే పోస్టర్ పెట్టడాన్ని కొంతమంది నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. శివారాధనలో అభిషేకాలు ముఖ్యం. అందులోనూ శివరాత్రి సందర్భంగా శివుడికి పాలాభిషేకాలు చేస్తుంటారు. పాలాభిషేకాలు చేయొద్దనే ఉద్దేశంతోనే ఇలా పిల్లలకు జగన్ పాలు పడుతున్న పోస్టర్ ని ట్విట్టర్లో ఉంచారా అంటూ ఆ ట్వీట్ కి కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. జే బ్రాండ్ మద్యాన్ని జగన్ యువతకు పడుతున్నట్టుగా మరికొంతమంది సెటైరిక్ గా పోస్టర్లు వేశారు. సహజంగా నాయకులు పండగలకి, ఇతర సందర్భాల్లో ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు వేస్తుంటారు. కానీ ఈసారి వైసీపీ కాస్త వెరైటీగా జగన్ శుభాకాంక్షలు చెబుతున్నట్టుగా పోస్టర్ వేసింది. అందులో సీఎం జగన్ ఓ బాలికకు పాలు పడుతున్నట్టుగా ఉన్న పోస్టర్ ఉంది. ఆ పోస్టర్ వివాదానికి కారణం అయింది. ఇప్పటికింకా పోస్టర్ విషయంలో వైసీపీకి వెనక్కి తగ్గేలా లేదు. పోస్టర్ పై వైసీపీనుంచి ఎలాంటి వివరణ లేదు. బీజేపీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. 

కన్నా రాజీనామా తర్వాత బీజేపీ ఏపీలో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఆ వివాదం నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకే ఇలా వైసీపీ పోస్టర్ ని వివాదం చేస్తోందనే విమర్శలు కూడా వినపడుతున్నాయి. అయితే బీజేపీ నేతలు ఇవేవీ పట్టించుకోవడంలేదు.

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget